breaking news
Unanimous vote
-
నేపాల్ కొత్త మ్యాప్ : ఆ మూడూ మావే
కఠ్మాండు: భారత్లోని కొన్ని సరిహద్దు ప్రాంతాలు తమకే చెందుతాయంటూ ఇటీవల వాదనలు ప్రారంభించిన నేపాల్ ఆ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును ఆ దేశ పార్లమెంట్లో దిగువసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్ను సవరిస్తూ ప్రభుత్వం శనివారం దిగువసభలో ప్రవేశపెట్టిన బిల్లుకు ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా పార్టీ–నేపాల్, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ కూడా మద్దతు తెలిపాయి. సభకు హాజరైన 258 మంది సభ్యులూ ఈ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. ‘ఈ సవరణను మూడింట రెండొంతుల కంటే ఎక్కువ మెజారిటీతో సభ ఆమోదించింది’అని స్పీకర్ అగ్ని సప్కోటే ప్రకటించారు. ఈ బిల్లు నేషనల్ అసెంబ్లీకి వెళుతుంది. ఆమోదం అనంతరం అక్కడి నుంచి అధ్యక్షుడి సంతకంతో చట్టంగా మారుతుంది. ఆ మేరకు రాజ్యాంగంలో సవరణలు జరుగుతాయి. దీనిద్వారా నేపాల్ జాతీయ చిహ్నంలోని దేశ రాజకీయ మ్యాప్లో మార్పులు చోటుచేసుకుంటాయి. అన్ని అధికార పత్రాల్లో ఈ మ్యాప్ ఉంటుంది. కాగా, నేపాల్ చర్యను భారత్ శనివారం తీవ్రంగా ఖండించింది. నేపాల్ కృత్రిమంగా తమ భూభాగాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోందంటూ ఆరోపించింది. ‘ఇది చారిత్రక సందర్భం. రాచరిక పాలనలో పోగొట్టుకున్న భూమిని ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పొందబోతున్నాం. ఈ విషయంలో దక్షిణ సరిహద్దులోని పొరుగుదేశంతో శత్రుత్వం కోరుకోవడం లేదు. ఎంతోకాలంగా కొనసాగుతున్న ఈ వివాదం దౌత్యపరమైన సంభాషణలు, చర్చల ద్వారా పరిష్కారమవుతుంది’అని అధికార ఎన్సీపీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని పుష్పకమల్ దహల్ విశ్వాసం వ్యక్తం చేశారు. నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్బా మాట్లాడుతూ.. ‘జాతి సమగ్రత, జాతీయత అంశాల్లో నేపాల్ ప్రజలు ఐక్యంగా నిలుస్తారు. 1816లో జరిగిన సుగాలీ ఒప్పందం ప్రకారం..మహాకాళి నదికి తూర్పు భాగం నేపాల్కే చెందుతుంది’అని పేర్కొన్నారు. ఈ మూడు ప్రాంతాలు నేపాల్కే చెందుతాయని, వాటిని భారత్ నుంచి పొందుతామని నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి అన్నారు. ఆధారాల్లేవన్న ప్రతిపక్ష నేత కాలాపానీ సహా ఇతర ప్రాంతాలు నేపాల్కే చెందుతాయనేందుకు ఎలాంటి రుజువులు లేవని జనతా సమాజ్వాదీ పార్టీ సరితా గిరి అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు సవరణలు ప్రతిపాదించారు. ఆ సవరణ నిబంధనలకు అనుగుణంగా లేదంటూ స్పీకర్ దానిని తిరస్కరించడంతో ఆమె సభ నుంచి వాకౌట్ చేశారు. వివాదం ఎందుకు తలెత్తింది? లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలతో కలిపి 2019 నవంబర్లో భారత్ రాజకీయ మ్యాప్ విడుదల చేసింది. దీంతోపాటు ఉత్తరాఖండ్లోని దార్చులా ప్రాంతాన్ని లిపులేఖ్తో కలిపే 80 కిలోమీటర్ల పొడవైన వ్యూహాత్మకంగా కీలకమైన రహదారిని మే 18వ తేదీన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. అప్పటి నుంచి నేపాల్ అభ్యంతరాలు మొదలయ్యాయి. అంగీకారయోగ్యం కాదు: భారత్ తమ భూభాగాలను కూడా కలుపుకుంటూ రూపొందించిన రాజకీయ మ్యాప్ను నేపాల్ పార్లమెంట్ ఆమోదిం చడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని భారత్ పేర్కొంది. అవి నేపాల్లోని వని చెప్పేందుకు చారిత్రక సత్యాలు, ఆధారాలు లేవని భారత విదేశాంగ శాఖ తెలిపింది. కృత్రిమంగా భూభాగాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోందంటూ విమర్శించింది. సరిహద్దు అంశాలపై చర్చించేందుకు ముందుగా కుదిరిన అవగాహనను కూడా ఉల్లంఘించిందని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అన్నారు. ఇతరుల ప్రోద్బలంతోనే నేపాల్ ఇలా వ్యవహరిస్తోందని ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే పరోక్షంగా చైనానుద్దేశించి పేర్కొన్నారు. -
కొల్లేరుపై ఏకగ్రీవ తీర్మానం
కాంటూర్ స్థాయిని 3కు తగ్గించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ ఏపీ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం వైఎస్ హయాంలో 2008లోనూ ఇలాంటి తీర్మానమే చేసిన సభ మళ్లీ కొత్తగా చేసినట్లు బాబు బిల్డప్ ఇస్తున్నారని విమర్శించిన జగన్ హైదరాబాద్: కొల్లేరు కాంటూర్ స్థాయిని +5 మీటర్ల నుంచి +3 మీట ర్లకు తగ్గించాలని కేంద్రానికి విజ్ఞప్తిచే స్తూ శాసనసభ మంగళవారం ఏకగ్రీ వంగా తీర్మానం చేసింది. మంత్రి గోపాలకృష్ణారెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఆమోదించినట్లు స్పీకర్ కె. శివప్రసాదరావు ప్రకటిస్తున్న తరుణం లో వైఎస్సార్సీపీ సభ్యుడు శ్రీకాంత్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కొల్లేరు కాంటూరు స్థాయి తగ్గించాలనే తీర్మానానికి తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని, అయితే ఏకగీవ్ర తీర్మానం చేసే ముందు విపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వడం సంప్రదాయన్నారు. దానికి స్పీకర్ అంగీకరించారు. ‘2008లోనే కాంటూ రుస్థాయి తగ్గించాలని శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించిం దని, ఇప్పుడు కొత్తగా చేయాల్సిన అవసరం ఏముంది. గతంలో చేసిన తీర్మానంపై కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి కాంటూరుస్థాయి తగ్గించే ప్రయత్నాలు చేస్తే సమయం కలిసొస్తుంది’ అని సూచించారు. కొల్లేరు రైతులకు వైఎస్ అన్యాయం చేశారన్న అధికార పక్ష సభ్యుల విమర్శలకు ప్రతిపక్ష నేత జగన్ సమాధానమిచ్చారు. కొల్లేరు ప్రజల ఇబ్బంది చూసే నాడు వైఎస్ తీర్మానం చేశారు ‘‘చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలతో చక్కగా కట్టుకథలు చెప్పిస్తున్నారు. తొమ్మి దేళ్లు సీఎంగా ఉన్న బాబు.. తన హయాంలో కాంటూరు స్థాయిని తగ్గించే తీర్మానం ఎందుకు చేయలేదు? వైఎస్ సీఎం అయిన తర్వాతే తీర్మానం ఎందుకు చేశారు? వైఎస్ ప్రభుత్వం చేసిన తీర్మానం గురించి ఎక్కడా ప్రస్తావించకుండా, కొత్తగా తానే చేస్తున్నట్లు చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారు. బాంబులతో చేపల చెరువులను పేల్చారని చెబుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే, స్పందించాలి కాబట్టి అప్పటి ప్రభుత్వం స్పందించింది. తీర్పును అమలు చేసిన తర్వాత.. కొల్లేరు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గుర్తించిన వైఎస్ శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కాం టూరు స్థాయిని 3కు తగ్గించడానికి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చారు. కానీ కేంద్రం ఆ పని చేయలేదు. తీర్మానం చేసిన ఆరు నెలల్లో దురదృష్టవశాత్తూ మహానేత వైఎస్ చనిపోయారు. కేంద్రంపై ఒత్తిడితెచ్చి కాంటూరు స్థాయిని తగ్గించేలా పనిచేయించుకుందాం. కలిసిరావడానికి మేం సిద్ధంగా ఉన్నాం’’ అని విపక్ష నేత పేర్కొన్నారు. ఇప్పటికే పడిన అడుగుల్లో ముందుకు సాగుదాం.. విపక్ష నేత వివరణ ఇచ్చిన తర్వాతా అధికార పక్ష సభ్యుల విమర్శలు ఆగలేదు. మళ్లీ జగన్ జోక్యం చేసుకొని ‘కొల్లేరు కాంటూరు స్థాయిని తగ్గించాలనే ప్రతిపాదనపై అధ్యయనం చేసిన సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నితాలజీ అండ్ నేచురల్ హిస్టరీ డెరైక్టర్ పి.ఎ.అజీజ్ నేతృత్వంలో అధ్యయన కమిటీ నివేదిక కూడా సమర్పించింది. ఈ దిశగా ఇప్పటికే కొన్ని అడుగులు పడిన నేపథ్యంలో.. అక్కడ నుంచి మొదలుపెడితే కేంద్రం త్వరగా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. లేదంటే.. శాసనసభలో తీర్మానం చేశామని, కేంద్రం చేయలేదని అంటూ నెపాన్ని నరేంద్ర మోదీ మీదకు నెట్టేసి ఐదేళ్లూ కాలం గడిపేసే ప్రమాదం ఉంది’’ అని అన్నారు. అనంతరం తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు. -
నిషేధంతో బీసీసీఐలో లలిత్ మోడీ ఖేల్ఖతమ్