మోగిన బడిగంట | - | Sakshi
Sakshi News home page

మోగిన బడిగంట

Jun 13 2025 5:33 AM | Updated on Jun 13 2025 5:33 AM

మోగిన

మోగిన బడిగంట

ఆదిలాబాద్‌టౌన్‌: బడి గంట మోగింది. పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఇన్నిరోజుల పా టు వేసవి సెలవుల్లో ఆటాపాటలతో గడిపిన వి ద్యార్థులు గురువారం బడుల వైపు అడుగులు వే శారు. తొలిరోజు బడికి వెళ్లేందుకు చాలామంది చిన్నారులు మొగ్గుచూపలేదు. తల్లిదండ్రులు వా రిని బలవంతంగా బడులకు తీసుకువెళ్లాల్సి వ చ్చింది. సర్కారు బడులతోపాటు ప్రైవేట్‌ పాఠశాలలనూ అలంకరించి విద్యార్థులను ఆకర్షించేలా ముస్తాబు చేశారు. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు గేటు వద్ద పూలు అందించి విద్యార్థులకు స్వాగతం పలికారు. దీంతో సంతోషంగా వారు తరగతి గదుల్లోకి అడుగిడారు. మొదటిరోజు పా ఠశాలల్లో విద్యార్థుల హాజరు తక్కువగా కనిపించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందజేశారు. అయితే ఇంకా పూర్తిస్థాయిలో పంపిణీ జరగలేదు. పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసినప్పటికీ యూనిఫాంలు కొందరికే ఇచ్చారు. యూనిఫాంలు కుట్టడం పూ ర్తయిన తర్వాత అందరికీ అందించనున్నారు. ప్ర భుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులు క లగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, సమస్యలుంటే పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా, జిల్లాలో 14 పాఠశాలలు మూతపడగా, జిల్లా కేంద్రంలోని వెంకట్‌రావుకాలనీలో ప్రాథమిక పాఠశాలను 12 ఏళ్ల తర్వాత పునఃప్రారంభించారు. కాలనీలోని విద్యార్థులను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాఠశాలకు తీసుకువచ్చారు. దాదాపు 25 మంది విద్యార్థులు హాజరు కాగా, వీరికి పుస్తకాలు పంపిణీ చేశారు.

పూలు ఇస్తూ.. బొట్టు పెడుతూ..

విద్యార్థులకు గురువుల స్వాగతం

మొదటిరోజు హాజరు అంతంతే

సందడిగా మారిన పాఠశాలలు

బొట్టు పెట్టి విద్యార్థులకు స్వాగతం

తాంసి: మండలంలోని కప్పర్ల జెడ్పీ హై స్కూల్‌, నిపాని, బండల్‌నాగాపూర్‌, జామి డి ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు అధికసంఖ్యలో ప్రవేశాలు పొందారు. మొదటిరో జు పాఠశాలకు వచ్చిన వీరందరికీ ఉపాధ్యాయులు బొట్టు పెట్టి స్వాగతం పలికారు. ఈ విద్యాసంవత్సరంలో కప్పర్ల పాఠశాలలో 53 మంది విద్యార్థులు ప్రవేశం పొందినట్లు హెచ్‌ఎం ఆనంద్‌ తెలిపారు.

మోగిన బడిగంట1
1/2

మోగిన బడిగంట

మోగిన బడిగంట2
2/2

మోగిన బడిగంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement