breaking news
tariff reduction
-
‘ఆహారం’పై టారిఫ్లు రద్దు
వాషింగ్టన్: విదేశీ ఉత్పత్తులపై టారిఫ్లతో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్తంత కరుణ చూపారు. విదేశాల నుంచి తమ దేశంలోకి దిగుమతి అయ్యే పశుమాంసం(బీఫ్), కాఫీ, ఉష్ణమండల పండ్లతోపాటు ఇతర ఉత్పత్తులపై టారిఫ్లు రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అమెరికాలో ఆహార పదార్థాలు, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోవడంతో జనం గగ్గోలు పెడుతున్నారు. ట్రంప్ కఠిన విధానాలపై వారు దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రజాగ్రహం నానాటికీ తీవ్రమవుతోంది. ఆ ఒత్తిళ్లు తట్టుకోలేక ట్రంప్ దిగివచ్చినట్లు తెలుస్తోంది. అందుకే టారిఫ్ల రద్దు ప్రకటన చేసినట్లు సమాచారం. దీనివల్ల స్వదేశంలో ధరలు తగ్గుతాయి. అమెరికన్లకు ఊరట లభించనుంది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే టారిఫ్ల కొరడా అందుకున్న సంగతి తెలిసిందే. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం బీఫ్, కాఫీ, అరటి పండ్లు, అవకాడో, టమాటాలు, కొబ్బరికాయలు, మామిడికాయలు, కోకోవా, బ్లాక్ టీ, గ్రీన్ టీ, వెనిల్లా బీన్స్, జామకాయలు, నిమ్మకాయలు, నారింజ, పైనాపిల్, జీడిపప్పు, గసగసాలు సహా 100కిపైగా ఉత్పత్తులపై సుంకాలు రద్దు చేస్తూ సంబంధిత కార్యనిర్వాహక ఉత్తర్వుపై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఈ టారిఫ్ల రద్దు ఆదేశాలు గురువారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చినట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. -
అమెరికాపై సుంకాలు ఎత్తేసిన ఇజ్రాయెల్
జెరూసలేం: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల హెచ్చరికలు పని చేస్తున్నాయి. అమెరికా దిగుమతులపై అన్ని సుంకాలను ఇజ్రాయెల్ ఎత్తేసింది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బుధవారం ఈ మేరకు ప్రకటించారు. ‘‘అమెరికా వస్తువులపై కస్టమ్స్ సుంకాలను రద్దు చేయడమంటే మార్కెట్ను ఒక దశాబ్దం పాటు పోటీకి తెరవడం. ఆర్థిక వ్యవస్థకు వైవిధ్యాన్ని పరిచయం చేయడం. జీవన వ్యయాన్ని తగ్గించడానికి మా ప్రభుత్వం ఎంచుకున్న విధానాల్లో ఇది అదనపు దశ. మార్కెట్కు, ఇజ్రాయెల్ పౌరులకు ప్రయోజనం చేకూర్చేది. ఇజ్రాయెల్, అమెరికాల సంబంధాలను ఈ చర్య మరింత బలోపేతం చేస్తుంది’’ అని ‘ఎక్స్’లో నెతన్యాహు ప్రకటించారు.40 ఏళ్ల స్వేచ్ఛా వాణిజ్యంఇజ్రాయెల్, అమెరికా మధ్య 40 ఏళ్లుగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లో ఉంది. 99 శాతం అమెరికా దిగుమతులను ఇజ్రాయెల్ ఇప్పటికే సుంకాల నుంచి మినహాయించింది. ఈ నేపథ్యంలో తాజా చర్యను ఆర్థిక చర్యగా కంటే దౌత్య, రాజకీయ చర్యగా భావిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా వ్యవసాయోత్పత్తులపై ఇజ్రాయెల్ ఏటా 42 మిలియన్ షెకెల్స్ (సుమారు 1.15 కోట్ల డాలర్ల) సుంకాలు వసూలు చేస్తోంది. ఇజ్రాయెల్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం 2024లో ఆ దేశం మొత్తం ఎగుమతుల విలువ 172 కోట్ల డాలర్లు. అమెరికా నుంచి దిగుమతుల విలువ 92 కోట్ల డాలర్లు. -
బంగారం దిగుమతి సుంకాల తగ్గింపు?
ముంబై: స్మగ్లింగ్ను నిరోధించే దిశగా పసిడి దిగుమతులపై సుంకాలను తగ్గించాలని యోచిస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతం 10 శాతంగా ఉన్న దీన్ని 6 శాతానికి తగ్గించాలని భావిస్తున్నట్లు సమాచారం. రికార్డు స్థాయిలోని కరెంటు అకౌంటు లోటును భర్తీ చేసుకునేందుకు, రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు 2013లో ప్రభుత్వం పసిడి దిగుమతి సుంకాన్ని మూడు సార్లు పెంచింది. దీంతో పసిడి దిగుమతులు భారంగా మారడంతో .. స్మగ్లింగ్కు ఊతమిచ్చినట్లయిందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. సుంకాల విధానం పారదర్శకతను పెంచే విధంగానే ఉండాలి తప్ప స్మగ్లింగ్కు ఊతమిచ్చేలా ఉండకూడదని వ్యాఖ్యానించాయి. గతేడాది దాదాపు 120 టన్నుల బంగారం దిగుమతి స్మగ్లింగ్ జరగ్గా ఈ ఏడాది ఈ పరిమాణం మరింత పెరిగి 140 టన్నుల నుంచి 160 టన్నుల దాకా ఉండొచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) అంచనా. వివిధ అంశాల కారణంగా ఈ ఏడాది దేశీయంగా పసిడి వినియోగం ఏడేళ్లలో కనిష్ట స్థాయికి తగ్గిపోవచ్చని..సుమారు 650 టన్నుల నుంచి 750 టన్నుల దాకా మాత్రమే ఉండొచ్చని డబ్ల్యూజీసీ నవంబర్లో అంచనా వేసింది.


