
‘సర్కారు’లోనే నాణ్యమైన విద్య
సాత్నాల: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. గురువారం మాంగుర్ల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. వి ద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పా ఠశాలల్లో క్వాలిఫైడ్ టీచర్లు బోధిస్తారని తెలి పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూని ఫాంలు ఉచితంగా ఇస్తున్నట్లు చెప్పారు. డ్రా పౌట్స్ లేకుండా బడీడు పిల్లలందరినీ పా ఠశాలల్లో చేర్పించాలని ఉపాధ్యాయులకు సూ చించారు. డీఈవో శ్రీనివాస్రెడ్డి ఉన్నారు.