
చింత చెట్టు పైనుంచి పడి బాలుడి మృతి
వీఆర్పురం: చింత చెట్టు పైనుంచి కింద పడి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలోని విరపాపినకుంట గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విరపాపినకుంట గ్రామా నికి చెందిన రవ్వ రాంబాబు(11) ఆదివారం అదే గ్రామానికి చెందిన స్నేహితులతో కలిసి చింత చెట్టు ఎక్కి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు పైనుండి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన బాలుడిని చింతూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతుడి తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తునట్టు ఎస్ఐ సంతోష్ కుమార్ తెలిపారు.