జిల్లా జడ్జిగా అరుణ సారిక బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

జిల్లా జడ్జిగా అరుణ సారిక బాధ్యతల స్వీకరణ

Apr 19 2025 9:22 AM | Updated on Apr 19 2025 9:22 AM

జిల్లా జడ్జిగా అరుణ సారిక బాధ్యతల స్వీకరణ

జిల్లా జడ్జిగా అరుణ సారిక బాధ్యతల స్వీకరణ

చిత్తూరు అర్బన్‌: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా అరుణ సారిక శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు. చిత్తూరులోని జిల్లా కోర్టులోని ఛాంబర్‌లో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన న్యాయమూర్తుల బదిలీల్లో మచిలీపట్నం జిల్లా జడ్జిగా పనిచేస్తున్న అరుణ సారికను చిత్తూరు జిల్లా జడ్జిగా నియమిస్తూ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. చిత్తూరులో పనిచేస్తున్న ఇ.భీమారావును అనంతపురం జిల్లా జడ్జిగా బదిలీ చేశారు.

నేడు జిల్లాలో

స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో ఈ నెల 19వ తేదీన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ అన్నారు. శుక్రవారం ఆయన క్షేత్రస్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల మూడో శనివారం స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర దినోత్సవంగా ప్రకటించిందన్నారు. ఈ నెల 19వ తేదీన పారిశుద్ధ్యం పరిశుభ్రతను పెంపొందించేందుకు స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అందరి భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఇ –చెక్‌ అనే ప్రధాన అంశంగా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇ– చెక్‌ అంటే అన్ని మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాలలోని గృహాలు, దుకాణాల్లో ఉన్న ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను పూర్తిగా సేకరించి, రీ యూజ్‌ చేయడమని తెలిపారు. ఇందుకు షాపులు, ఇళ్లల్లో ఉన్న ఎలక్ట్రానిక్‌ వేస్ట్‌ను పూర్తిగా సేకరించాలనన్నారు. ఈ వేస్ట్‌ని సేకరించేందుకు స్వయం సహాయక సంఘాల మహిళలకు బాధ్యతలు అప్పగించామన్నారు. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ శాఖలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహించి వెబ్‌సైట్‌లో ఫొటోలను అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జేసీ విద్యాధరి, డీఆర్వో మోహన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement