
● పూర్తి దశలో ఒకవైపు పనులు ● రెండోవైపు చేపట్టని నిర్మాణ
కై లాస్నగర్: జిల్లా కేంద్రంలోని రైల్వే క్రాసింగ్ల వద్ద చేపట్టాల్సిన బ్రిడ్జీల నిర్మాణ పనులు ఒక అడు గు ముందుకు.. మూడడుగులు వెనక్కి.. అన్నచందంగా సాగుతున్నాయి. ఆర్టీవో కార్యాలయం వద్ద గతేడాది చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) ని ర్మాణం ఓ వైపు పూర్తి కావస్తుండగా.. మరోవైపు ప నులు ప్రారంభించలేదు. ఇక తాంసి బస్టాండ్ ప్రాంతంలో నిర్మించాల్సిన రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్యూ బీ) పనులకు మోక్షమే కలగలేదు. భూసేకరణకు నిధుల రాష్ట్ర ప్రభుత్వ నిధుల విడుదలలో జాప్యంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది.
ఓ వైపు వేగంగా ఆర్వోబీ పనులు
స్పిన్నింగ్ మిల్ గేట్ రైల్వే క్రాసింగ్ (ఎల్సీ గేట్ 29) వద్ద రూ.56.31 కోట్లతో చేపట్టిన ఆర్వోబీ నిర్మాణానికి సంబంధించి ఆర్అండ్బీ ఆధ్వర్యంలో రూ.27.63 కోట్లతో టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ గతేడాది జనవరిలో పనులు ప్రారంభించారు. భూసేకరణ సమస్య లేని మార్కెట్యార్డు వైపు పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 30 పిల్లర్లు నిర్మించి వా టిపై స్లాబ్ పనులు పూర్తి చేశారు. రూ.12 కోట్ల మేర పనులు పూర్తి కాగా ఇందులో రూ.4కోట్ల బిల్లులు కాంట్రాక్టర్కు చెల్లించారు. మరో రూ.8 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఆ వైపు 711.313 మీట ర్ల మేర పనులు చేపట్టాల్సి ఉండగా ఇప్పటివరకు 400 మీటర్లు పూర్తి చేశారు. మిగతా పనులు కొనసాగతున్నాయి. ఇక ఎల్ఐసీ వైపు 220.512 మీటర్ల మేర వంతె నిర్మించాల్సి ఉండగా భూసేకరణ చే యాల్సి ఉండగా ఇంకా పనులు మొదలుకాలేదు. రె వెన్యూ, ఆర్అండ్బీ అధికారులు సర్వే చేసి వంతెన కు అవసరమైన భూమికి మార్కింగ్ చేశారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఏడాదిన్నరగా భూసేకరణ ప్రక్రియ నిలిచి ఇటువైపు పనులు ప్రారంభించలే దు.
రాకపోకలకు తీవ్ర అంతరాయం
ఆర్వోబీ వివరాలు ఇలా..
అంచనా వ్యయం రూ.56.31కోట్లు
నిర్మాణం పొడవు 931.825 మీటర్లు
కలెక్టర్చౌక్ వైపు 220.512 మీటర్లు
మార్కెట్యార్డు వైపు 711.313 మీటర్లు
రైల్వేట్రాక్ భాగం 37.280 మీటర్లు
పట్టణంలో రెండు రైల్వే క్రాసింగ్లున్నాయి. రైలు వచ్చిందంటే చాలు వాటి గేట్లు వేయడంతో ఇరువైపులా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడుతోంది. దశాబ్దాలుగా నెలకొన్న ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆర్వోబీ, పరిమిత ఎత్తులో సబ్వే (ఎల్హెచ్ఎస్)లను నిర్మించాలని సంకల్పించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ బ్రిడ్జిలకు రూ.97.20 కోట్ల అంచనా వ్యయంగా నిర్ణయించారు. ఇందులో రాష్ట్రం వాటా రూ.57.71 కోట్లు కాగా, కేంద్రం వాటా రూ.39.49 కోట్లు. 2016–17 బడ్జెట్లో వీటి నిర్మాణానికి అనుమతినిచ్చిన కేంద్రం 2022లో తన వాటా నిధులు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రావడంతో అదే ఏడాది అధికారులు టెండర్ ప్ర క్రియ పూర్తి చేశారు. తొలుత కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ఆ తర్వాత వారు ముందుకువచ్చినా పరిపాలన అనుమతుల్లో జరిగి న జాప్యంతో పనులు ఆలస్యమయ్యాయి.
నిధులు విడుదలైతేనే..
రైల్వే బ్రిడ్జిల నిర్మాణా నికి అవసరమైన భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు. వంతెనలు త్వరగా పూర్తి చేయాల నే ఉద్దేశంతో వందశాతం కేంద్రం నిధులు మంజూరు చేయించేందుకు స్థానిక ఎ మ్మెల్యే, ఎంపీ ప్రయత్నిస్తున్నారు. ప లుసార్లు కేంద్రానికి లేఖలు రాశారు. నిధులు విడుదలైతే పనులు ప్రారంభమయ్యే అవకాశముంది. – ఎస్.నర్సయ్య,
ఈఈ, ఆర్అండ్బీ, ఆదిలాబాద్