మధ్యాహ్నభోజన పోటీల్లో జిల్లాకు 2వ స్థానం | - | Sakshi
Sakshi News home page

మధ్యాహ్నభోజన పోటీల్లో జిల్లాకు 2వ స్థానం

Jun 1 2025 1:17 AM | Updated on Jun 1 2025 1:17 AM

మధ్యాహ్నభోజన పోటీల్లో జిల్లాకు 2వ స్థానం

మధ్యాహ్నభోజన పోటీల్లో జిల్లాకు 2వ స్థానం

చిత్తూరు కలెక్టరేట్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించి ఇటీవల రాష్ట్ర స్థాయిలో సిబ్బందికి శిక్షణ పోటీలు నిర్వహించారు. విజయవాడలో నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లా తరపున మధ్యాహ్న భోజన సిబ్బంది పాల్గొని ప్రతిభ చాటారు. బడి పిల్లలకు శుభ్రత, ప్రకృతి వైపరీత్యాలు, ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు, అగ్నిప్రమాద సమయంలో ఎలా తప్పించుకోవాలనే అంశాలపై వంట కార్మికులకు శిక్షణ ఇచ్చారు. అనంతరం మధ్యాహ్న భోజన సిబ్బందికి పోటీలు నిర్వహించగా ఇందులో చిత్తూరు జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 2వ స్థానం లభించింది. ఈ అవార్డు పొందిన, గత 20 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న కార్మికులను డీఈవో వరలక్ష్మి, ఏడీ వెంకటేశ్వరరావు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement