-
ఏపీఎస్ ఆర్టీసీకి ఏఎస్ఆర్టీయూ ఎక్స్లెన్స్ అవార్డు
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) సంస్థ అందించే ప్రతిష్టాత్మక ఎక్స్లెన్స్ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ)కి ప్రథమ స్థానం దక్కింది. ‘ఐటీ ఇన్ డిజిటలైజేషన్’ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఈ పురస్కారం ఆర్టీసీని వరించింది. ఈ పోటీల్లో దేశంలోని 64 రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లు పాల్గొనగా, ఏపీఎస్ ఆర్టీసీకి అవార్డు లభించింది. ఏపీఎస్ ఆర్టీసీలో ఐటీ విభాగం ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తోంది. ట్రాకింగ్ సిస్టమ్, రిజర్వేషన్ విధానం తదితరాలు ప్రయాణికులకు ఆటంకాల్లేని సేవలు అందిస్తున్నాయి. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోని ఆర్టీసీలో ఐటీ పనితీరు మెరుగ్గా ఉంది. శుక్రవారం ఢిల్లీలో రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి విజయ్కుమార్ సింగ్ చేతుల మీదుగా ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ఈ అవార్డు కింద రూ.10 లక్షల నగదు పురస్కారం అందుకున్నారు. -
బీజేపీలోకి మాజీ సైన్యాధిపతి
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ విజయ్కుమార్ సింగ్ (వీకే సింగ్) శనివారం బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో సింగ్తోపాటు ఆర్మీ, వాయుసేనకు చెందిన పలువురు ఉన్నతాధికారులకు పార్టీ కండువా కప్పి పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ ఆహ్వానించారు. దేశ ప్రయోజనాల కోసం పాటుపడే ఏకైక జాతీయ పార్టీ బీజేపీయేనని.. అందుకే తాను ఈ పార్టీలో చేరుతునట్లు ఈ సందర్భంగా వీకే సింగ్(63) చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. తన పుట్టిన తేదీ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో పోరాటం చేసి ఓడిపోయిన వీకే సింగ్ 10 నెలల క్రితం ఉద్యోగ విమరణ చేశారు. ఇప్పుడు బీజేపీలో చేరడం ద్వారా కాంగ్రెస్పై ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు. స్థిరమైన, బలమైన కేంద్ర ప్రభుత్వం ఏర్పడేందుకు జాతీయవాద శక్తులను బలపరచాలని విశ్రాంత సైనికులకు పిలుపునిచ్చారు. జాతి నిర్మాణానికి, శక్తిమంతం కోసం బీజేపీతో కలసి అడుగులు వేయనున్నట్లు చెప్పారు. అన్నా హజారే బృందంలో సభ్యుడైన సింగ్ బీజేపీలో చేరడంతో.. అన్నాను వదిలేసినట్లేనా? అని విలేకరులు ప్రశ్నించారు. దీంతో తానెవరినీ విడిచిపెట్టలేదని సింగ్ స్పష్టం చేశారు. సింగ్తోపాటు బీజేపీలో చేరిన విశ్రాంత సైనిక ఉన్నతాధికారుల్లో వీకే చతుర్వేది సహా పలువురు ఉన్నారు. సైనికుల సంక్షేమానికి కృషి.. బీజేపీలోకి వీకే సింగ్ను సాదరంగా ఆహ్వానించిన రాజ్నాథ్సింగ్.. తాము అధికారంలోకి వస్తే రక్షణ దళాల ఉద్యోగులు, మాజీ సైనికుల సంక్షేమానికి కృషి చేస్తామని.. సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అలాగే, ఢిల్లీలో జాతీయ వార్ మెమోరియల్ను నిర్మిస్తామని, ఆయుధాల కొనుగోళ్లలో పారదర్శకత తీసుకొస్తామన్నారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ యూపీఏ సర్కారు వైఫల్యాలపై దాడికి దిగారు. యూపీఏ హయాంలో దేశరక్షణ బలహీనపడిపోయిందని విమర్శించారు. చైనా చొరబాట్లు, సరిహద్దుల్లో భారత సైనికుల తలల నరికివేత, పాక్ కాల్పుల ఉల్లంఘనలపై రాజ్నాథ్ మండిపడ్డారు. రక్షణ దళాలను యూపీ ఏ సర్కారు నిర్లక్ష్యం చేసిందని.. నేవీలో ఇటీవలి పరిణామాలను ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. సైన్యంలో ఆధునీకరణను విస్మరించారని కేంద్రంపై ధ్వజమెత్తారు. పార్టీల్లో చేరకుండా నిషేధించాలి: వీకే సింగ్ బీజేపీలో చేరడంపై పలు రాజకీయ పార్టీలు వ్యతిరేకంగా స్పందించాయి. ఉన్నతాధికారులు ఉద్యోగ విరమణ అనంతరం రాజకీయ పార్టీల్లో చేరకుండా నిబంధనలు తీసుకురావాలని డిమాండ్ చేశాయి. ప్రభుత్వ అధికారులు ఉద్యోగ విరమణ తర్వాత 10 ఏళ్ల వరకు పార్టీల్లో చేరకుండా నిషేధం విధించాలని ఎస్పీ ప్రధాన కార్యదర్శి నరేశ్ అగర్వాల్ కోరారు. జేడీయూ బహిష్కృత ఎంపీ శివానంద్ తివారీ కూడా ఇదేవిధమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మాత్రం తేలిగ్గా తీసుకుంది. స్వేచ్ఛాయుత దేశంలో ఆయనొక స్వేచ్ఛగలిగిన వ్యక్తి(వీకే సింగ్) అని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ మనుసింఘ్వి చెప్పారు. తర్వాతి ప్రధాని మోడీయే: రాఖీ సావంత్ బీజేపీలోకి వీకే సింగ్, ఇతరుల చేరిక సందర్భంగా బీజేపీ కేంద్ర కార్యాలయంలో అనుకోని అతిథిలా బాలీవుడ్ ఐటమ్ బాంబ్ రాఖీ సావంత్ ప్రత్యక్షమైంది. బీజేపీలో చేరిన మాజీ సైనికాధికారులకు రాఖీలు కూడా కట్టి ఆమె రాజ్నాథ్ సింగ్తో సహా అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒప్పుకుంటే ఆయనను మనువాడతానంటూ గతంలో సంచలనం రేపిన ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ తాజాగా తన దృష్టిని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపైకి మళ్లించింది. మోడీని పెళ్లి చేసుకుంటానని అనలేదు కానీ.. దేశానికి తర్వాతి ప్రధాన మంత్రి ఆయనేనని, ఆయన తరఫున వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తానని సెలవిచ్చింది. దీంతో రాజకీయాల్లోకి ప్రవేశించాలని రాఖీ భావిస్తున్నారని సంకేతాలు అందినట్లైంది. -
సైనిక శిబిరంలో రాజకీయ కలకలం
నిగూఢమైన సైనిక వ్యవహారాలకు, నివురుగప్పిన నిప్పు లా ఉండే కాశ్మీర్కు మధ్య ఏర్పడిన రగడ ఇది. ఇటీవల పదవీ విమరణ చేసిన ఆర్మీ చీఫ్ జనరల్ విజయ్కుమార్ సింగ్ దీనికి కేంద్ర బిందువు. ఈ వివాదంలో కొన్ని అం శాలు సుస్పష్టంగా ఉన్నాయి. ఆరోపణలు కరాఖండిగా కూడా ఉన్నాయి. అయితే దర్యాప్తు జరిపించడానికి, బాధ్యులైన వారిని దేశం ముందు నిలబెట్టడానికి గాని ఉన్న అవకాశాలు అత్యంత పరిమితం. ఈ వివాదంలో సరి హద్దు రాష్ట్రమైన జమ్మూ-కాశ్మీర్ ప్రభుత్వాన్ని అస్థిరతకు గురిచేయడానికి సాక్షాత్తు ఒక మంత్రికే ముడుపులు ముట్టాయన్నది ఒక ఆరోపణ. వీకే సింగ్ వారసునిగా బిక్రమ్సింగ్కు అవకాశం రాకుండా కుట్రపన్నారన్న ఆరో పణ మరొకటి. జమ్మూ-కాశ్మీర్ వంటి సమస్యాత్మక రాష్ట్రం లో వీకే సింగ్ గూఢచర్యం నడపడానికి ఒక సంస్థ సేవలు వినియోగించుకున్నారన్నది మరో ఆరోపణ. దీని కోసం కేటాయించిన నిధులను సైనిక దళాల ప్రధానాధికారి దుర్వినియోగం చేశాడన్న మాటా ఉంది. ఈ మొత్తం అం శం మీద సీబీఐ దర్యాప్తు జరపడం గురించి కేంద్ర ప్రభు త్వం, రక్షణ మంత్రిత్వశాఖ ఒక నిర్ణయానికి రాలేని పరి స్థితి ఏర్పడింది. కారణం సైనిక వ్యవహారాలు, దేశ భద్రతే. జనరల్ వీకే సింగ్ 1970లో సైన్యంలో చేరారు. తం డ్రి, తాత కూడా సైనికులే. సింగ్ మార్చి 31, 2010లో సైనిక దళాల ప్రధానాధికారి అయ్యారు. మే 31, 2012లో పదవీ విరమణ చేశారు. ఈ కాలమే ఈ మొత్తం వివాదా నికి భూమిక. సింగ్ పదవి చేపట్టిన కొద్ది కాలానికే అంటే 2010, మే నెలలో టెక్నికల్ సర్వీసెస్ డివిజన్ (టీఎస్డీ) అనే గూఢచారి సంస్థను కాశ్మీర్లోనూ నెలకొల్పారు. ఎలాంటి జమా ఖర్చులు చూపించనవసరం లేని రీతిలో టీఎస్డీకి నిధులు కేటాయించుకునే అవకాశం ఉంది. అం దువలనే సింగ్ ఆ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని మొన్న సెప్టెంబర్ 20న ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక బయ టపెట్టింది. దీనిని సింగ్ పూర్తిగా ఖండించలేదు సరి కదా పత్రిక పేర్కొన్న అంశాలు సైనిక, గూఢచర్యాలలో సర్వ సాధారణమేనని మూడురోజుల తర్వాత ఒక ఛానె ల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటించడం విశేషం. వీకే సింగ్ వారసునిగా బిక్రమ్సింగ్ పదవి చేపట్టిన తర్వాతే ఈ పరిణామాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేగం గా చోటు చేసుకున్నాయి. సింగ్ స్వరాష్ట్రం హర్యానా. అక్కడే రేవారి అనే పట్టణంలో సెప్టెంబర్ 15న ఎన్డీఏ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తొలి సభ జరిగింది. ఆ సభలో మోడీ పక్కన సింగ్ ఆశీనులయ్యారు. బిక్రమ్సింగ్ ఆదే శించిన మేరకు లెఫ్ట్నెంట్ జనరల్ వినోద్ భాటియా రూపొందించిన నివేదిక అనూహ్యంగా నాలుగు రోజులకే బహిర్గతమైంది. ఆ అంశాలతో ఆంగ్ల దినపత్రిక సింగ్ వ్యవ హారాలపై కథనం ప్రచురించి సంచలనం రేపింది. ఈ నివే దికలోనే కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని అస్థిరం పాలు చేయడానికి వ్యవసాయ మంత్రి గులాం హసన్ మీర్కు రూ.1.19 కోట్లు ముడుపులుగా అందజేసి నట్లు ఆరోపణలున్నాయి. వీటిని మీర్ వెంటనే ఖండిం చారు. జమ్మూ-కాశ్మీర్ హ్యుమానిటేరియన్ సర్వీస్ ఆర్గనై జేషన్ పేరుతో ఒక ప్రభుత్వేతర సంస్థను ఏర్పాటు చేయ డానికి కూడా వీకే సింగ్ ప్రోత్సహించారన్న ఆరోపణ ఉం ది. కాశ్మీర్లో జరిగిన ఒక ఎన్కౌంటర్కు బిక్రమ్సింగ్ను బాధ్యుడిని చేసి సైనిక దళాల ప్రధానాధికారి పదవి దక్క కుండా ఈ ఎన్జీఓను అడ్డుపెట్టుకునే వీకే సింగ్ ప్రయత్నం చేశారని ఆరోపణలున్నాయి. ఈ సంస్థకు రూ.2.38 కోట్లు చెల్లించారని భాటియా నివేదికలో ఉన్నట్లు ఆంగ్ల దినపత్రిక బయటపెట్టింది. కేంద్ర ప్రభుత్వోద్యోగులు, రక్షణ సిబ్బం ది, కాశ్మీర్ రాజకీయ నాయకుల సెల్ఫోన్లు టాపింగ్ చేయడానికి అవసరమైన యంత్ర పరికరాలను దిగుమతి చేసుకోవడానికి టీఎస్డీ ద్వారానే రూ.8 కోట్లు మంజూరు చేశారని కూడా సింగ్పై ఆరోపణలు ఉన్నాయి. 2008లో ముంబై నగరం మీద ఉగ్రవాదులు దాడులు జరిపిన తరువాత టీఎస్డీని ఏర్పాటు చేశారు. దానిని అత్యంత రహస్యంగా ఉంచారు. అయితే రాజకీయ నాయ కుల ైవైఖరి, సెన్యం మీద పడిన రాజకీయ నీడ ఫలితంగా ఈ వివాదం పుణ్యమా అని టీఎస్డీ పేరు వెలుగులోకి వచ్చింది. టీఎస్డీ పేరు సహా సింగ్ మీద ఉన్న ఆరోపణ లు బహిర్గతమైన సమయం గురించి ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆంగ్ల దినపత్రిక నివేదిక మీద స్పందిం చినప్పుడు వీకే సింగ్, ఇదంతా కాంగ్రెస్ కుట్రేనని సమా ధానం ఇచ్చారు. దేశ భద్రతల దృష్ట్యా ఈ అంశం మీద ఎక్కువగా మాట్లాడలేమని చెబుతూనే కాంగ్రెస్ నాయ కులు సింగ్ మీద ఆరోపణలు రుజువైతే చర్యలు తీసుకునే విషయం ఆలోచిస్తామని మాత్రమే చెబుతున్నారు. దర్యా ప్తు గురించి కూడా ఒక ప్రకటన చేయడానికి కాంగ్రెస్ నాయకులు సిద్ధపడటం లేదు. అయితే జమ్మూ-కాశ్మీర్ శాసనసభ మాత్రం వీకే సింగ్ వ్యవహారం మీద దర్యాప్తు జరిపించాల్సిందేనని అక్టోబర్ 6న కోరింది. నేషనల్ కాన్ఫ రెన్స్తో సహా కాశ్మీర్కు చెందిన అన్ని రాజకీయ పార్టీలు ఈ ముడుపుల వ్యవహారం మీద దర్యాప్తు చేయించాల్సిందే నని పట్టుబడుతున్నాయి. కానీ అవసరమైనప్పుడు ముడు పులు చెల్లించడం గతంలోనూ ఉందని వీకే చేసిన వ్యాఖ్య ను ఎనిమిది మంది మాజీ సైన్యాధ్యక్షులు ఖండించారు. ఏమైనా ఈ అంశం మీద దర్యాప్తు జరపడం కేంద్రానికి అంత సులభం కాదని అర్థమవుతోంది. ఇప్పుడు దరాప్తు చేస్తే మరిన్ని వివాదాలు తెర మీదకు వచ్చే అవకాశం ఉం టుందన్న భీతి కూడా ఉంది. మోడీ సభలో పాల్గొనడానికి ముందే సామాజిక ఉద్య మకారుడు అన్నా హజారేను వీకే సింగ్ సమర్థించారు. సైనికుల స్థితిగతుల గురించి ఆయన నేరుగా ప్రధానికి లేఖ రాసి ఇరుకున పెట్టారు. అవినీతి ఆరోపణలు ఉన్న సైనికా ధికారులపట్ల సింగ్ తన హయాంలో కఠినంగా వ్యవహ రించారన్న పేరు ఉంది. కాబట్టి యూపీఏ ప్రభుత్వం సిం గ్ మీద కక్షపూరిత వైఖరితో వ్యవహరిస్తుందని ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారం చూస్తే తెర వెనుక మం త్రాంగమే ఎక్కువ అని అనుకోక తప్పదు. దేశ భద్రత, కాశ్మీర్ వ్యవహారం ముడిపడి ఉన్న ఇలాంటి ఉదంతంలో కూడా నేతల బాధ్యతారాహిత్యం క్షమార్హం కాదు. -డాక్టర్ గోపరాజు నారాయణరావు
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement