breaking news
viswamohan reddy
-
Hyderabad: మెరి'శారీ'లా..! నూతన బ్రాండ్ ‘జీఎస్ శారీస్ షో రూమ్’..
సాక్షి, సిటీబ్యూరో: చేనేత హస్త కళాకారులు తయారు చేసిన వస్త్ర ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన నూతన బ్రాండ్ ‘జీఎస్ శారీస్ షో రూమ్’ను నిజాంపేట్లో ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా ’అల్లరే అల్లరి’ చిత్రబృందం కౌశిక్, విశ్వమోహన్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రముఖ మోడల్స్, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు సందడి చేశారు. ఈ సందర్భంగా స్టోర్ ఎండీ శ్రావణి గోపీనాథ్ మాట్లాడుతూ.. తెలుగు సంప్రదాయాలకు చీరకట్టు ప్రాధాన్యం తెలియజేసేలా హ్యాండ్ మేడ్ శారీలను అందిస్తున్నామని తెలిపారు. -
సివిల్స్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం అర్బన్: సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ కోసం నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షలకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా ఆహ్వానిస్తున్నామని సాంఘిక సంక్షేమ డీడీ విశ్వమోహనరెడ్డి తెలిపారు. అభ్యర్థులు 2016 ఆగస్టు ఒకటి నాటికి 21 సంవత్సరాలు నిండి, 37 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు అర్హులన్నారు. శారీరంగా వికలాంగ అభ్యర్థులు 42 సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్థులు ఏ సబ్జెక్టులోనైనా డిగ్రీ పొంది, కుటుంబ ఆదాయం ఏడాదికి రూ. 6 లక్షలకు మించకూడదని తెలిపారు. ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్ర స్థాయిలో 700 మంది ఎస్సీలను, 300 మంది ఎస్టీలను ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 31 తేదీలోగా దరఖాస్తులను ‘ఎన్టీఆర్విద్యోన్నతి.ఓఆర్జీ’ వెబ్సైలో లాగిన్ అయి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించుకోవాలని సూచించారు. వచ్చేనెల 21వ తేదీన జరిగే ఈ ప్రవేశ పరీక్షకు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, అనంతపూర్ పట్టణాల్లో పరీక్షకేంద్రాలు ఏర్పాటు చేశారని వివరించారు. -
బతుకు పడవకు బొరియలు!
ముత్తుకూరు, న్యూస్లైన్: రైతులు, వ్యవసాయ కూలీల బతుకుతెరువుకు ఏరు దాటించే పడవ ఒకటి బొరియలు పడి, పూర్తిగా శిథిలమైపోయింది. ఈ పడవలో ఏటిపై ప్రయాణం దినదినగండంగా మారింది. దొరువులపాళెం, వెంకన్నపాళెం రైతులకు కండలేరుక్రీక్కు ద క్షిణాన చిల్లకూరు మండలంలో 350 ఎకరాల పొలాలు ఉన్నాయి. ఈ పొలాలు సాగు చేయాలంటే రైతులు, వ్యవసాయ కూలీలు పడవ ద్వారా దళితవాడ వద్ద కారాక రేవు నుంచి ఏరు దాటాలి. అంతకుముందు ఉన్న తెప్ప ఏట్లో కొట్టుకుపోవడంతో స్థానికులు తీవ్ర అందోళనకు గురయ్యారు. ఫలితంగా స్థానిక నాయకుడు దువ్వూరు విశ్వమోహన్రెడ్డి చొరవతో 10 ఏళ్ల క్రితం మత్స్యశాఖ ద్వారా ఒక ఫైబర్బోటు పంపిణీ చేయించారు. ఇంజన్ లేని ఈ పడవను నడిపేందుకు రైతులు పట్టపుపాళెంనకు చెందిన వావిళ్ల అంజయ్యను నియమించుకున్నారు. ఏటిలో ఈ కొస నుంచి ఆ చివరకు మధ్యలో కొయ్యలు నాటి, దీనికి క ట్టిన బలమైన తాడు ఆధారంగా అంజయ్య అటు ఇటూ పడవ నడుపుతున్నాడు. అయితే, ఈ పడవ కొద్ది సంవత్సరాల క్రితం శిథిలమైపోయింది. అడుగు భాగంగా చిల్లులు పడి, పడవలోకి నీరు చేరడంతో రైతులంతా కలిసి ప్లాస్టిక్ గోతాలతో బొరియలు పూడ్చారు. అప్పటి నుంచి స్థానిక నాయకులు కొత్త పడవ కోసం పలుమార్లు మత్స్యశాఖ అధికారులను కలిశారు. అయినా కొత్త పడవ మంజూరుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ముఖ్యంగా పోటు సమయంలో ఉధృతంగా ప్రవహించే ఉప్పుటేరులో ఈ పడవ ఎక్కే వాళ్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నారు. మత్స్యశాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని తిట్టుకొంటూ కాలం నెట్టుకొస్తున్నారు. పడవ లేకుంటే వ్యవసాయం లేదు: కండలేరు క్రీక్ను దాటించే ఈ ఫైబర్బోటు లేకుంటే ఈ ప్రాంతంలో వ్యవసాయం ఉండదనే చెప్పాలి. రైతులు, కూలీలే కాకుండా మేకలు, గొర్రెలు, కూలీలకు భోజనాలు తీసుకెళ్లే పనివాళ్లు, పురుగు మందులు, ఎరువులు సమస్తం ఈ పడవ ద్వారా నిత్యం ఆవలి గట్టు పొలాలకు తరలిస్తున్నారు. వ్యవసాయ సీజన్లో అయితే రోజుకు 100 సార్లు పడవ అటూఇటూ తిరగాల్సిందే. పడవ నడిపినందుకు ఏటా ఎకరాకు ఐదు ముంతల ధాన్యం రైతులు అంజయ్యకు జీతం ఇస్తున్నారు. వయోభారం కుంగదీస్తున్నా పడవను నమ్ముకొని అంజయ్య బతుకు నావను లాక్కొస్తున్నాడు. పడవ లేకుంటే పనులే లేవు పూర్తిగా శిథిలమైపోయినప్పటికీ ఈ పడవ లేకుంటే మాకు పనులే ఉండవు. ఉప్పుటేరుపై వంతెన నిర్మిస్తే ప్రమాదకరమైన పడవ ప్రయాణం తప్పుతుంది. లేకుంటే అధికారులు కొత్త ఇంజన్ పడవ మంజూరు చేయాలి. - సొక్కా సుబ్బరామయ్య, స్థానికుడు ఏటా మూడు పుట్ల ధాన్యం వస్తుంది పడవ నడపడం ద్వారా రైతుల నుంచి ఏటా మాకు మూడు పుట్ల ధాన్యం గిట్టుబాటు అవుతుంది. అయితే, దెబ్బతిన్న పడవలో ప్రయాణం చేయాలంటే భయపడిపోతున్నారు. తాడుతో పడవ లాగడం చాలా కష్టంగా ఉంది. - వావిల అంజయ్య, పడవ సరంగు కొత్త పడవ కోసం ప్రతిపాదనలు జిల్లాలో ఇటువంటి ఐదు పడవలు శిథిలమైపోయాయి. వీటిని బాగు చేయాలంటే రూ 4.50 లక్షలు కావాలని ఉన్నతాధికారులను కోరాము. కండలేరుక్రీక్ దాటేం దుకు ఇంజన్ ఉన్న కొత్త పడవ కోసం గతంలో ప్రతిపాదించాం. - ప్రసాద్, ఎఫ్డీఓ, మత్స్యశాఖ