
విహారయాత్రలో విషాదం
రంపచోడవరం: విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. మారేడుమిల్లికి సమీపంలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా పంగిడి గ్రామానికి చెందిన ఆరు కుటుంబాల సభ్యులు మూడు కార్లలో మారేడుమిల్లికి విహారయాత్రకు వచ్చారు. మారేడుమిల్లికి సమీపంలో వీరు ప్రమాణిస్తున్న కార్లలో ఒకటి వేగంగా వెళ్తూ చెట్టును ఢీకొట్టడంతో ముందు సీటులో కూర్చుని ప్రయాణిస్తున్న అడపా శ్రీనివాస్ (49) తలపై తీవ్ర గామైంది. హుటాహుటిన మారేడుమిల్లి పీహెచ్సీకి తరలించారు. అప్పటికే అపస్మాకర స్థితిలో ఉన్న శ్రీనివాస్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ కారులో ప్రయాణిస్తున్న చిన్నారులు అడపా వెంకటసాయి, పవన్, తోట విజయవర్ధన్ తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పాటు రాజేష్, తోట విఘ్నేష్, బాలసేని, తేజ గాయపడ్డారు. వీరిని మారేడుమిల్లి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు.మారేడుమిల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చెట్టును కారు ఢీకొనడంతో ఒకరి మృతి
మారేడుమిల్లి సమీపంలో ప్రమాదం
దేవరపల్లి వద్ద చెట్టును ఢీకొట్టిన కారు