● పాఠశాలల్లో పోస్టులంటూ ప్రకటన ● ఉద్యోగాల పేరిట వసూళ్లు ● మోసపోతున్న యువత ● స్వచ్ఛంద సంస్థల పేరిట దందా ● తాజాగా ‘మల్టీలెవల్‌’ మోసం | - | Sakshi
Sakshi News home page

● పాఠశాలల్లో పోస్టులంటూ ప్రకటన ● ఉద్యోగాల పేరిట వసూళ్లు ● మోసపోతున్న యువత ● స్వచ్ఛంద సంస్థల పేరిట దందా ● తాజాగా ‘మల్టీలెవల్‌’ మోసం

Jun 14 2025 7:19 AM | Updated on Jun 14 2025 7:19 AM

● పాఠశాలల్లో పోస్టులంటూ ప్రకటన ● ఉద్యోగాల పేరిట వసూళ్లు

● పాఠశాలల్లో పోస్టులంటూ ప్రకటన ● ఉద్యోగాల పేరిట వసూళ్లు

ఆదిలాబాద్‌టౌన్‌: నిరుద్యోగ యువత అవసరం.. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని స్వచ్ఛంద సంస్థలు, కేటుగాళ్లు అక్రమ దందాకు తెరలేపుతున్నారు. ఈ ఘటనలు జిల్లాలో పునరావృతం అవుతూనే ఉన్నాయి. వివిధ శాఖల్లో అటెండర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఇప్పిస్తామని ఎర వేస్తున్నారు. డబ్బులు తీసుకొని కనిపించకుండా పోతున్నారు. కొందరు రేపుమాపు అంటూ తిప్పుకుంటున్నారు. తీరా బాధితులు మో సపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో కేటుగాళ్లు కటకటాల పాలవుతున్నారు. తాజాగా మళ్లీ కొంత మంది ఉద్యోగాల పేరిట మోసం చేసేందుకు రంగంలోకి దిగారు. వి ద్యాశాఖలో ఇన్‌స్ట్రక్టర్‌ ఉద్యోగం పేరిట ఇంటర్వ్యూ లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఒక్కో పోస్టుకు రూ.2లక్షలు డిమాండ్‌ చేస్తూ మొదటగా రూ.లక్ష వరకు అడ్వాన్స్‌తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీ వల పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేసి రి మాండ్‌కు తరలించారు.ఇచ్చోడలో లెక్చరర్‌గా పని చేస్తున్న ఇంగోలు సత్యనారాయణ మల్టీలెవల్‌ మా ర్కెటింగ్‌కు ఆకర్షితుడై అమాయకులను మోసం చే యడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

పాఠశాలల్లో ఉద్యోగాల పేరిట టోకరా..

రెండేళ్లుగా పాఠశాలలు పునఃప్రారంభమైన సమయంలో కేటుగాళ్లు నిరుద్యోగులకు వల విసురుతున్నారు. గతేడాది విద్యాంజలి పేరిట పలు స్వచ్ఛంద సంస్థలు నిరుద్యోగుల నుంచి లక్షలు దండుకున్నా యి. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.2లక్షల వరకు తీసుకొని ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్‌ ఆపరేటర్‌, అటెండర్‌ పేరిట నకిలీ నియామక పత్రాలు అందించారు. విద్యాశాఖ అధికారులకు సమాచారం లేకుండానే ఈ దందా చేపట్టారు. మళ్లీ ఈ ఏడాది సైతం ఓ స్వచ్ఛంద సంస్థ అలాంటి దందాకే తెర లేపింది. జిల్లాలోని ఏడుపాఠశాలల్లో పోస్టులు ఖాళీగా ఉన్నా యని సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈ దందావెనుక నార్నూర్‌కు చెందిన ఓ కిలేడీ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కో పోస్టుకు రూ.2లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అయితే గురువారం హైదరాబాద్‌లో ఇంటర్వ్యూ పేరిట పరీక్షలు రాయించి కొంత అడ్వాన్స్‌గా తీసుకున్నట్లు తెలు స్తోంది. ఈ ఘటన విద్యాశాఖలో తీవ్ర కలకలం రేపుతోంది. ఎలాంటి నోటిఫికేషన్‌, సమాచారం లేకుండా ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తారని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement