
ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి మృతి
గాలివీడు : గోరాన్ చెరువు గ్రామానికి చెందిన నచ్చుకూరి లక్ష్మయ్య(59) అనారోగ్యం కారణంగా విషద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ రామకృష్ణ కథనం మేరకు గోరాన్ చెరువు గ్రామం బండివాండ్ల పల్లి ఎస్టీ కాలనీకి చెందిన నచ్చుకూరి పాపన్న కుమారుడు లక్ష్మయ్యకు పదేపదే మూర్చ వ్యాధి వస్తుండటంతో మనస్తాపం చెందేవాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది జూన్ 1 వ తేదీ పెన్షన్ డబ్బులు తీసుకుని సాయంత్రం పొలం దగ్గరకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా పొలం వద్ద స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. వెంటనే 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్కు సిఫార్సు చేశారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి కుమారుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.