హోరెత్తిన పోరు | - | Sakshi
Sakshi News home page

హోరెత్తిన పోరు

Jun 24 2025 3:51 AM | Updated on Jun 24 2025 3:51 AM

హోరెత

హోరెత్తిన పోరు

యువతను పాతాళంలోకి తొక్కేస్తున్నారు

చంద్రబాబు యువతను, విద్యార్థులను పాతాళంలోకి తొక్కేస్తున్నారు. ఏటా 4 లక్షల ఉద్యోగాలు చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. తొలి ఏడాది 4 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి. రాష్ట్రంలో ప్రజలందరినీ మోసం చేసినట్టుగా యువతను, విద్యార్థులను చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు.

– గొల్లపల్లి సూర్యారావు, మాజీ మంత్రి,

కోఆర్డినేటర్‌ రాజోలు నియోజకవర్గం

యువగళం పాదయాత్రలో

ఇచ్చిన వాగ్దానం ఏమైంది?

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు. ఉద్యోగ అవకాశాలు వచ్చే లోపు నిరుద్యోగ యువతకు నెలకు రూ.3వేలు చొప్పున నిరుద్యోగభృతి అందిస్తానని యువగళం పాదయాత్రలో ప్రస్తుత విద్యాశాఖమంత్రి నారా లోకేష్‌ ఇచ్చిన వాగ్దానం ఏమైంది.

– పినిపే శ్రీకాంత్‌, అమలాపురం

నియోజకవర్గ కోఆర్డినేటర్‌

యువతే దేశానికి,

రాష్ట్రానికి వెన్నెముక

యువత స్వయంకృషితో చదువుకుని ముందుకు వెళ్తే సాంకేతిక పరిజ్ఞానం పెరిగి దేశానికి, రాష్ట్రానికి వెన్నెముకగా నిలుస్తుంది. 2004 తరువాత దివంగత నేత వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రతీ విద్యార్ధి చదువుకునేలా ఫీజు రీయింబర్స్‌మెంటును తీసుకొచ్చి విద్యా విధానాన్ని ప్రోత్సహించారు. అదే బాటలో మాజీ ముఖ్యమంత్రి జగనన్న ఆ పథకాలను రెట్టింపు చేసి విద్యార్థులను అన్ని విధాలా ఆదుకున్నారు. కూటమి ప్రభుత్వం విద్యావ్యస్థను నిర్వీర్యం చేస్తోంది.

– మిండగుదిటి శిరీష్‌,

విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు

కదం తొక్కిన విద్యార్థులు, యువత

అమలాపురం నల్లవంతెన నుంచి

కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ

జిల్లా నలుమూలల నుంచి వచ్చిన

వైఎస్సార్‌ సీపీ క్యాడర్‌

మద్దతు తెలిపిన విద్యార్థి,

యువజన సంఘాలు

ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో

మారుమోగిన కలెక్టరేట్‌

మూడుచోట్ల అడ్డుకున్న పోలీసులు

వారిని నెట్టుకుని మరీ ముందుకు..

ప్రభుత్వ మోసంపై ధ్వజమెత్తిన నేతలు

సాక్షి, అమలాపురం/ అమలాపురం రూరల్‌/ ఉప్పలగుప్తం: టీడీపీ సూపర్‌ సిక్స్‌ మేనిఫెస్టోలో ప్రకటించిన నిరుద్యోగ భృతి... ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ప్రచారా సభల్లో ఊదరగొట్టిన ఉద్యోగల భర్తీ, జాబ్‌ క్యాలెండర్‌ వంటి హామీలను తక్షణం నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌ సీపీ కదం తొక్కింది. ఏడాది కాలంగా నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం చేసిన మోసానికి నిరసనగా వైఎస్సార్‌ సీపీ సోమవారం నిర్వహించిన యువత పోరుతో జిల్లా కేంద్రం అమలాపురం హోరెత్తింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పార్టీ ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధుల ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో దిక్కులు పిక్కటిల్లాయి. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కేంద్రమైన అమలాపురం నల్ల వంతెన వద్ద ఉన్న వంటెద్దు వెంకన్నాయుడు షాపింగ్‌ కాంప్లెక్స్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్‌లో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కూటమి ఏడాది పాలనలో మోసాలను ఎండగట్టారు. ముఖ్యంగా నిరుద్యోగ భృతి, కొత్త ఉద్యోగాల కల్పన ఎప్పుడని నిలదీశారు. ఉన్న ఉద్యోగాలను తొలగించడాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వం వెంటనే నిరుద్యోగ భృతి అందించాలని నినదించారు. అనంతరం ఈ మేరకు డీఆర్వో ఎస్‌.రాజకుమారికి పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పిల్లి సూర్య ప్రకాష్‌, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మిండగుదిటి శిరీష్‌ నారాయణల ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. శాసనమండలి సభ్యుడు బొమ్మి ఇజ్రాయిల్‌, రాజోలు, ముమ్మిడివరం, అమలాపురం, రామచంద్రపురం, పి.గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్లు గొల్లపల్లి సూర్యారావు, పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్‌, పినిపే శ్రీకాంత్‌, పిల్లి సూర్యప్రకాష్‌, గన్నవరపు శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్‌, మాజీ ఎమ్మెల్యే పాములు రాజేశ్వరిదేవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి పితాని బాలకృష్ణ, విద్యార్థి విభాగం ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల రీజినల్‌ కోఆర్డినేటర్‌ జిల్లెల్ల రమేష్‌, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి ఉంగరాల సంతోష్‌, సోషల్‌ మీడియా రాష్ట్ర కార్యదర్శి నేతల నాని, ఆయా విభాగాల జిల్లా అధ్యక్షులు మిండగుదుటి శిరీష్‌, షేక్‌ అబ్దుల్‌ ఖాదర్‌, దొమ్మేటి సత్యమోహన్‌, జిన్నూరు వెంకటేశ్వరరావు, జాన గణేష్‌, తోరం గౌతమ్‌ రాజా, వంగా గిరిజాకుమారి, చీకట్ల కిషోర్‌, జిల్లా అధికార ప్రతినిధులు పెమ్మిరెడ్డి మురళీకృష్ణ, సుధా గణపతి, కుడిపూడి భరత భూషణ్‌, కాశి బాలముని కుమారి, మందపాటి కిరణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

