-
భారత్లోనే పెళ్లాడండి: మోదీ
అహ్మదాబాద్: సంపన్న కుటుంబాలు విదేశాల్లో పెళ్లాడుతున్న ఉదంతాలను ఉటంకిస్తూ భారత్లోనే పెళ్లాడండి (వెడ్ ఇన్ ఇండియా) అని ప్రధాని మోదీ మరోమారు పిలుపునిచ్చారు. గుజరాత్లోని ఆమ్రేలీ సిటీలో నిర్మించనున్న ఖోదల్ధామ్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్నాక ఆ హాస్పిటల్ను నిర్వహించే ట్రస్ట్కు చెందిన లేవా పటిదార్ సభ్యులనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘‘ భారతీయులు విదేశాల్లో పెళ్లి చేసుకోవడం సబబేనా?. సొంత దేశంలో వివాహ కార్యక్రమాలు చేసుకోలేమా? విదేశాల్లో కోట్లు ఖర్చు పెట్టి ఆడంబరంగా చేసే పెళ్లితో కోట్లాది రూపాయల భారతీయ సంపద విదేశాలకు తరలిపోతోంది’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘‘ ఇక్కడి నుంచి విదేశాలకు పెళ్లి కోసమే ప్రత్యేకంగా వెళ్లి వచ్చే పెడధోరణి రోగం మీ పటిదార్ వర్గానికి అంటకుండా జాగ్రత్తపడండి. ఇక్కడి దేవత ‘మా ఖోదల్’ అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడే పెళ్లి చేసుకోవచ్చుకదా. ‘మేడ్ ఇన్ ఇండియా’ తరహాలో ‘వెడ్ ఇన్ ఇండియా’ను పాటిద్దాం’’ అని కోరారు. ‘‘ పర్యాటనకు వెళ్లాలనుకుంటే ముందుగా స్వదేశంలోనే పర్యటించండి. దేశవ్యాప్తంగా సుందర, రమణీయ, దర్శనీయ స్థలాలను పర్యటించండి. పర్యాటక రంగాన్నీ ప్రోత్సహించండి’’ అని అన్నారు. దక్షిణాది ఆధ్యాతి్మక పర్యటన పూర్తి ధనుషో్కటి కోదండరామాలయ సందర్శన రామేశ్వరం(తమిళనాడు): గత మూడు రోజులుగా తమిళనాడులో పర్యటిస్తున్న ప్రధాని మోదీ ఆదివారం అక్కడి శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. శ్రీలంకకు కూతవేటు దూరంలో ఉండే ధనుషో్కటి, అరిచల్ మునాయ్ల సమీపంలోనే ఈ ఆలయం ఉంది. ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత సమీపంలోని అరిచల్ మునాయ్కు వెళ్లి అక్కడి జాతీయ చిహ్నం ఉన్న స్తంభం వద్ద నమస్కరించారు. అక్కడి సముద్రతీరంలో మోదీ కొద్దిసేపు ప్రాణాయామం చేశారు. సముద్ర జలాన్ని చేతులోకి తీసుకుని ప్రార్థనలు చేశారు. రామసేతుకు ప్రారంభ స్థానంగా పేర్కొనే అరిచల్మునాయ్ ప్రాంతం వద్దే మోదీ కొద్దిసేపు గడిపారు. బంగళాఖాతం, హిందూ మహాసముద్రంలోని గల్ఫ్ ఆఫ్ మన్నార్ సముద్రజలాలు కలిసే చోటునే తమిళంలో అరిచల్ మునాయ్ అంటారు. ఇక్కడి రామసేతుకు ఆడమ్స్ బ్రిడ్జ్ అని మరో పేరు కూడా ఉంది. అయోధ్యలో భవ్య రామాలయం ప్రాణప్రతిష్ఠ కోసం కఠిన దీక్ష చేస్తున్న ప్రధాని గత కొద్దిరోజులుగా రామాయణంతో ముడిపడి ఉన్న ఆలయాలు, ఆధ్యాతి్మక ప్రాంతాలను దర్శిస్తున్న విషయం తెల్సిందే. ఆదివారంతో దక్షిణ భారత పర్యటనను పూర్తిచేశారు. అరిచల్మునాయ్ నుంచి తమిళనాడుకు చెందిన పవిత్ర నదీజలాలతో నిండిన కలశాలను వెంట తీసుకుని మోదీ ఢిల్లీ చేరుకున్నారు. -
ఇన్ స్టాగ్రామ్ లో లేటెస్ట్ హల్ చల్..
