భారీగా పెరిగిన కరోనా కేసులు 

Massively increased corona cases in Andhra Pradesh - Sakshi

24 గంటల్లో 3,205 పాజిటివ్‌ కేసులు నమోదు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో (మంగళవారం ఉదయం 9 నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు) 41,954 నమూనాలను పరీక్షించగా 3,205 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. కరోనాతో ఒక్క మరణమూ సంభవించలేదు.

ఒక్క రోజులో 281 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 695, చిత్తూరులో 607 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 10,119 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,87,879కి చేరింది. వీరిలో 20,63,255 మంది కోలుకున్నారు. 14,505 మంది మృతి చెందారు. ప్రభుత్వం ఇప్పటి వరకు 3,17,08,637 పరీక్షలు చేసింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top