
ఇన్చార్జి మంత్రిని కలిసిన ఎమ్మెల్యేలు
ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్చార్జి మంత్రిగా నియమితులైన జూపల్లి కృష్ణారావు ను ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సచివాలయంలో కలిసి శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.
మృతుల కుటుంబాలను ఆదుకుంటాం..
ఉట్నూర్రూరల్: పిడుగుపాటుకు గురైన మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని వి ధాలా ఆదుకుంటుందని ఖానాపూర్ ఎమ్మె ల్యే వెడ్మ బొజ్జు అన్నారు. గాదిగూడ మండలంలోని పిప్రి గ్రామంలో నలుగురు, బేల మండలంలోని పొన్కాస్, సాంగ్విడి గ్రామంలో ఇద్ద రు పిడుగు పాటుతో మృతి చెందడం దురదృష్టకరమని అన్నారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిని కలిసిన అనంతరం మాట్లాడారు.