
చిన్నారి చికిత్సకు రూ.1,05,600 సాయం
కొయ్యలగూడెం: చిన్నారి చికిత్స నిమిత్తం దాతలు స్పందించి సాయం అందజేశారు. కొయ్యలగూడెంకు చెందిన కంచర్ల జ్యోత్స్న (7) అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఆమెకు కాకినాడలో చికిత్స చేయిస్తుండగా ప్లాస్మా థెరపీ అవసరమని, రూ.12 లక్షల వరకు ఖర్చు అవుతోందని వైద్యులు తెలపడంతో చిన్నారి కుటుంబ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. దీనిపై ఈనెల 29న ‘ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు’ శీర్షికన సాక్షి కథనం ప్రచురించింది. దీనికి స్పందించిన కొల్లూరు సత్తిబాబు ఫ్రెండ్స్ సర్కిల్ రూ. రూ.1,05,600 జోత్స్న బంధువులకు అందజేశారు. ఈ సందర్భంగా సత్తిబాబు మాట్లాడుతూ చిన్నారి మెరుగైన వైద్యానికి ప్రజాప్రతినిధులు సహకరించాలని, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిధులు ఇప్పించాలని కోరారు.

చిన్నారి చికిత్సకు రూ.1,05,600 సాయం