
క్రైస్తవ వివాహాల లైసెన్స్ జారీ కర్తగా వెంకటరమణ
దేవరాపల్లి: క్రైస్తవ వివాహాల నిర్వహణ, వివాహ ధ్రువీకరణ పత్రాలను జారీ చేసేందుకు లైసెన్స్ కర్తలను నియమిస్తూ ప్రభుత్వం సోమవా రం ఉత్తర్వులు జారీ చేసింది. అనకాపల్లి జిల్లా నుంచి దేవరాపల్లిలోని దైవ స్వరూపి చర్చి పాస్టర్ పలివిలి వెంకటరమణ (నతానియేలు)కు క్రైస్తవ వివాహాల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం అవకాశం కల్పించింది. పది సంవత్సరాల పాటు వివాహ లైసెన్స్లు జారీ చేసేందుకు కాల పరిమితి విధిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని పశ్చిమగోదావరి, అనంతపురం, కర్నూలు, ఏలూరు జిల్లాల నుంచి ఒక్కొక్కరికీ, గుంటూరు జిల్లా నుంచి ముగ్గురు పాస్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.