దారుణం: పెళ్లైన మూడు నెలలకే.. నడిరోడ్డుపై

Husband Assassinate His Wife In Uttar Pradesh - Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. దంపతుల మధ్య గొడవ కారణంగా.. ఒకరి నిండు ప్రాణం కోల్పోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన జలాన్‌ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఓరై ప్రాంతానికి చెందిన సదరు యువకుడు, తన సమీప గ్రామంలోని యువతిని వివాహం చేసుకున్నాడు. కాగా, పెళ్లి  అయిన మూడు నెలలకే వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలో యువతి భర్త ప్రతి రోజు ఆమెను కొడుతూ, హింసించేవాడు.

ఈక్రమంలో, ఒకరోజు ఆమెను ఓరై రోడ్డుపై తీసుకొచ్చి పెట్రోల్‌ పోసి నిప్పంటిచాడు. దీంతో ఆ యువతి మంటల్లో అరుస్తు రోడ్డుపై కుప్పకూలిపోయింది. ఆయువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఆ యువతి రెండున్నర గంటలపాటు కాలిన గాయలతో హైవే పైనే ఉంది. కాసేపటికి, ఒక దాబా యజమాని ఆ బాధితురాలిని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు.

దీంతో, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలిని ఝాన్సీ ఆసుపత్రికి తరలించారు. కాగా, తన భర్త ఈ దారుణం చేశాడని బాధితురాలు ఆరోపించింది. కాగా,  కేసును నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటకు వస్తాయని జలాన్‌ పోలీసు అధికారి రాకేశ్‌ సింగ్‌ పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top