breaking news
tiger population
-
దేశంలో క్రమంగా పెరుగుతున్న పులుల సంఖ్య
-
దేశంలో ఎన్ని పులులు ఉన్నాయంటే..? లెక్క చెప్పిన ప్రధాని మోదీ..
ఒకప్పుడు సరదా కోసం పులుల్ని వేటాడేవారు. ఆ తర్వాత కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు పులుల్ని బలి తీసుకున్నాయి. ప్రకృతి సమతుల్యతకి పులులెంత విలువైనవో ఆ తర్వాత మనకి తెలిసి వచి్చంది. 50 ఏళ్ల క్రితం మొదలు పెట్టిన టైగర్ ప్రాజెక్టు వల్ల పులుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. ప్రపంచంలోనే పులుల సంరక్షణ అంశంలో భారత్ అనుసరిస్తున్న విధానాలు ప్రపంచదేశాలకు మార్గదర్శకంగా మారాయి. నాలుగేళ్లకొకసారి అభయారణ్యాలలో పులుల్ని లెక్కించే ప్రక్రియ ఆసక్తికరంగా మారి గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కింది. మన దేశంలో పులుల సంరక్షణ కోసం 50 ఏళ్ల క్రితమే టైగర్ ప్రాజెక్టు మొదలైంది. పర్యావరణ పరిరక్షణకు, ప్రకృతి సమతుల్యతకి పులులు ఎంత ముఖ్యమో గ్రహించిన అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 1973, ఏప్రిల్ 1న ఈ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టింది. అప్పట్లో దేశీయంగా అంతరించడానికి సిద్ధంగా ఉన్న జాబితాలో పులులు చేరిపోయాయి. ఇరవయ్యో శతాబ్దంలో ప్రపంచ దేశాల్లో పులుల సంఖ్య లక్ష ఉంటే, మన దేశంలో 40 వేలు ఉండేవి. అలాంటిది 1970 నాటికి పులుల సంఖ్య దాదాపుగా 1,800కు పడిపోవడంతో కేంద్రం అప్రమత్తమైంది. అభివృద్ధి పేరిట అడవులకి, వన్యప్రాణులకి ఎంత నష్టం జరుగుతోందో గ్రహించి టైగర్ ప్రాజెక్టుని ప్రారంభించింది. తొలిదశలో 18,278 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో తొమ్మిది టైగర్ రిజర్వ్లు ఉండేవి. ప్రస్తుతం 75 వేల చదరపు కిలోమీటర్లు (దేశ భౌగోళిక విస్తీర్ణంలో 2.4%) విస్తీర్ణంలో 53కి పైగా టైగర్ రిజర్వులున్నాయి. ప్రపంచంలో మొత్తం పులుల్లో మన దేశంలో 70% ఉన్నాయంటే ఈ టైగర్ ప్రాజెక్టు ఎంతటి విజయాన్ని సాధించిందో తెలుస్తోంది. పులులను ఎలా లెక్కిస్తారంటే! దేశంలో పులుల సంరక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి వాటి గణన చేపట్టినప్పుడు అదో పెద్ద సవాల్గా నిలిచింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడంతో తొలినాళ్లలో అటవీ సిబ్బంది అడవుల్లో నడుచుకుంటూ వెళ్లి వన్యప్రాణులు కనిపిస్తే వాటి గుర్తులతో సహా ఎన్ని కనిపించాయో వివరాలను రాసుకొని లెక్కించేవారు. ఆ తర్వాత పగ్ మార్క్ విధానం అమల్లోకి వచ్చింది. పులుల పాద ముద్రలనే వాటిని లెక్కించడానికి వాడేవారు. మనుషుల వేలిముద్రలన్నీ ఎలా ఒక్కలా ఉండవో పులుల పాద ముద్రలు కూడా ఒకేలా ఉండవు. అలా పాదముద్రల్ని బట్టి ఎన్ని పులులు ఉన్నాయో గుర్తించేవారు. బటర్ పేపర్పై స్కెచ్పెన్తో పాద ముద్ర ఆకారాన్ని గీస్తారు. గాజుపలకపై తెల్లటి కాగితాన్ని ఉంచి ఆకారాన్ని దానిపై పడేలా చేస్తారు. నేలపై ఉన్న ముద్రల మీద చాక్పౌడర్ చల్లి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మిశ్రమాన్ని కలిపేవారు. ఆ మిశ్రమం గడ్డ కట్టి పులి పాదం అచ్చు లభించేది. ఆ పాద ముద్ర ఆధారంగా ఎన్ని పులులు తిరిగాయి, వాటి వయసు వంటివి తెలుసుకునేవారు. ఒక దశలో వన్యప్రాణుల గోళ్లు, మలం సేకరించి దాని ఆధారంగా కూడా గణన జరిగేది. కొన్నేళ్లు గడిచాక మరో కొత్త విధానాన్ని మొదలు పెట్టారు. పులులు చేతికి చిక్కినప్పుడు వాటిపై ప్రత్యేకమైన ముద్ర వేసేవారు. మళ్లీ వాటిని అడవుల్లో వదిలేసి ఆ తర్వాత లెక్కించే సమయంలో ముద్ర ఉందో లేదో చూసేవారు. ముద్ర లేని పులులు కనిపిస్తే కొత్తగా జాబితాలో వచ్చి చేరేవి. గత కొన్నేళ్ల నుంచి అత్యాధునిక కెమెరాలు వినియోగించి పులుల సంఖ్యని గణిస్తున్నారు. ఎక్కువగా పులులు సంచరించే ప్రాంతాలను గుర్తించి అక్కడ కెమెరాలు ఏర్పాటు చేసినట్టుగా జాతీయ పులుల సంరక్షణ అథారిటీ అధికారులు చెప్పారు. అడవుల్లో ఇరువైపులా ఉన్న చెట్లకు కెమెరాలు ఫిక్స్ చేయడం వల్ల పులులతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉండే వన్యప్రాణుల గురించి కూడా తెలుస్తుంది. ఇక పులుల ఎత్తు, వాటి నడక, వాటి శరీరంపై ఉండే చారల ఆధారంగా సంఖ్యను తెలుసుకుంటారు. గిన్నిస్ రికార్డుల్లోకి పులుల గణన మన దేశంలో పులుల గణన రికార్డులు తిరగరాసింది. కెమెరాల సాయంతో భారీగా వన్యప్రాణుల గణన చేపట్టిన తొలి దేశంగా భారత్ గిన్నిస్ రికార్డులకెక్కింది. 2018–2019 పులుల గణన ప్రపంచంలోనే అత్యంత సమగ్రమైనది. 141 ప్రదేశాల్లో 26,838 చోట్ల మోషన్ సెన్సర్లున్న కెమెరాలు అమర్చారు. ఈ ప్రక్రియలో 44 వేల మంది అధికారులు, జీవ శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 20 రాష్ట్రాల్లో రహస్య కెమెరాలు, ఇతర పద్ధతుల్లో పులులతో పాటు ఇతర వన్యప్రాణుల్ని లెక్కించడం రికార్డు సృష్టించింది. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో మోదీ ప్రాజెక్టు టైగర్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలో బందిపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పర్యటించారు. పశి్చమ కనుమల్లో ఉన్న ఈ అభయారణ్యంలో ఓపెన్ జీపులో దాదాపుగా 20 కి.మీ. దూరం ప్రయాణించి ప్రకృతి అందాలను తిలకించారు. కాకీప్యాంట్, షర్టు, నెత్తిన టోపి ధరించిన ప్రధాని మోదీ బందిపూర్ ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. ‘‘బందిపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉదయం గడిపాను. భారత దేశ ప్రకృతి రమణీయతను, వన్యప్రాణుల్లో వైవిధ్యాన్ని ఆస్వాదించాను’’ అని ట్వీట్లో పేర్కొన్నారు. బైనాక్యులర్స్ ద్వారా వన్యప్రాణుల్ని చూస్తూ, కెమెరాలో వాటిని బంధిస్తూ గడిపారు. గజరాజులతో ఆప్యాయంగా తర్వాత బందీపూర్ రిజర్వ్కు 12 కిలోమీటర్ల దూరంలో తమిళనాడులో మదుమలైలోని తెప్పకాడు ఏనుగుల శిబిరాన్ని మోదీ సందర్శించారు. ఏనుగులతో సరదాగా గడిపారు. ఇటీవల ఆస్కార్ అవార్డు పొందిన ఎలిఫెంట్ విస్పరర్స్ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన మావటి దంపతులు బొమ్మన్, బెళ్లిలను సన్మానించారు. వారితో కలిసి ఏనుగులకు చెరుకులు తినిపించారు. వారిని ఢిల్లీకి ఆహా్వనించారు. బుక్లెట్ విడుదల.. పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ కలసికట్టుగా ముందుకు వెళ్లడానికి భారత్ ప్రాధాన్యమిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పులుల సంరక్షణ కోసం ఉద్దేశించిన టైగర్ ప్రాజెక్టుకు 50 ఏళ్లయిన సందర్భంగా ఆదివారం మైసూరులోని కర్ణాటక స్టేట్ ఓపెన్ వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘‘ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియెన్స్’’ (ఐబీసీఏ) ప్రాజెక్టును ప్రారంభించారు. వచ్చే 25 ఏళ్లలో పులుల సంరక్షణకు చేపట్టబోయే చర్యలతో ‘‘అమృత్ కాల్ కా టైగర్ విజన్’’ బుక్లెట్ను విడుదల చేశారు. వన్యప్రాణుల సంరక్షణ ప్రపంచదేశాలు చేపట్టాల్సిన అతి ముఖ్యమైన అంశమని చెప్పారు. దేశంలో పులుల తాజా గణాంకాలను ఈ సందర్భంగా మోదీ వెల్లడించారు. 2022 నాటికి దేశంలో పెద్ద పులుల సంఖ్య 3,167కు పెరగడం హర్షణీయమన్నారు. ‘‘పులుల సంరక్షణ ద్వారా భారత్ ప్రకృతి సమతుల్యత సాధించింది. ఇది ప్రపంచానికే గర్వకారణం. ఒకప్పుడు దేశంలో అంతరించిన జాబితాలో చేరిన చీతాలను నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి తెచ్చాం. వాటి సంతతిని విజయవంతంగా పెంచుతున్నాం’’ అని చెప్పారు. పులులు, సింహాలు, చిరుతపులులు, మంచు చిరుతలు, ప్యూమా, జాగ్వార్, చీతా వంటి వన్యప్రాణుల్ని సంరక్షించడానికే ఐబీసీఏ ప్రాజెక్టుకు తెర తీసినట్టు చెప్పారు. Some more glimpses from the Bandipur Tiger Reserve. pic.twitter.com/uL7Aujsx9t — Narendra Modi (@narendramodi) April 9, 2023 చదవండి: కాంగ్రెస్కు మరో కొత్త సమస్య..నిరాహార దీక్ష చేస్తానంటున్న సచిన్ పైలట్ -
నల్లమలలో చెంచుల వేట!
ఆహార సేకరణ చక్రం నుంచి బయటపడని చెంచుకు అడవి బయటి జీవితం మరణ శాసనం కాదా? నల్లమలలో పులుల జనాభాను పెంచి ప్రశంసలందుకుంటున్న ప్రభుత్వాలే... అదే నల్లమల చెంచులు మన కళ్లముందే కాలగర్భంలోకనుమరుగైపోయేలా చూడటం విచిత్రం. బహుశా, అతి త్వరలోనే విదేశీ గుత్త సంస్థలు నల్లమల కడుపు తోడి వజ్రాలు, తదితర ఖనిజ సంపదలను ‘నాగరికంగా’ తవ్వి తరలించుకుపోవడం మొదలవుతుంది. ఆ విధ్వంసాన్ని కళ్లారా చూడటానికి నల్లమల కంటిపాపలు చెంచులు మిగిలి ఉండరేమో! ఏనాటిదో నల్లమల! ఆ కొండలు, దట్టమైన అడవుల పుట్టుక ఎప్పటిదో? ఆ లోయల్లో పలువంపులు తిరుగుతూ పరుగులు తీసే కృష్ణవేణమ్మ అక్కడికె ప్పుడు చేరిందో? లోకమంతటా అంతరిస్తున్నా ఇక్కడ మాత్రం ఇంకా తన ఉనికిని కాపాడుకుంటున్న పెద్దపులి జాతి ఎన్నాళ్లుగా నల్లమలను ఏలుతు న్నదో?... ఎక్కడా దొరకని అరుదైన దివ్యౌషధం సరస్వతి ఆకు (నాగరికులు పెట్టిన పేరు) అక్కడే ఎందుకు దొరుకుతున్నదో? రావణాసురుని చెరలో ఉన్న సీతమ్మకు నీడనిచ్చిన సరాక అశోకవృక్షం లంకకు ఆవల కేవలం నల్ల మలలోనే ఎందుకు విస్తారంగా కనబడుతున్నదో? మరెక్కడాలేని ఓ బుల్లి రకం (అతి చిన్న జింకజాతి) ‘బుర్రజింక’ ఇక్కడ మాత్రమే ఎందుకు గంతు లేస్తున్నదో? సాలీడు రాకాసి సాలీడుగా, జెర్రిపురుగు రోకలిబండగా, ఉడుత బెట్టుడుతగా భారీగా ఆకారాలు పెంచుకొని ఎందుకలా ఉంటాయో? ఈ అడవిలోని చెట్లతో స్నేహం చేస్తూ, పశుపక్ష్యాదులతో కలియ దిరుగుతూ అనాదిగా సహజీవనం చేస్తున్న ఓ ఆదిమ తెగ ‘చెంచులు’ పేరుతో ఇక్కడెప్పుడు వెలిసిందో? నల్లమల చెంచులు ఇప్పటికీ ఆహార సేకరణ దశను పూర్తిగా దాటలేదు. ఒక పర్యావరణ చక్రాన్ని నిర్దేశించుకున్న ప్రకృతి సహజ సూత్రాలకు అనుగుణంగానే వారి జీవితం ఉంటుంది. చెట్ల నుంచి రాలిపడే కాయలు, పళ్లను తింటారు. కాలానుగుణంగా దుంపలను తవ్వుకుంటారు. వంట చెరకు కోసం చెట్లను కొట్టరు. ఎండిపోయిన కొమ్మలను, పుల్లలను వినియోగిస్తారు. ఎండిపోయిన పేడను వెలిగిం చుకొనే పాలు కాచుకోవడం ఆచారం. సాధారణంగా ఉడుతలు, ఉడుములు, ఎలుకలు, కుందేళ్లు, పక్షులను వేటాడుతారు. జింకల వేట మాత్రం అరుదు. ఏ రోజు అవసరానికి ఆరోజే వేట. రేపటి కోసం దాచుకొనే అలవాటు చెంచులకు లేదు. వేలయేళ్లుగా ఇదే జీవనశైలితో అటవీ ఆహార చక్రంలో చెంచులు ఇమిడిపోయారు. ఈ చక్రం నుంచి బయటపడి బతకలేని స్థితికి చెంచు జీవితం చేరుకుంది. వ్యవసాయం నేర్పించి వీరిని ఆ చట్రం నుంచి బయటపడేయడానికి గతంలో జరిగిన కొన్ని ప్రయత్నాలు ఏవీ సత్ఫలితాలను ఇవ్వలేదు. భారతీయ ఆదిమ తెగలపై పరిశోధన చేసిన ఆస్ట్రియన్ మానుష శాస్త్రవేత్త హేమన్డార్ఫ్ సిఫారసు మేరకు నల్లమల అడవి అంచున మైదాన ప్రాంతాల్లోని లక్ష ఎకరాల భూమిని గుర్తించి చెంచుల వ్యవసాయం కోసం కేటాయిస్తూ నైజాం సర్కార్ 1940వ దశకంలో ఫర్మానా జారీ చేసింది. స్వాతంత్య్రానంతరం ప్రజా ప్రభుత్వాలు ఆ ప్రతిపాదనను అటకెక్కించాయి. బ్రిటిష్ పాలకులు కూడా కర్నూలు జిల్లా పెచ్చెరువు ప్రాం తంలో చెంచుల కోసం ఒక ఆశ్రమ పాఠశాలను, ఒక వైద్యశాలను ఏర్పాటు చేశారు. చెంచులకు ఉపాధి కల్పించడం కోసం వేల సంఖ్యలో టేకు చెట్లను నాటించారనేందుకు ఆధారాలున్నాయి. ఇదంతా ఎందుకంటే చెంచుల పట్ల బ్రిటిష్, నిజాం పాలకులు చూపినపాటి శ్రద్ధ మన ప్రజాప్రభుత్వాలకు లేకపోయిందని చెప్పడానికి. గిరిజనాభివృద్ధి కోసమే ఏర్పాటుచేసిన ఐటీడీఏ ఆచరణలో అటవీ సంపద దోపిడీకి ఉపయోగపడినంతగా గిరిజన జీవితాల్లో మార్పునకు ఉపకరించలేదు. నల్లమలలో ఈ సత్యం మరింత నగ్నంగా కనబడుతుంది. అడవుల్లో మానవ నివాస ప్రాంతాలు ఉండటంవల్ల వన్యప్రాణుల ఉనికికి భంగం కలుగుతోందనీ, వారిని మైదాన ప్రాంతాలకు తరలించాలనీ చెబుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక ప్యాకేజీని ప్రకటించింది. ఆ ప్యాకేజీ ప్రకారం చెంచు పెంటలను(ఆవాసాలను) తరలించే హడావుడి మొదలైంది. మొదటి దశ కింద తరలించాలని ప్రకటించిన పల్లెల్లో మహబూబ్నగర్ జిల్లా లోని వట్వార్లపెల్లి, సార్లపెల్లి, కుడి చింతలబైలు వగైరా పెంటలు అభయా రణ్యంలో కాక, అడవి అంచున బఫర్ జోన్లోనే ఉన్నాయి. పైగా అది పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్న మల్లెల తీర్థానికి వెళ్లే దారిలో ఉంటాయి. వన్యప్రాణులకు పర్యాటక కేంద్రంవల్ల లేని ముప్పు చెంచు పెంటల వల్ల కలుగుతుందా? గిరిజనుల తరలింపును అమలు చేయడానికి వన్యప్రాణులు ఒక సాకు మాత్రమే అనేందుకు ఇదొక చక్కని ఉదాహరణ. పైగా వందలు, వేలయేళ్లుగా వన్యప్రాణులతో సహజీవనం చేస్తూ అటవీ సంపదకు రక్షణగా నిలబడిన గిరిజనుల తరలింపువల్ల అటవీ సంపద దోపిడీకి, వన్యప్రాణుల విధ్యంసానికి ఇక ఎదురేముంటుంది? అడవిలోకి నాగరికుల చొరబాటు పెరిగిన దగ్గర్నుంచే అటవీ సంపద తరుగుతోందని చెప్పేందుకు అనేక ఉదాహరణలున్నాయి. ఐటీడీఏ ఏర్పాటైన తర్వాత గిరిజనుల నుంచి ఈ సంస్థ అటవీ ఉత్పత్తులను సేకరించి, వారికి ప్రతిఫలం ముట్టజెప్పడం ప్రారంభించింది. క్రమేపీ బినామీ పేర్లతో నాగరి కులు ఈ పనుల్లోకి చొరబడ్డారు. మన్ననూర్ గిరిజన సహకార కేంద్రానికి 2006లో 13 క్వింటాళ్ల నరమామిడి చెక్క అమ్మకానికి వస్తే 2010లో ఒక క్వింటాల్ మాత్రమే వచ్చింది. అరుదైన నరమామిడి చెట్ల నుంచి గిరిజనులైతే చెట్టు మొదలును ముట్టుకోకుండా పైభాగానున్న కొమ్మల నుంచి జాగ్రత్తగా చెక్కను తీస్తారు. మైదాన ప్రాంత బినామీలు డబ్బు కక్కుర్తితో చెట్లను మొద లంటా నరికిపారేసి, నాలుగేళ్లలో ఆ ప్రాంతంలో నరమామిడి చెట్టన్నదే లేకుం డా చేశారు. అడవిలో పెరిగే అడ్డాకు తీగలు చెట్ల మొదళ్లను అల్లుకుంటూ కొమ్మలమీదగా వ్యాపిస్తాయి. విస్తళ్ల తయారీకి ఉపయోగించే ఈ అడ్డాకులను గిరిజనులు ఒడుపుగా చెట్ల పెకైక్కి తీగకు గాయం కాకుండా సేకరిస్తారు. మైదానం నుంచి వచ్చే కిరాయి మనుషులు చెట్లను కూల్చి, తీగల్ని తెంపి మరీ అడ్డాకును సేకరిస్తారు. చెట్టుపైనే పాకానికి వచ్చి, ఎండి రాలిపోయిన కుంకు ళ్లను మాత్రమే గిరిజనులు సేకరిస్తారు. మైదాన వాసులు కొమ్మలను నరికి మరీ కుంకుళ్లను సేకరిస్తారు. వన్యప్రాణుల విషయంలోనూ అంతే. గిరిజను డికి అడవి తల్లితో సమానం. అడవిలోని సమస్త జీవరాశినీ అతడు ప్రేమి స్తాడు. అటువంటి గిరిజనుడి వలన వన్యప్రాణులకు ప్రమాదమని చెప్పడం ఎంత బూటకం? కనుక, ఈ తరలింపు వెనుక ఏదో మతలబు ఉంది. దేశంలోని వివిధ అరణ్యాల గర్భాన దాగి ఉన్న అపార ఖనిజ సంపదల పైకి బహుళజాతి కంపెనీలు ఎన్నాళ్లుగానో గురిని ఎక్కుపెట్టాయి. యథాశక్తి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి సహకరిస్తున్నాయి. నల్లమల అడవుల్లోనూ, కృష్ణాతీరం వెంట అత్యంత విలువైన కింబర్లైట్ రకం వజ్రాల నిక్షేపాలు, బంగారం, విలువైన గ్రానైట్ నిక్షేపాలు ఉన్నట్లు ఎప్పుడో గుర్తించారు. నల్ల మల కేంద్రంగా కొన్ని వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో ‘డీబీర్స్’ అనే బహుళ జాతి సంస్థ ఖనిజాన్వేషణ పర్మిట్ (ఆర్.పి.) తీసుకుంది. ఏ ప్రాం తంలో ఎంత పరిమాణంలో వజ్రాలు, బంగారం నిక్షేపాలు ఉన్నాయనే అం శంపై ఈ సంస్థ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది. ఇక మైనింగ్ లెసైన్స్లు తీసుకొని వేల కోట్ల రూపాయల విలువైన ఖనిజాన్ని తవ్విపోసుకోవాలి. కానీ, ఇందుకోసమే అంతరించిపోతున్న అతి పురాతనమైన, అరుదైన చెంచు జాతిని అడవి నుంచి వెళ్లగొట్టారన్న అపవాదు వస్తుందన్న భయంతో ప్రభు త్వాలు కొత్త నాటకాన్ని ప్రారంభించాయి. దీని