breaking news
stage protest
-
మొహం చాటేసిన సర్కారు
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రజలకు వైద్యసేవలు అందించే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం మొహం చాటేసింది. పల్లె వైద్యం బలోపేతం చేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 10,032 విలేజ్ క్లినిక్స్ నెలకొల్పిన విషయం తెలిసిందే. ప్రతి క్లినిక్లో బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత కలిగిన వారిని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా అప్పట్లో నియమించారు. వీరంతా సమస్యల పరిష్కారం కోసం ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో విధులు బహిష్కరించి సమ్మెలోకి వెళ్లారు. గ్రామీణ వైద్యం పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో చర్చలు జరిపిన ఉన్నతాధికారులు ప్రభుత్వ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేయించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇప్పించారు.స్పందన ఏదీ!?ఉన్నతాధికారులు మాటివ్వడంతో వీరంతా సమ్మె విరమించి విధుల్లో చేరారు. సమ్మె విరమించి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడంతో హెల్త్ ఆఫీసర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వైద్యశాఖ మంత్రితో సమావేశం కోసం కోరగా, నాడు హామీ ఇచ్చిన ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వీరు సమ్మెలో ఉన్న సమయంలోనే గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకూ ఆరు నెలల ఇన్సెంటివ్ బకాయిలు రూ.77.33 కోట్లు విడుదలకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ ఈ ఏడాది మే 8న ప్రొసీడింగ్స్ ఇచ్చినా నిధులు మాత్రం జమ చేయడం లేదు.మృతుల కుటుంబాలకు భరోసా లేదుసర్వీస్లో ఉండగా మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి కనీస భరోసా కూడా లభించడం లేదని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో వీరందరికీ ఈపీఎఫ్ సౌకర్యం అందుబాటులో ఉండేది. ఏడాది నుంచి ఈ సౌకర్యాన్ని వైద్య శాఖ నిలిపేసింది. వీరి సమ్మె డిమాండ్స్లో ఈపీఎఫ్ పునరుద్ధరణ కూడా ఒకటిగా ఉంది. సాధారణంగా ఈపీఎఫ్ వాటాదారు మృతి చెందితే ఎంప్లాయ్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలు బాధిత కుటుంబాలకు సాయం అందుతుంది.ఈపీఎఫ్ సౌకర్యం పూర్తిగా నిలిపేయడంతో ఆ భరోసా కూడా కరువైంది. ఏఎస్ఆర్ జిల్లా లోతుగెడ్డ పీహెచ్సీ పరిధిలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గసాడి రమ్యశ్రీ ఈ ఏడాది ఏప్రిల్ 13న మృతి చెందారు. విలేజ్ క్లినిక్ పరిధిలో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ)–3.0 సర్వే నిర్వహిస్తున్న సమయంలో రమ్యశ్రీని కుక్క కరిచింది. రేబిస్ సోకడంతో చికిత్స పొందుతూ ఆమె మృత్యువాత పడింది. ఇలా ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా సర్వీస్లో ఉండగానే ఏడుగురు మృతి చెందినట్టు హెల్త్ ఆఫీసర్లు చెబుతున్నారు. వీరందరి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదని వెల్లడించారు. -
సార్.. మా బడికి మాస్టార్ని పంపించండి!
పాడేరు: ‘అయ్యా.. కలెక్టర్గారు, పీఓ గారు.. మాకు చదువుకోవాలని ఉంది. దయచేసి మా బడికి మాస్టార్ని పంపించండి’.. అంటూ మండలంలోని జోడూరు గ్రామానికి చెందిన విద్యార్థులు ఐటీడీఏ ఎదుట ప్రధాన రహదారిపై మండేఎండలో బైఠాయించి తమ నిరసన తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలోని వంట్లమామిడి పంచాయతీ మారుమూల జోడూరు గ్రామంలో 28 మంది బడిఈడు పిల్లలున్నారు. కానీ, ఇక్కడ పాఠశాల లేదు. దీంతో ఎన్ఆర్ఎస్టీసీ పాఠశాలను అధికారులు ఏర్పాటుచేశారు. సమీపంలో ఉన్న ఒంటిపాక పాఠశాలలో పనిచేస్తున్న సూరిబాబు అనే ఉపాధ్యాయుడిని జోడూరు గ్రామం పాఠశాలకు డిప్యూటేషన్పై నియమిస్తూ ఈ ఏడాది అక్టోబరు 17న విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. కానీ, నేటికి 20 రోజులు కావస్తున్నా ఆ ఉపాధ్యాయుడు జోడూరు పాఠశాలకు హాజరుకావడంలేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకుడు పాలికి లక్కు ఆధ్వర్యంలో శుక్రవారం పాడేరుకు తరలివచ్చారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఐటీడీఏ వద్దకు చేరుకున్నారు. ఐటీడీఏ ముందే ప్రధాన రహదారిపై చుర్రుమనే ఎండలో బైఠాయించి నిరసన తెలిపారు. తమ గ్రామానికి తక్షణమే ఉపాధ్యాయుడిని నియమించాలని, 20 రోజులుగా బడికిరాని ఉపాధ్యాయుడు సూరిబాబుపై చర్యలు తీసుకోవాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం.. ఐటీడీఏ పీఓ అభిషేక్, జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావును కలిసి వినతిపత్రం ఇచ్చారు. -
అమరావతిలో భూములు అమ్మారు..
ఆదిలాబాద్ టౌన్: ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా అమరావతి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన రైతులు ఆదిలాబాద్లోని రాణిసతీజి కాలనీలో ఉన్న పత్తి వ్యాపారి సచిన్ ఇంటి ఎదుట సోమవారం ఉదయం నుంచి బైఠాయించారు. మధ్యాహ్న భోజనం అక్కడే చేసి గేటు ఎదుట పడుకున్నారు. బాధితుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లాకు చెందిన 32మంది రైతులు అమరావతి రాజధానిగా ఏర్పడిన సమయంలో తమ భూములను విక్రయించారు. వచ్చిన డబ్బులను బ్యాంకులో జమ చేశారు. బ్యాంకులో తక్కువ వడ్డీ వస్తుండటంతో స్థానిక వ్యాపారి లిల్లి మధ్యవర్తిత్వంతో ఆదిలాబాద్కు చెందిన సచిన్కు రెండున్నర రూపాయల వడ్డీతో రూ.6కోట్లు అప్పు ఇచ్చారు. ఈ మేరకు రూ.2కోట్ల నగదు చేతికివ్వగా రూ.4కోట్లు బ్యాంక్ అకౌంట్కు బదిలీ చేశారు. రెండు నెలల్లోనే అప్పు తీర్చేస్తానని సచిన్ హామీ ఇచ్చి దాదాపు ఏడాదిన్నరవుతున్నా స్పందించడం లేదు. 2021 ఆగస్టులో డబ్బులు ఇచ్చామని, పలుమార్లు కలువగా రేపు మాపు అంటూ తిప్పించుకుంటున్నాడని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు ఇవ్వకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామని కన్నీరుమున్నీరయ్యారు. అందుబాటులో లేని వ్యాపారి.. కాగా సదరు వ్యాపారి అందుబాటులో లేరని కుటుంబీకులు తెలిపారు. ఓ న్యాయవాదితో మధ్యవర్తిత్వం చేయించినట్లు రైతులు చెబుతున్నారు. 45 రోజుల్లో డబ్బులు తిరిగి ఇచ్చేలా చూస్తానని న్యాయవాది వారికి చెప్పగా.. చెక్కులు, నోట్లు ఇస్తే ఇక్కడి నుంచి వెళ్తామని తెలిపారు. అందుకు న్యాయవాది ఒప్పుకోలేదని అంటున్నారు. రైతులకు సీపీఎం, సీపీఐ, సీపీఐఎంఎల్, రైతు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. వ్యాపారి డబ్బులు వెంటనే చెల్లించాలని, లేనిపక్షంలో రైతులతోపాటు ఇక్కడే బైఠాయించి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే నిరవధిక సమ్మె
-
సమ్మె బాట పట్టిన మున్సిపల్ కార్మికులు
-
రాష్ట్ర ప్రయోజనాలను వంచించి...ఇప్పుడు దీక్షలు చేస్తారా ?
-
చంద్రబాబులా నీచపు రాజకీయాలు వైఎస్సార్సీపీ చేయదు
-
ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబును తరిమికొట్టాలి
-
విశాఖలో 'వంచన వ్యతిరేక దీక్ష' ప్రారంభం
-
నేడే వైఎస్సార్సీపీ వంచన వ్యతిరేక దీక్ష
-
వినూత్న రీతిలో సీపీఎం నిరసన
-
'ఆగ్రి' బాధితుల ఆవేదన
-
అగ్రిగోల్డ్ ఆఫీస్ వద్ద బాధితుల ఆందోళన
-
బెంగుళూరులో ఏబీవీపీ ఆందోళన
-
బిల్లుల కోసం రైతుల ఆందోళన
గుంటూరు: కష్టపడి పండించిన ధాన్యాన్ని రైతులు అమ్ముకుంటే.. ప్రభుత్వాలు వారికి బిల్లులు సకాలంలో అందించకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తోంది. రెండు నెలల కింద గుంటూరు జిల్లా కాకుమాను మండలానికి చెందిన రైతులు స్థానిక ఐకేపీ సెంటర్లలో తాము పండించిన మొక్కజొన్న పంటను అమ్ముకున్నారు. అయితే, ఇప్పటి వరకు రైతులకు మొక్కజొన్న పంటకు సంబంధించిన బిల్లులు చేతికి అందలేదు. ఒక వైపు రాష్ట్రంలో వర్షాలు పడుతుండటంతో నూతనంగా వ్యవసాయాన్ని ప్రారంభించేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించక పోవడంతో ఆగ్రహించిన రైతులు ఆందోళనకు దిగారు. పలు గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో మండల కేంద్రానికి చేరుకొని స్థానిక గాంధీ సర్కిల్ వద్ద బైఠాయించారు. ప్రభుత్వం వెంటనే బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.