
విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు
ఆదిలాబాద్టౌన్: జిల్లాలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు చేపడుతున్నామని ఆ శాఖ ఎస్ఈ జేఆర్ చౌహాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్ఈ కార్యాలయంలో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరాలో 33 కేవీ, 11కేవీ సుదూరమైన లైన్లలో ఫాల్ట్ ప్యాసెజ్ ఇండికేటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బ్రేక్డౌన్, ప్రకృతి వైపరీత్యాలు, సాంకేతిక కారణాలతో లైన్లు మొత్తం తనిఖీ చేసే అవసరం లేకుండా ఫాల్ట్ ప్యాసెజ్ ఇండికేట్ ఇస్తుందని పేర్కొన్నారు. వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకొని విద్యుత్ పునరుద్ధరణ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 18 ఏర్పాటు చేశామన్నారు. సాంకేతిక వ్యూహాత్మక 50 ప్రదేశాలను గుర్తించినట్లు వివరించారు.