ప్రకారం ముందుగా వన్య ప్రాణుల రక్షణ పేరిట చెంచులు అడవుల నుంచి బయటకు తరలి పోయేట్టు చేయాలి. అనంతరం గనుల తవ్వకం లెసైన్స్లతో బహుళ జాతి సంస్థలు అడవిలోకి ప్రవేశించాలి. మన దేశ చరిత్రను ఆర్యుల ఆగమనంతో మొదలుపెట్టి చదువు కోవడం పరిపాటి. కానీ వారి రాకకు వేల ఏళ్లకు ముందు నుంచే ఇక్కడ స్థిరపడ్డ వారు చెంచులు. లక్షల ఏళ్ల క్రితమే ఆఫ్రికా ఖండం నుంచి సాగిన మానవ మహా విస్తరణలో భారతావనిపై స్థిరపడ్డ అతి పురా తన తెగల వారసులు చెంచులు. అందుకు నిదర్శనం వారికి కొన్ని ఆఫ్రికా తెగలతో ఉన్న పోలికలే. ఈ ఆదిమ మానవ జాతి వారసులు మన అరుదైన జాతీయ సంపద. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రజా ప్రభుత్వాల పాలనలోనే వారు మరీ నిర్లక్ష్యానికి గురికావడం పెద్ద విషాదం. వారిప్పుడు అంతరించిపోతున్న జాబితాలో చేరారు. ఐటీడీఏ లెక్కల ప్రకారం మహబూబ్నగర్, కర్నూలు, ప్రకాశం, గుంటూరు నాలుగు జిల్లాల్లో కలిసి 40 వేల జనాభా ఉన్నట్టు అధికారిక అంచనా. అయితే ఈ లెక్క తప్పులతడక. వాస్తవానికి చెంచు జనాభా అందులో 60 శాతం కూడా ఉండదు. గతంలో కూడా పునరావాసం పేర అడవి నుంచి చెంచులను బయటకు తరలించారు. వారిలో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ప్యాకేజీ పేరిట ఇంటికో పది లక్షల రూపాయలు ఇస్తారు. రేపటికి ఆహారం దాచుకోవడమే తెలియని చెంచు పది లక్షలు దాచుకొని నాగరిక ప్రపంచంలో ఎలా నెగ్గుకొస్తాడు? ఆహార సేకరణ చక్రం నుంచి బయటపడని చెంచుకు అడవి బయటి జీవితమంటే మరణ శాసనం కాదా? నల్లమలను పులుల అభయారణ్యాన్ని చేసి, వాటి జనాభాను పెంచి అంతర్జాతీయ వన్యప్రాణి సంరక్షణ సంస్థల ప్రశంసలందుకుంటున్న ప్రభుత్వాలే... అదే నల్లమలలోని దేశంలోనే అతి పురాతన తెగలలో ఒకరైన చెంచులు మన కళ్లముందే క్రమక్రమంగా చరిత్ర కాలగర్భంలోకి కనుమరుగై పోయేలా చూడటమే విచిత్రం. తప్పదు. డాలర్లు, రూపాయల వేటలో వెనుకా ముందూ కానక పరుగులు తీస్తూ మనం అనుసరిస్తున్న అభివృద్ధి మార్గం ఇది. నల్లమల నుంచి చెంచుల నిష్ర్కమణతో పాటే చాపకింది నీరులా బహుళజాతి సంస్థల ప్రవేశం జరగబోతోంది. బహుశా, అతి త్వరలోనే విదేశీ గుత్త సంస్థలు నల్లమల కడుపు తోడి వజ్రాలు, తదితర ఖనిజ సంపదలను అత్యంత ‘నాగరికంగా’ తవ్వి తరలించుకుపోవడం కోసం ఆ పురాతన అరణ్యాలనే అంతరింపజేయవచ్చు. ఆ విధ్వంసాన్ని కళ్లారా చూడటానికి నల్లమల కంటిపాపలు చెంచులు మిగిలి ఉండరేమో! (muralivardelli@yahoo.co.in)