
మృతుల వివరాలు
సాక్షి, ఆదిలాబాద్/నార్నూర్/బేల: వారంతా మట్టి మనుషులు.. మట్టినే నమ్ముకుని జీవించేవారు.. ఆ మనుషుల మధ్య ఉన్న ఆత్మీయత ఎంతచెప్పినా త క్కువే.. భార్యాభర్తలిద్దరు పిల్లలతో కలిసి తమ చేనులో విత్తనాలు వేస్తున్నారు. విత్తనాలు వేసే మిగతావారు కూడా ఈ కుటుంబానికి దగ్గరి సంబంధీకు లే. అంతా ఆదివాసీ గిరిజనులే. వీరంతా హుషారుగా విత్తనాలు వేశారు. మధ్యాహ్నం కావడంతో 14 మంది ఒకే దగ్గర భోజనం చేశారు. ఆ తర్వాత మళ్లీ విత్తనాలు వేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇంతలో వర్షం రావడంతో అంతా వెళ్లి సమీపంలోని చిన్న గు డిసెలో ఒకే దగ్గర కూర్చున్నారు. సరిగ్గా అదే సమయానికి పక్కనున్న టేకు చెట్టుపై భారీ శబ్దంతో పి డుగు పడింది. ఉలిక్కిపడేలోపే గుడిసెలోని నలుగు రు ప్రాణాలు విడిచారు. ఆ మట్టిపైనే నేలకొరిగారు. మిగతా వారు చెల్లాచెదురుగా పడిపోయి గాయాలతో బయటపడ్డారు. ఇది గాదిగూడ మండలంలోని పిప్పిరి గ్రామంలో గురువారం మధ్యాహ్నం జరిగిన ఘటన. జిల్లాలో మరో రెండు చోట్ల పిడుగులు పడ్డాయి. ఈ ఘటనల్లో బేల మండలంలోని ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందారు. మొత్తంగా పిడుగుపాటుకు ఆరుగురు మృత్యువాత పడిన ఘటనలు జిల్లాలో తీవ్ర విషాదాన్ని కలిగించాయి.
బాధిత కుటుంబాల్లో విషాదం..
గాదిగూడ మండలం పిప్పిరికి చెందిన పెందూర్ మాధవరావు తన చేనులో భార్య, కుమారులు, కూ తురుతో పాటు దగ్గరి సంబంధీకులైన 14 మందితో కలిసి గురువారం మొక్కజొన్న విత్తనాలు వేస్తున్నారు. పిడుగుపాటుకు గురై మాధవరావు, ఆయన కూతురు పెందూర్ సంజన అలియాస్ సుజాత, సంబంధీకులు సిడం రంభాబాయి, మంగం భీమ్బాయి మృతిచెందారు. ఈ ఘటనలో మాధవరావు భార్య పెందూర్ రేణుక, ఇద్దరు కుమారులు పెందూర్ జంగు, పెందూర్ శేఖు గాయపడ్డారు. సిడం రాంబాయి కుమారుడు సిడం శంకర్, మంగం భీమ్బాయి కూతురు మంగం నందిని కూడా గాయాలపాలయ్యారు. వీరితో పాటు దగ్గరి సంబంధీకులైన హెచ్కే ఈశ్వర్, మర్సుకోల అంజలి, మర్సుకోల సోము, గెడం శంభు, గుణవంత్రావు కూడా గాయపడ్డారు. ఇక బేల మండలంలోని సాంగిడి, సోన్కా స్ గ్రామాల్లో పత్తి విత్తనాలు వేస్తుండగా పిడుగుపాటుకు మహిళా కూలీలు గెడం నందిని, కోవ సునీత మృతిచెందారు. వీరిరువురికి భర్త, పిల్లలున్నారు. కాగా, క్షతగాత్రులను చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. కొందరిని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిని పలువురు పరామర్శించారు.
పిడుగుపడి కుమ్మరితండాలో ముగ్గురికి గాయాలు
ఉట్నూర్రూరల్: మండలంలో గురువారం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో పిడుగు పడగా మండలంలోని కుమ్మరితండాకు చెందిన ముగ్గురు గాయాలపాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్మరితండాకు చెందిన ధర్మరాజు, కృష్ణబా యి, నిర్మల గురువారం చేను పనులకు వెళ్లారు. మధ్యాహ్న సమయంలో ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. పంటచేనులోని పశువులపాక సమీపాన ఉన్న చెట్టుపై పిడుగు పడగా అ క్కడే ఉన్న ముగ్గురు గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే 108లో ఆదిలాబాద్ రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతున్నారు.
పిడుగు పడిన ఘటనలో గాదిగూడ మండలం పి ప్పిరి గ్రామానికి చెందిన తండ్రి, కూతురు పెందూర్ మాధవ్రావు (45), సుజాత అలియాస్ సంజన (16), మాధవ్రావుకు దగ్గరి సంబంధీకులైన సిడం రంభాబాయి (40), మంగం భీమ్బాయి (45) అ క్కడికక్కడే మృతి చెందారు. అలాగే బేల మండలం సాంగిడి గ్రామంలో పిడుగుపాటుకు గురై గెడం నందిని (30), సోన్కాస్ గ్రామంలో కోవ సునీత (40) ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా రెండు వేర్వేరు ఘటనలో ఆరుగురు మృత్యువాత పడగా, ఇందులో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడున్నారు.

మృతుల వివరాలు

మృతుల వివరాలు