
11న ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నోటీస్
అనకాపల్లి టౌన్: రాష్ట్ర వ్యాప్తంగా 1–2019 సర్క్యులర్ అమలు చేయని కారణంగా ఆర్టీసీ విజయనగరం జోనల్ స్థాయి పరిధిలో గల ఆరు జిల్లాల కలెక్టర్లకు ఈ నెల 11న సమ్మె నోటీసు అందజేయనున్నట్టు ఎన్ఎంయూఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసరాజు తెలిపారు. స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జోనల్ పరిధిలో ఆరు జిల్లాల రీజనల్ కమిటీలు ఆయా కలెక్టర్లకు సమ్మె నోటీసులు అందజేయనున్నట్టు తెలిపారు. ఇక్కడి డిపో ఎదుట వంద రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా, ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం బాధాకరమన్నారు. సమ్మె నోటీసులు ఇస్తున్న నేపథ్యంలో నిరాహార దీక్షను ఆదివారం విరమించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి పి. సుధాకర్, విజయనగరం రీజనల్ కార్యదర్శి పి.జి. రాఫిల్, యూనియన్ నాయకులు ఎం.వి.ఆర్.మూర్తి, శంకరరావు తదితరులు పాల్గొన్నారు.
పీజీఆర్ఎస్ టోల్ ఫ్రీ నంబర్1100