ఎప్పుడు ఏ పుణ్యం చేసుకున్నాయో ఏమో ఆ శునక రాజాలు రాజభోగాలు అనుభవించాయి. సంపన్న వ్యక్తుల వివాహాలకు ఏమాత్రం తీసిపోకుండా అంగరంగ వైభవంగా పెళ్ళి చేసుకొని ఇప్పుడు సోషల్ మీడియాలో లక్షలమంది ఫాలోయర్లతో పాపులర్ అయిపోయాయి. అంతేకాదు ఈ ప్రత్యేక వేడుక వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్ గా కూడ ప్రఖ్యాతి చెందింది. ఇంతకూ ఈ వివాహం వెనుక పెద్ద చరిత్రే ఉంది. అదేమిటో మీరూ చూడండి. న్యూయార్క్ నగరంలోని ఒకప్పటి చారిత్రక ప్రాంత ఛల్సియా నైబర్ హుడ్ లోని.. హైలైన్ హోటల్ గతవారం రెండు శునక రాజాల కల్యాణ వైభోగానికి వేదికయ్యింది. వివాహానికి కస్టమ్ మేడ్ మార్చెసా డ్రెస్ ను ధరించి పోజిచ్చిన వధువు... కావలియర్ కింగ్ ఛార్లెస్ స్పానియల్.. సుమారు మూడు లక్షల నలభై వేలమంది ఇన్ స్టాగ్రామ్ ఫాలోయర్స్ ను సంపాదించి వార్తల్లో నిలిచింది. అంతేకాదు లండన్ జ్యుయలర్స్ లో సుమారు లక్షా ముఫ్ఫై వేల డాలర్లకు కొన్ననెక్లెస్... ఆ శునకం నిశ్చితార్థం ఉంగరం స్థానాన్ని ఆక్రమించింది. ఇదిలా ఉంటే వరుడు శునకం ఫిన్.. మాత్రం 16 వేలమంది ఫాలోయర్స్ తో ఇన్ స్టాగ్రామ్ లో నిరాడంబరంగా కనపడింది. కుక్కలకోసం ప్రత్యేకంగా ఉండే ఖరీదైన దుకాణం రూపొందించిన తక్సేడో తో పాటు టోపీని ధరించి హుందాగా తయారయ్యింది. శునకాల వెడ్డింగ్ పార్టీకి... ఇరువైపుల యజమానులే కాక, వారి వారి బంధుమిత్రులతోపాటు వారి పెంపుడు కుక్కలూ హాజరయ్యాయి. సుమారు రెండు వందల మంది హాజరైన ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ హంగామా అంతా సామాజిక మీడియాలో స్థానం సంపాదించేందుకో, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకో కాదని నిర్వాహకులు అంటున్నారు. దీనంతటికీ వెనుక సేవా ధృక్పధం దాగుందని చెప్పారు. పెంపుడు జంతువుల సంరక్షణార్థం ఓ సేవా సంస్థకు సహాయం అందించేందుకే ఈ వేడుకను నిర్వహించినట్లు వారు చెప్పారు. ఒక్కో టికెట్ 150 డాలర్లకు అమ్మగా వచ్చిన విరాళాన్ని ఆ సంస్థకు అందించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement