
డొనాల్డ్ ట్రంప్ అదనపు సుంకాలు అమలులోకి రావడానికి ముందు.. స్వదేశీ ఉత్పత్తులను మెరుగుపరచాలనే భావనతో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. సుజుకి మోటార్ హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్లను ఉత్పత్తి చేసే మొదటి ప్లాంట్ ప్రారంభించారు. ఆ తరువాత కంపెనీకి చెందిన మొదటి ఎలక్ట్రిక్ కారు ''ఈ-విటారా''కు జెండా ఊపి ముందుకు పంపించారు.
ప్రధాని మోదీ ప్రారంభించిన మారుతి సుజుకి కొత్త సౌకర్యంలో ప్లాంట్ లిథియం-అయాన్ బ్యాటరీలకు అవసరమైన 80 శాతానికి పైగా భాగాలను ఉత్పత్తి చేస్తారు. ఇది దిగుమతులపై ఆధారపడటాన్ని చాలా తగ్గిస్తుంది. ఎగుమతులు చేయడానికి అనుమతిస్తుంది. కాగా మారుతి సుజుకి ఈ-విటారా కారు భారతదేశంలో తయారవుతుంది. ఇక్కడ నుంచే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 100 దేశాలకు ఎగుమతి అవుతుంది. ఈ-విటారా మొదటి యూనిట్ను యూకేకి ఎగుమతి చేస్తారు.
మారుతి సుజుకి ఈ-విటారాను కంపెనీ గత ఏడాది చివరలో యూరప్లో ప్రవేశపెట్టారు. ఆ తరువాత ఈ కారు 2025లో భారతదేశంలో జరిగిన భారత్ మొబిలిటీ షోలో కనిపించింది. ఇది టయోటా సహకారంతో రూపుదిద్దుకున్న 40PL డెడికేటెడ్ EV ప్లాట్ఫామ్పై తయారైంది.
ఇదీ చదవండి: సుంకాల ప్రభావం.. ఎదురయ్యే సవాళ్లు: ఆర్బీఐ గవర్నర్
ఈ-విటారా ఎలక్ట్రిక్ కారు 49 కిలోవాట్, 61 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతుంది. ఇందులో పెద్ద బ్యాటరీ డ్యూయల్-మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్ పొందుతుంది. కాగా కంపెనీ దీనిని ఎన్ని వేరియంట్లలో లాంచ్ చేయనుంది, ఇందులోని ఫీచర్స్ ఏమిటి, లాంచ్ టైమ్ వంటి వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 20 లక్షలు (ఎక్స్ షోరూం) ఉండే అవకాశం ఉంది. ఇది మార్కెట్లో లాంచ్ అయిన తరువాత.. మహీంద్రా బీఈ6, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, ఎంజీ జెడ్ఎస్ ఈవీ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi flags off the 'e-VITARA', Suzuki’s first global strategic Battery Electric Vehicle (BEV), at the Suzuki Motor plant in Hansalpur, Ahmedabad.
(Source: DD News) pic.twitter.com/CLKE9nvnKG— ANI (@ANI) August 26, 2025