పోలీసుల అవాంతరాలు

అమలాపురంలో వైఎస్సార్‌ సీపీ చేపట్టిన విద్యార్థి.. యువత పోరుకు ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టించింది. పోలీసులను అడ్డుపెట్టుకుని నిరసనను భగ్నం చేయాలని చూసింది. కలెక్టరేట్‌కు శాంతియుతంగా నిర్వహిస్తున్న ర్యాలీని రోప్‌ వేలు, బారికేడ్లు పెట్టి నిలిపివేయాలని చూసింది. మూడుచోట్ల పోలీసు జులుం ప్రదర్శించారు. తొలుత ర్యాలీ ప్రారంభమైన చోట, మరోసారి కలెక్టరేట్‌కు సమీపంలోను, మూడవసారి కలెక్టరేట్‌ మెయిన్‌ గేటు వద్ద కార్యకర్తలకు అడ్డంకులు సృష్టించారు. కలెక్టర్‌ కార్యాలయం సమీపంలో బారికేడ్లు, రోప్‌ పార్టీలతో కార్యకర్తలను, నాయకులను నిలువరించారు. ముందుకు వస్తున్న వారిని పోలీసులు వెనక్కు నెట్టివేశారు. ఈ సమయంలో తోపులాట చోటు చేసుకుంది. పార్టీకి చెందిన మహిళలను సైతం పోలీసులు వెనక్కు నెట్టివేశారు. దీనిపై ఆగ్రహించిన పార్టీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులను నెట్టుకుని కార్యకర్తలు ముందుకు వచ్చారు. కలెక్టర్‌ కార్యాలయం ప్రధాన గేట్లను మూసివేసిన పోలీసులు వాటి ముందు బారికేడ్‌లు పెట్టి మరోసారి రోప్‌ పార్టీతో అడ్డుకున్నారు. తాము శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని, కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇస్తామని చెబుతున్నా ఎందుకు ఇంతమంది పోలీసులను పెట్టి అడ్డుకుంటున్నారని నాయకులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. దీనితో అమలాపురం డీఎస్పీ టి.ఎస్‌.ఆర్‌.కె.ప్రసాద్‌ కొంతమందికి మాత్రమే అనుమతి ఇస్తామని చెప్పి వారిని కలెక్టరేట్‌లోకి పంపించారు.

యువతను రోడ్డున పడేశారు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత యువతను, విద్యార్థులను రోడ్డుపై పడేశారు. విద్యార్థులకు ఫీజులు చెల్లించక రాష్ట్రంలో ఉన్న వేల మంది విద్యాసంస్థల యాజమాన్యాలు చేసే ఒత్తిళ్లకు ఫీజులు చెల్లించలేక లబోదిబోమంటున్నారు. కొత్త ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ఈ మోసపూరిత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2.60లక్షల మంది వలంటీర్‌లు, 18వేల మంది ఇతర కాంట్రాక్టు ఉద్యోగులను కలిపి 4 లక్షల ఉద్యోగాలను తొలగించి యువతకు తీవ్రమైన అన్యాయం చేసింది. సంవత్సర కాలంలో బకాయిల్లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంటును ప్రభుత్వం తక్షణమే చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలి.

– పిల్లి సూర్యప్రకాష్‌, యువజన విభాగం

జిల్లా అధ్యక్షుడు, రామచంద్రపురం నియోజకవర్గం కోఆర్డినేటర్‌

విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేశారు

కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో నిరుద్యోగ యువత, విద్యార్థులను మోసం చేసింది. విద్యార్థులకు చెల్లించవలసి ఫీజు రీయింబర్స్‌మెంటు విడుదల చేయకపోవడంతో తల్లిదండ్రులు అప్పులు బారిన పడుతున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌, మంత్రి లోకేష్‌లు అధికారంతో వచ్చిన వెంటనే నాలుగు లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు.

– బొమ్మి ఇజ్రాయిల్‌, ఎమ్మెల్సీ

తల్లికి వందనం పథకం కోత పెట్టారు

ఎన్నికల్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం ఇస్తామని హామీ ఇచ్చి నిబంధనల పేరుతో అందరికీ ఇవ్వకుండా కోత పెట్టారు. పేద వర్గాలతోపాటు ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలకు నిలిపివేసి అన్యాయం చేశారు.

– గన్నవరపు శ్రీనివాసరావు,

పి.గన్నవరం నియోజకవర్గం కో ఆర్డినేటర్‌

హోరెత్తిన పోరు1
1/9

హోరెత్తిన పోరు

హోరెత్తిన పోరు2
2/9

హోరెత్తిన పోరు

హోరెత్తిన పోరు3
3/9

హోరెత్తిన పోరు

హోరెత్తిన పోరు4
4/9

హోరెత్తిన పోరు

హోరెత్తిన పోరు5
5/9

హోరెత్తిన పోరు

హోరెత్తిన పోరు6
6/9

హోరెత్తిన పోరు

హోరెత్తిన పోరు7
7/9

హోరెత్తిన పోరు

హోరెత్తిన పోరు8
8/9

హోరెత్తిన పోరు

హోరెత్తిన పోరు9
9/9

హోరెత్తిన పోరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement