
కొనసాగుతున్న పాలిసెట్ కౌన్సెలింగ్
మురళీనగర్ : పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన పాలిసెట్ కౌన్సెలింగ్ సోమవారం కొనసాగింది. ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ ఇనిస్టిట్యూట్ (గైస్), కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో హెల్ప్లైన్ కేంద్రాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సందడిగా కనిపించాయి. గైస్లో ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వెంకటరమణ పర్యవేక్షణలో 32,001 నుంచి 40,000 ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహించగా 308 మంది సర్టిఫికెట్లు పరిశీలన చేశారు. గైస్లో మంగళవారం 50,001 నుంచి 59,000 ర్యాంకు వరకు కౌన్సెలింగ్కు హాజరు కావాల్సి ఉంటుంది. పాలిటెక్నిక్ కాలేజీలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రత్నకుమార్ పర్యవేక్షణలో 40,001 నుంచి 50,000 ర్యాంకు వరకు నిర్వహించిన కౌన్సెలింగ్లో 336 మంది సర్టిఫికెట్లు పరిశీలన చేశారు. ఇక్కడ మంగళవారం 59,001 నుంచి 68,000 ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.