breaking news
Tulsi tanti
-
సుజ్లాన్ ఎనర్జీ రైట్స్ ఇష్యూ 11న
న్యూఢిల్లీ: పవన విద్యుత్ రంగ కంపెనీ సుజ్లాన్ ఎనర్జీ రైట్స్ ఇష్యూ వచ్చే వారం(11న) ప్రారంభంకానుంది. కంపెనీ వ్యవస్థాపకులు, సీఎండీ తులసి తంతి ఇటీవల కన్ను మూసిన నేపథ్యంలో రైట్స్ ఇష్యూ అంశంపై సుజ్లాన్ తాజాగా స్పష్టతనిచ్చింది. రైట్స్ ద్వారా కంపెనీ రూ. 1,200 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ప్రమోటర్లు సైతం రైట్స్లో పాలుపంచుకోనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రమోటర్ల కోటాలో రైట్స్కు పూర్తి స్థాయిలో సబ్స్క్రయిబ్ చేసేందుకు ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంసిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. వెరసి గత నెల 28న ప్రతిపాదించిన ఎల్వోఎఫ్ ప్రకారం రైట్స్ ఇష్యూని చేపట్టనున్నట్లు వివరించింది. ఎల్వోఎఫ్ ప్రకారం షేరుకి రూ. 5 ధరలో 240 కోట్ల పాక్షిక చెల్లింపుల షేర్లను జారీ చేయనుంది. తద్వారా రూ. 1,200 కోట్లు సమకూర్చుకోనుంది. రైట్స్లో భాగంగా అక్టోబర్ 4కల్లా(రికార్డ్ డేట్) అర్హతగల వాటాదారుల వద్దగల ప్రతీ 21 షేర్లకుగాను 5 షేర్లను జారీ చేయనుంది. రైట్స్ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. రైట్స్ వార్తల నేపథ్యంలో సుజ్లాన్ ఎనర్జీ షేరు ఎన్ఎస్ఈలో 1.25 శాతం నీరసించి రూ. 7.90 వద్ద ముగిసింది. -
Suzlon Energy: ‘సుజ్లాన్’ తులసి తంతి తుది శ్వాస
న్యూఢిల్లీ: పవన విద్యుత్ రంగ దిగ్గజం సుజ్లాన్ ఎనర్జీ వ్యవస్థాపకుడు, విండ్ మ్యాన్గా పేరొందిన తులసి తంతి (64) కన్నుమూశారు. ఆయన శనివారం గుండెపోటుతో మరణించినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు కంపెనీ తెలిపింది. తులసి తంతికి భార్య (గీత), ఇద్దరు సంతానం (కుమారుడు ప్రణవ్, కుమార్తె నిధి) ఉన్నారు. ఆయన మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ సంతాపం వ్యక్తం చేశారు. ‘దేశ ఆర్థిక పురోగతికి తోడ్పడిన దిగ్గజాల్లో తులసి తంతి ఒకరు. ఆయన అకాల మరణంపై కుటుంబసభ్యులకు నా సంతాపం తెలియజేస్తున్నాను’ అని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ప్రధాని ట్వీట్ చేశారు. విలేకరుల సమావేశంలో పాల్గొని అహ్మదాబాద్ నుంచి పుణెకు వస్తుండగా ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ కారు డ్రైవరుకు తులసి తంతి సూచించారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందేలోగానే ఆయన కన్నుమూశారు. పవన విద్యుత్లో దిగ్గజం.. తులసి తంతి 1958లో రాజ్కోట్లో జన్మించారు. గుజరాత్ యూనివర్సిటీలో బీకామ్ చదివారు. 1995లో సుజ్లాన్ ఎనర్జీ ఏర్పాటుతో పవన విద్యుత్ రంగంలోకి ప్రవేశించారు. ఈ రంగంలో ప్రవేశించడానికి ముందు ఆయనకు టెక్స్టైల్ వ్యాపారం ఉండేది. దాన్ని 2001లో విక్రయించారు. అటు పైన 2003లో అమెరికన్ సంస్థ డాన్మర్ అండ్ అసోసియేట్స్ నుంచి 24 టర్బైన్లకు సుజ్లాన్కు భారీ ఆర్డరు దక్కింది. ఆ తర్వాత కంపెనీ వేగంగా విస్తరించడంలో తులసి తంతి కీలక పాత్ర పోషించారు. 2006 నుంచి బెల్జియంకు చెందిన టర్బైన్ విడిభాగాల తయారీ సంస్థ జెడ్ఎఫ్ విండ్ పవర్ యాంట్వెర్పెన్కు చైర్మన్గా వ్యవహరించారు. అలాగే ఇండియన్ విండ్ టర్బైన్ తయారీదారుల సమాఖ్యకు ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. కష్టకాలంలో కంపెనీ.. సుజ్లాన్ ఎనర్జీ ఆర్థిక సమస్యల్లో ఉన్న తరుణంలో తంతి అకాల మరణం ప్రాధాన్యం సంతరించుకుంది. 2005లో స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ అయిన తర్వాత శరవేగంగా కార్యకలాపాలు విస్తరించిన సుజ్లాన్ ఎనర్జీ ఒక దశలో రూ. 65,474 కోట్ల మార్కెట్ వేల్యుయేషన్ దక్కించుకుంది. కంపెనీలో మెజారిటీ వాటాలున్న తంతి సంపద విలువ దాదాపు రూ. 43,537 కోట్లకు పెరిగింది. అయితే, ఆ తర్వాత అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం తలెత్తడం, ఆ తర్వాత పరిణామాలతో పవన విద్యుత్ రంగం కుదేలైంది. దీనికి టర్బైన్లలో లోపాల ఫిర్యాదులు మొదలైనవి కూడా తోడు కావడంతో సుజ్లాన్పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. కంపెనీ విలువ రూ. 8,536 కోట్లకు పడిపోయింది. భారీగా రుణాలు పేరుకుపోయాయి. వాటిని తీర్చేందుకు వర్కింగ్ క్యాపిటల్, ఇతరత్రా అవసరాల కోసం నిధులను సమకూర్చుకునేందుకు సుజ్లాన్ అక్టోబర్ 11న రూ. 1,200 కోట్ల రైట్స్ ఇష్యూకు రానుంది. ఈ తరుణంలో తంతి హఠాన్మరణంతో తలెత్తబోయే పరిణామాలపై ఆసక్తి నెలకొంది. అయితే, అనుభవజ్ఞులైన బోర్డు డైరెక్టర్లు, సీనియర్ మేనేజ్మెంట్ సారథ్యంలో తంతి ఆకాంక్షలను నెరవేరుస్తామని సుజ్లాన్ ఎనర్జీ పేర్కొంది. -
మహారాష్ట్రలో కేటీఆర్ పర్యటన
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ముంబైలో పర్యటించారు. నగరంలోని వీసీ సర్కిల్ భాగస్వాముల సమ్మిట్ లో పాల్గొన్న ఆయన సమావేశంలో కీలకోపన్యాం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులకు ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోందని వివరించారు. పెట్టుబడులను ప్రోత్సహించేందుకు మల్టిపుల్ ప్లాట్ ఫామ్స్ సృష్టించామని తెలిపారు. మరో వైపు మంత్రి కేటీఆర్.. సంప్రదాయేతర ఇంధన సంస్థ సుజ్లాన్ సీఎండీ తులసీ తంతి తో భేటీ అయ్యారు. సౌర, పవన, హైబ్రీడ్ విద్యుత్ రంగంలో సుజ్లాన్ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తోంది. తెలంగాణలో ఈ ప్రాజక్టు ద్వారా.. 3000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమైతోంది. దీనికి కోసం సోలార్ ప్యానల్ తయారీ ప్రాజక్టు కోసం1200 రూపాయల కోట్ల పెట్టుబడులు తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తోంది.