
సెప్టెంబర్ 1 నుంచి అమలు
న్యూఢిల్లీ: టీసీఎస్ తన ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. జూనియర్ లెవల్ నుంచి మధ్య స్థాయి ఉద్యోగుల వరకు 80 శాతం సిబ్బందికి సెప్టెంబర్ 1 నుంచి వేతన పెంపులను అమలు చేయనున్నట్టు సమాచారం ఇచ్చింది.
ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్లో టీసీఎస్ సీహెచ్ఆర్వో మిలింద్ లక్కడ్, సీహెచ్ఆర్వోగా నియమితులైన కే సుదీప్ తెలిపారు. గ్రేడ్ సీ3ఏ, దీనికి సమానమైన అసోసియేట్లకు (మొత్తం ఉద్యోగుల్లో 80 శాతం) వేతన సవరణను అమలు చేయనున్నట్టు వెల్లడించారు. 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ఈ సంస్థ ఇటీవలే ప్రకటించడం తెలిసే ఉంటుంది.