
రైల్వేస్టేషన్ను పరిశీలించిన డీఆర్ఎం
చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు రైల్వేస్టేషన్ను మంగళవారం సాయంత్రం డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) చంద్రశేఖర్గుప్త పరిశీలించారు. కాణిపాకం దర్శనార్థం చిత్తూరుకు వచ్చిన ఆయన వచ్చారు. తిరుగు ప్రయాణంలో స్టేషన్ను తనిఖీ చేశారు. రైల్వేస్టేషన్లో జరుగుతున్న నిర్మాణ పనులను చూసి పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని, వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో రైల్వే పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తనిఖీలు మెరుగ్గా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ మాస్టర్ ముత్తుస్వామి, ఆర్పీఎఫ్ సీఐ కుమార్, జీఆర్పీ ఎస్ఐ ప్రవీణ్ పాల్గొన్నారు.