breaking news
Tax Rebate
-
మధ్యతరగతి వర్గాలపై వరాల జల్లు
ఒక్క మాటలో చెప్పాలంటే సీతమ్మ కరుణించిందనే చెప్పాలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిగురించిందనే అనాలి. త్వరలో కొత్త చట్టం తెస్తున్నట్లు చెప్పారు. అందులో ఏం ఉంటుందనే ఆతృత, ఉత్కంఠకు తెరదించుతూ, మధ్యతరగతి వర్గాలపై వరాల జల్లు కురిపించారు. ఆదాయ పన్నుకి సంబంధించి ముఖ్యమైన మార్పులు కొన్ని చేశారు. అవేమిటంటే.. ప్రస్తుతం రూ. 10 లక్షలు దాటితే 30 శాతం పన్ను ఉంటోంది. రూ. 10 లక్షలు దాటిన వారికి ఎంత ఉన్నా 30 శాతంగా ఉంది. ఈ పరిమితిని పెంచాలని డిమాండ్ వస్తోంది. తాజా మార్పుల వల్ల రూ. 24 లక్షల వరకు 30 శాతం చొప్పున పడదు. ఇది చాలా పెద్ద ఉపశమనం. బేసిక్ లిమిట్ని రూ. 4,00,000కు పెంచారు. ఇది చిన్న ఉపశమనంలాగా కనిపించినా. శ్లాబులు మార్చారుకొత్త శ్లాబులు, పన్ను రేట్లు ఇలా ఉంటాయి. ఈ మార్పుల వల్ల రూ. 12,00,000 ఆదాయం ఉన్నవారికి పన్నుభారం ఉండదు. రూ. 7 లక్షల నుంచి రూ. 12 లక్షలకు పెంచారు. చాలా సాహసోపేతమైన, గొప్ప నిర్ణయం. వేతనజీవులకు ఈ లిమిట్ను రూ. 12.75 లక్షలు చేశారు. వీరికి స్టాండర్డ్ డిడక్షన్ రూపంలో రూ. 75 వేలు మినహాయింపు లభిస్తుంది. ఇంత భారీ మినహాయింపు గతంలో ఎప్పుడూ, ఎవ్వరూ ఇవ్వలేదనే చెప్పాలి. సాహసం చేశారు. కొన్ని లక్షల మందికి పన్నుండదు. ఇంతకు తగ్గట్లుగా టీడీఎస్ విషయంలో చాలా మంచి మార్పులు తెచ్చారు. హేతుబద్ధత పేరున న్యాయం చేకూర్చారు. సీనియర్ సిటిజన్లకు వడ్డీ ఆదాయం మీద టీడీఎస్ వర్తింపును రూ. 1,00,000కు పెంచారు. చివరగా పన్నుభారం విషయంలో మార్పులు ఉండకపోయినా ఇది ముఖ్య ఉపశమనం. ఇంటికి అద్దె చెల్లించే విషయంలో సంవత్సరానికి రూ. 2,40,000 దాటితే టీడీఎస్ ఉంది. ఇక నుంచి టీడీఎస్ రూ. 6,00,000 దాటితేనే వర్తిస్తుంది. ఈ రోజుల్లో నగరంలో నెలకు అద్దె రూ. 20,000కు తక్కువ ఉండటం లేదు. ఓనర్లు మాకు బ్లాక్లో ఇవ్వండి అని పేచీ.. టీడీఎస్ వద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇకపై ఆ భయాల్లేవు. ఈ లిమిట్ని భారీగా పెంచినట్లు చెప్పవచ్చు. ఈ ఉపశమనంతో పాటు బ్లాక్ వ్యవహారాల జోలికి వెళ్లకుండా రాచమార్గంలో వెళ్లే అవకాశం కల్పించారు. మనలో చాలా మంది విదేశాల్లో కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం/సర్దుబాటు/బదిలీలు చేస్తుంటాం. ప్రస్తుతం ఏటా రూ. 7,00,000 దాటితే టీడీఎస్ కంపల్సరీ. ఆ లిమిట్ని ఇప్పుడు రూ. 10,00,000కు పెంచారు. అంతే కాకుండా విద్య నిమిత్తం ఎంతైనా పంపవచ్చు. టీడీఎస్ లేకుండా. అయితే, ‘‘సోర్స్’ మాత్రం రుణం రూపంలో ఉండాలి. ప్రస్తుతం ఒక ఇంటి మీద యాన్యువల్ వేల్యూ నిల్గా భావించవచ్చు. ఇక నుంచి ఈ జాబితాలో మరొక ఇల్లును జోడించారు. ఏతావతా రెండిళ్ల మీద మినహాయింపు పొందవచ్చు. రూల్సు మేరకు ఈ రెండూ లభ్యమవుతాయి. ఆర్థిక మంత్రి సీతారామన్గారు మినహాయింపులు పెంచకపోయినా, 80సీ మొదలైన సెక్షన్లలో మినహాయింపులు ముట్టుకోకపోయినా, వాటికి రెట్టింపు/మూడింతలు ఉపశమనం ఇచ్చారు. వినియోగం వైపు మధ్యతరగతి వాళ్లు మొగ్గు చూపేలా మార్గనిర్దేశం చేశారు. వచ్చే వారం మరిన్ని తెలుసుకుందాం.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
ఎకానమీ మెరుగుపడితే...
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిన తర్వాత ఆదాయ పన్ను పరంగా మరిన్ని రాయితీలు కల్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. గత ప్రభుత్వం అధిక పన్నుల విధానం అనుసరించడం వల్లే ద్రవ్యోల్బణం ఎగిసిందని చెప్పారు. తాము ఆ విధానాన్ని కొనసాగించాలని భావించడం లేదని శనివారం ఒక చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కింది స్థాయి నుంచి అధికాదాయ వర్గాల దాకా 3విభాగాల పన్ను చెల్లింపుదారులకు ఏకంగా రూ. 50,000 మేర ఊరటనిచ్చిన ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. ‘మా దగ్గర మరిన్ని నిధులు ఉంటే ఊరట చర్యలు కూడా మరిన్ని ప్రకటించి ఉండేవాళ్లం. ఒకవేళ రేపు ఎప్పుడైనా ప్రభుత్వం దగ్గర మరిన్ని నిధులు ఉంటే, ఆదాయ పన్నుపరమైన రాయితీలు మరింత పెంచుతాం’ అని చెప్పారు. పన్ను చెల్లింపుదారుల కొనుగోలు సామర్థ్యం పెరగడంతో పాటు పొదుపు చేసే అలవాటు పెరిగితే.. ఎకానమీ అధిక వృద్ధి సాధ్యపడుతుందన్నారు. రక్షణ రంగంలో 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) అనుమతించడాన్ని జైట్లీ సమర్థించుకున్నారు. దిగుమతుల మీద ఆధారపడటంతో పోలిస్తే విదేశీ నిధులు, టెక్నాలజీతో భారతీయుల ఆధీనంలోని దేశీ కంపెనీలు రక్షణ పరికరాలు తయారు చేయటం వైపే తాను మొగ్గు చూపుతానని చెప్పారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహం ప్రాజెక్టుకు రూ. 200 కోట్ల కేటాయింపును కూడా సమర్థించుకున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రెండున్నరేళ్లలో ఏకంగా 550 రాజ్యాలను భారత్లో విలీనం చేసిన ఘనత పటేల్ది కాగా.. ఒక్కగానొక్క జమ్మూ కాశ్మీర్ వివాదాన్ని కూడా జవహర్లాల్ నెహ్రూ పరిష్కరించలేకపోయారని, ఇప్పుడు కూడా ఆ వివాదం కొనసాగుతూనే ఉందని.. నెహ్రూ-గాంధీ వారసులపై ఆయన పరోక్షంగా విమర్శలు గుప్పించారు. జీఎస్టీ అమలుపై స్పందిస్తూ.. రాష్ట్రాలకు ఉన్న అభ్యంతరాలను పరిష్కరించాక అమల్లోకి తెస్తామన్నారు. పీఎస్యూ బ్యాంకుల విలీనంపై దృష్టి: కాగా ప్రభుత్వ రంగ (పీఎస్యూ) బ్యాంకుల విలీనానికి సంబంధించి ఎదురవుతున్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ఆర్థిక సర్వీసుల విభాగం కార్యదర్శి జీఎస్ సంధూ చెప్పారు. ఈ ఏడాదిలోనే కొంత పురోగతి ఉంటుందన్నారు. దీని వల్ల బ్యాంకింగ్ రంగం మరింత పటిష్టమవుతుందని తెలిపారు.