breaking news
Svarnabharat Trust
-
‘స్వర్ణభారత్’ సేవలు భేష్
గ్రామీణులు, నిరుద్యోగులకు విశేష సేవలందిస్తోంది: సీఎం కేసీఆర్ ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్ ప్రారంభం సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్రామీణ ప్రాంత ప్రజలు, నిరుద్యోగులకు స్వర్ణభారత్ ట్రస్ట్ విశేష సేవలందిస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు కొనియాడారు. మహాత్ముని ఆశయాల నుంచి పురుడుపోసుకున్న ఈ ట్రస్ట్.. సంఘం, సమాజం పురోగమించేందుకు తనవంతు కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ట్రస్ట్కు ఎలాంటి సాయం అందిచడానికైనా సిద్ధంగా ఉంటామన్నారు. సోమవారం రంగా రెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లో నెలకొల్పిన ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్ను కేసీఆర్ ప్రారంభించారు. కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్, కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ.. పల్లెల్లోనే దేశం ఉందన్న గాంధీ స్ఫూర్తిని ట్రస్ట్ పుణికి పుచ్చుకుందన్నారు. ట్రస్ట్ ద్వారా ఎంతో మం దికి శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి కల్పిస్తు న్నారన్నారు. ట్రస్ట్ వ్యవస్థాపకురాలు దీపా వెంకట్ తన తండ్రి వెంకయ్యనాయుడు అండతో రాజకీయాల్లోకొచ్చే అవకాశమున్నా.. అది వదిలేసి, సేవ చేయాలన్న సం కల్పంతో ముందుకెళ్లడం అభినందనీయ మ న్నారు. తండ్రి సంస్కారమే ఆమెకు అబ్బిందన్నారు. సర్పంచ్కు కోట్లు పెడుతున్నారు... ప్రస్తుతం మనం పిలుచుకుంటున్నట్లు పంచా యతీరాజ్ ఒక శాఖ కాదని, ఒకప్పుడు సాగిన బృహత్తర ఉద్యమమని సీఎం పేర్కొన్నారు. కొన్ని పరిస్థితులతో దురదృష్టవశాత్తు దాన్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘అప్పటి రాజకీయ వ్యవస్థ.. దాన్ని ఒక శాఖగా మార్చి ఉద్యమాన్ని చంపేసింది. ఆ తర్వాత స్వార్థం తోడైంది. ఈ క్రమంలో సర్పంచ్గా గెలవడం కోసం.. రూ.కోట్లు ఖర్చుపెట్టే పరిస్థితులు వచ్చాయి. ఫలితంగా ఆ ఉద్యమం.. స్ఫూర్తి కనుమరుగైపోయింది. దేశానికి ప్రధాని, సీఎంలు ఇలా ఎవరేం చేసినా.. ప్రథమ స్థానంలో నిలబడి పనిచేయా ల్సింది స్థానిక సంస్థల ప్రతినిధులే. గ్రామాల సర్పంచులు, ఎంపీటీలు, ఎంపీపీలు.. వీరం తా అద్భుతంగా పనిచేసినప్పుడే దేశం వికాసం సాధిస్తుంది’’ అని అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో వచ్చిన విపరిణామాలు, దుష్ప్రభావాలను సంస్కరించాలని ట్రస్ట్ను కోరారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సాయం అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని, సేవల్ని మరింత విస్తరించడానికి తోడ్పాటు అందిస్తామని చెప్పారు. మహారాష్ట్రలో బండార్కర్ అనే వ్యక్తి పరిశోధనలు, చూపిన తపన ఫలితంగా ఆ రాష్ట్రం ద్రాక్ష ఎగుమతిలో గణనీయ అభివృద్ధి సాధిస్తోందని సీఎం అన్నారు. ఆయన కృషి ఫలితంగా ఏటా రూ.10 వేల కోట్ల విలువ జేసే ద్రాక్షలను ఎగుమతి చేసే స్థాయికి ఆ రాష్ట్రం ఎదిగిందన్నారు. సంఘం కోసం ఏదో చేయాలన్న తపన çఫలితమే ఇదన్నారు. ఇలా ఎందరో మహనీయులు గ్రామాలకు సేవచేశారని.. ఇదే లక్ష్యంతో ట్రస్ట్ పనిచేస్తోందని చెప్పారు. ఇలాంటి ట్రస్టులు చాలా అవసరం... గ్రామీణ యువతీ యువకుల్లో స్వర్ణభారత్ ట్రస్ట్ చైతన్యం తీసుకురావడం సంతోషంగా ఉందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. మహాత్ముడి కలల సాధన కోసం ట్రస్ట్ కృషి చేస్తోందన్నారు. పేదరికం పోవా లంటే ఇలాంటి ట్రస్టులు చాలా అవసరమ న్నారు. యువత ఉపాధి కల్పనకు కేంద్రం రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తోందన్నారు. అవగా హన, నైపుణ్యాలు లేకపోవడం వల్లే నిరుద్యోగ సమస్య వచ్చిపడిందని, మానవ వనరులు పుష్కలంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. ట్రస్ట్ వ్యవస్థాపకురాలు దీపా వెంకట్ మాట్లాడుతూ.. గ్రామీణులకు ట్రస్ట్ అండగా ఉంటుందన్నారు. వారు జీవితంలో స్థిరపడే బాధ్యత తమ ట్రస్ట్ తీసుకుంటుందని చెప్పా రు. కార్యక్రమంలో మంత్రి మహేందర్రెడ్డి, ఎంపీలు మల్లారెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, సియంట్ సంస్థ అధినేత బీవీఆర్ మోహన్రెడ్డి, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ట్రస్టు ఏర్పాటుకు పది ఎకరాల స్థలాన్ని విరాళంగా అందజేసిన మహా సిమెంట్, మైహోం గ్రూపు సంస్థల చైర్మన్ జూపల్లి రామేశ్వర్రావు, ఎండీ జూపల్లి జగపతిరావును సన్మానించారు. ప్రభుత్వం నుంచి పైసా లబ్ధి పొందలేదు: వెంకయ్య స్వర్ణభారత్ ట్రస్ట్లో రాజకీయాలకు ఏమా త్రం తావులేదని కేంద్రమంత్రి వెంకయ్యనా యుడు స్పష్టం చేశారు. ఇది గ్రామీణ ప్రాంత ప్రజలు, మహిళలు, నిరుద్యోగ యువతీ యువకుల్లో నైపుణ్యాలు పెంపొం దించి ఉపాధి కల్పించే ట్రస్ట్ అని పేర్కొ న్నారు. యువత ఉద్యోగాల కోసం కాళ్ల రిగేలా తిరగకుండా ఉద్యోగాలిచ్చే స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. ట్రస్ట్ ద్వారా ఐటీ, ఫార్మా సంస్థల సాయంతో నిరుద్యోగుల నైపుణ్యాలకు సానబెడుతున్నామని చెప్పారు. ప్రభుత్వం నుంచి ట్రస్ట్ పైసా లబ్ధి పొందలేదని, పూర్తిగా దాతల సహకా రంతోనే కొనసాగుతోందని పేర్కొన్నారు. వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా దేశ వారసత్వాన్ని, సంప్రదాయాల్ని మరిచిపోవద్దన్నారు. కన్నతల్లి, మాతృభూమి, మాతృభాష, మాతృదేశాన్ని మరిచిపోయినవారు మనుషులే కాదన్నారు. దేశంలో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయని.. ఈ క్రమంలో స్వల్ప ఇబ్బందులు తప్పవ న్నారు. మతం వ్యక్తిగతమని, అందరి గతం ఒక్కటే కాబట్టి కలసిమెలసి జీవించాలని చెప్పారు. ఆ ఉద్యమంలో నేనూ పాల్గొన్నా.. దశాబ్దాల కిందట ఉన్న స్వచ్ఛత ప్రస్తుత గ్రామాల్లో లేదని, మురికి, కంపచెట్లు తొలిగే మార్గం కనిపించడం లేదని కేసీఆర్ చెప్పారు. ‘‘గ్రామీణాభివృద్ధి నిపుణులు ఎస్కేడే ఆధ్వర్యంలో ఒకప్పుడు పంచాయతీరాజ్ ఉద్యమం జోరుగా సాగింది. హైదరాబాద్ కేంద్రం గా ఈ ఉద్యమాన్ని నడిపించారు. రాజేంద్రనగర్లోని ఎన్ఐఆర్డీ ఆయన స్థాపించిందే. పంచాయతీరాజ్ సమితికి తొలిసారిగా నామినేట్ అయిన ఇద్దరూ ఇక్కడివారే. అందులో ఒకరు ఏపీ మాజీ స్పీకర్ రామచంద్రారెడ్డి. ఈ సమితికి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పంచాయతీరాజ్ ఉద్యమం జోరుగాసాగింది. దుబ్బాకలో రాజ్యసభ మాజీ సభ్యుడు సోలిపేట రాంచంద్రారెడ్డి సమితికి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేనూ ఈ ఉద్యమంలో పాల్గొ న్నా. విద్యార్థిగా దళిత, గిరిజన వాడల్లో పారిశుధ్యంపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో వేషాలు వేశా. ఉపన్యాలు చెప్పా. తర్వాత అది కనుమరుగై గ్రామాల్లో పొడి వాతావరణంతో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి’’ అని సీఎం అన్నారు. -
అభివృద్ధి సమానంగా జరగాలి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఆత్కూరు (గన్నవరం): పట్టణాలతో సమానంగా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి సాధించాలని, అప్పుడే దేశం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తుందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పేర్కొన్నారు. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవం, సంక్రాంతి సంబరాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలు అన్ని సదుపాయాలతో పూర్తిగా అభివృద్ధి చెందితే, గ్రామాల్లో మాత్రం సరైన రోడ్లు, తాగునీరు, మరుగుదొడ్లు, డ్రెయిన్లు వంటి కనీస సదుపాయలు లేక ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేవారు. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకువచ్చేందుకు పట్టణాలతో పాటు అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాల్సి ఉంటుందన్నారు. కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు మాట్లాడుతూ చదువుకునే రోజుల నుంచి సమాజ సేవ చేయాలని తనతో పాటు తన స్నేహితులు భావించినా వివిధ కారణాల వల్ల సాధ్యం కాలేదన్నారు. 16 ఏళ్ల కిందట మిత్రులందరం చర్చించుకుని స్వర్ణభారత్ ట్రస్టును వెంకటచలంలో ఏర్పాటు చేశామని చెప్పారు. విజయవాడలో ఎక్కువగా ఉన్న తన మిత్రుల కోరిక మేరకు ఏడాది కిందట ఇక్కడ చాప్టర్ను ఏర్పాటు చేసి విజయవంతంగా నడుపుతున్నట్లు తెలిపారు. సూపర్స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యధనుష్ మాట్లాడుతూ మానవసేవే మాధవసేవగా భావించి ట్రస్టు ద్వారా చేస్తున్న విభిన్న కార్యక్రమాలు ఆదర్శనీయమని పేర్కొన్నారు. -
దేశం ముందుకెళ్తోంది
స్వర్ణభారత్ ట్రస్ట్ వార్షికోత్సవంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ నెల్లూరు(స్టోన్హౌస్పేట): గ్రామాలు బాగుపడకుంటే స్మార్ట్ సిటీలకు అర్థం లేదని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పేర్కొన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఆదివారం స్వర్ణభారత్ ట్రస్ట్ 15వ వార్షికోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... స్కిల్ ఇండియా, స్టాండప్ ఇండియా, డిజిటల్ ఇండియా లాంటి నినాదాలతో దేశం ముందుకెళ్తోందని చెప్పారు. స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా అందిస్తున్న శిక్షణ, వైద్య సేవలు మినీభారత్ను తలపిస్తున్నాయన్నారు. ఇలాంటి ట్రస్ట్లు దేశవ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉందని ఆకాంక్షించారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... ప్రభుత్వంలో ఉండి సేవ చేస్తే ఆనందమని, స్వలాభాపేక్ష లేకుండా సొంతంగా సేవలందిస్తే మహదానందమన్నారు. పదవులు శాశ్వతం కాదని, సామాజిక సేవలో అసలైన ఆనందం ఉందని తెలిపారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, సొంత ఊరిని, దేశాన్ని, గురువులను విస్మరించినవాడు మనిషే కాదని వ్యాఖ్యానించారు. తనను ఈ స్థాయికి తెచ్చిన గురువులు సోంపల్లి సోమయ్య, దుర్గాప్రసాద్, పార్టీ, స్నేహితులకు వెంకయ్య కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ... రాష్ట్రానికి ఇచ్చిన మూడు హామీలు హెచ్పీసీఎల్ రీఫైనరీ విస్తరణ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్, విశాఖపట్నంలో పెట్రోలియం ఎడ్యుకేషన్ యూనివర్సిటీ స్థాపన కోసం రూ.52 వేల కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. త్వరలో యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్, ఒలింపిక్స్లో రజత పతక విజేత పి.వి.సింధు, ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపావెంకట్, ఎంపీలు వరప్రసాద్రావు, గోకరాజు గంగరాజు, కంభంపాటి హరిబాబు, నెల్లూరు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, రక్షణశాఖ మంత్రి సలహాదారు సతీష్రెడ్డి, ట్రస్ట్ సభ్యులు ఆల్తూరి అశోక్, బీవీ రాజు ఫౌండేషన్ చైర్మన్ ఆదిత్యరాజు తదితరులు పాల్గొన్నారు. -
స్వచ్ఛంద సంస్థలతోనే గ్రామాల అభివృద్ధి
♦ స్వర్ణభారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్ ♦ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సాక్షి, విజయవాడ: దేశంలోని గ్రామాలన్నింటినీ అభివృద్ధి చేయాలంటే ఒక రాజకీయ పార్టీ వల్లో, ఒక ప్రభుత్వం వల్లో సాధ్యం కాదని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్ అభిప్రాయపడ్డారు. అవకాశం ఉన్నచోట స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి గ్రామాల అభివృద్ధికి నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం విజయవాడ సమీపంలోని ఆత్కూరు గ్రామంలో స్వర్ణభారత్ ట్రస్టు విజయవాడ చాప్టర్ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రాజ్నాథ్సింగ్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రేరణతో ఆయన కుమార్తె దీపావెంకట్ నెల్లూరు వద్ద చిన్న గ్రామంలో ప్రారంభించిన స్వర్ణభారత్ ట్రస్టు ఇప్పుడు విజయవాడకు తన సేవలు విస్తరించడం అభినందనీయమన్నారు. 2020 నాటికి దేశంలోని ప్రతి గ్రామానికి ‘దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన’ పథకం ద్వారా విద్యుత్, తాగునీరు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. దేశంలో 300 గ్రామాలను మోడల్ గ్రామాలుగా ఎంపిక చేసి స్మార్ట్ సిటీలకు ధీటుగా తీర్చిదిద్దుతామన్నారు. గ్రామాల్లోని స్వయం శక్తి కారణంగా మనదేశం ఆర్థిక మాంద్యాన్ని తట్టుకుని నిలబడిందన్నారు. త్వరలో హైదరాబాద్లో ‘స్వర్ణభారత్’: వెంకయ్య సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ నెల్లూరులో స్వర్ణభారత్ ట్రస్ట్ ప్రారంభించామని, ఇప్పుడు విజయవాడ చాప్టర్ను 7.5 ఎకరాల్లో ప్రారంభిస్తున్నామని, త్వరలో 6.5 ఎకరాల్లో హైదరాబాద్లో ప్రారంభిస్తామని తెలిపారు. విజయవాడ చాప్టర్లో ఆరోగ్య కేంద్రాన్ని, గ్రామీణ ఉపాధి శిక్షణ కేంద్రాన్ని, అబ్దుల్ కలాం ‘ప్రతిభా’ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించారు. అంతకు ముందుగా ఈ సమావేశాన్ని ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలతో ప్రారంభించారు. సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ గేయాలను ఆలపించారు.