
ప్రొసీడింగ్స్ అందజేత
కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ పరిధి లోని ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ ప్రారంభమైంది. వార్డులవారీగా ప్రత్యేకాధికారులను నియమించి వీటిని అందజేస్తున్నారు. 45వ వార్డు భుక్తాపూర్లో 10మందికి ఇళ్లు మంజూరు కాగా, ఒకరు ఆసక్తి చూపకపోవడంతో గురువారం తొమ్మిది మందికి స్పెషలాఫీసర్ నవీన్కుమార్, మాజీ కౌన్సిలర్ బండారి సతీశ్ పత్రాలు అందజేశారు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయాలని సూచించారు. వార్డు ఆఫీసర్ ప్రశాంత్, ఆర్పీ రాధ, రాహుల్, జీవిత తదితరులున్నారు. 37వ వార్డు ఓల్డ్ హౌసింగ్ బోర్డు, రవీంద్రనగర్ కాలనీల్లోనూ స్పెషలాఫీసర్ రాజ్కుమార్, వార్డు ఆఫీసర్ జ్యోతి, మాజీ కౌన్సిలర్ అంబకంటి అఽశోక్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పత్రాలు అందజేశారు.