breaking news
special needs schools
-
నా స్టూడెంట్ టీచర్ అయింది!
‘ఎక్స్’లో రేవ్ అనే టీచర్ తన స్టూడెంట్ ఆలిషా గురించి చేసిన పోస్ట్ వైరల్ అయింది. స్కూల్ రోజుల్లో ఆలీషా అల్లరిపిల్ల. రేవ్ మాటల్లోనే చెప్పాలంటే రెబెల్. ‘ఈ అమ్మాయి భవిష్యత్ ఎలా ఉండబోతుందో’ అంటూ అలీషా గురించి బెంగపడేది రేవ్. కట్ చేస్తే... ఆలిషా ఇప్పుడు ముంబైలోని ఒక స్కూల్లో స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్స్కు టీచర్. ‘మొండిఘటం. ఏ పనీ చేయలేదు... అని నా గురించి రేవ్ టీచర్కు చెప్పేవారు. అయితే టీచర్ మాత్రం నన్ను ఎప్పుడూ ప్రేమగా చూసుకునేది. అలాంటి ప్రేమను స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్స్కు పంచాలనుకుంటున్నాను’ అంటుంది అలీషా. -
భరోసా ఇవ్వని భవిత..!
ప్రత్యేక అవసరాల పిల్లలకు జిల్లాలోని భవిత కేంద్రాలు భరోసానివ్వలేకపోతున్నాయి. విద్యార్థులకు విద్యతో పాటు వారి శారీరక అవసరాలకు అనుగుణంగా ఫిజియోథెరపీ చేయాలి. వినికిడిలోపం, బుద్ధిమాంద్యం, అంగవైకల్యం, దృష్టిలోపం ఉన్న చిన్నారులకు ఆహ్లాదకర వాతావరణంలో మానసిక స్థైర్యాన్ని నింపాలి. అయితే భవిత కేంద్రాల్లో చేపట్టాల్సిన నెలవారీ కార్యక్రమాలు, యాక్షన్ ప్లాన్ సరిగ్గా అమలు చేయకపోవడంతో ఆశించిన ఫలితాల్లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. చిత్తూరు ఎడ్యుకేషన్: జిల్లాలో 22 భవిత కేంద్రాలు, 44 మినీ భవిత కేంద్రాలు సర్వశిక్షా అభియాన్ ద్వారా నడుస్తున్నాయి. అందులో 8,903 మంది విద్యార్థులున్నారు. 132 మంది వైద్యవిధానాల్లో శిక్షణ పొందిన శిక్షకులు ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేయాల్సి ఉండగా, 103 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన 29 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మానసిక, శారీరక ఇబ్బందులు గుర్తించి వారిలో మార్పు తీసుకురావడానికి భవిత కేంద్రాలను స్థాపించారు. ప్రతి కేంద్రంలో వైద్యవిధానంలో ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు (ఐఈఆర్టీ) ఉంటారు. పలు రకాల మానసిక సమస్యలతో ఉన్న పిల్లలకు భవిత కేంద్రాల్లో శిక్షణ ఇచ్చి వారిని మామూలు పిల్లలుగా తయారు చేయాలి. అయితే జిల్లాలో ఎక్కడా అలా జరగడం లేదు. ఏదో వచ్చామా.. వెళ్లామా అన్నట్లు విధులు నిర్వహిస్తున్నారు. పర్యవేక్షించే ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో సరైన సూచనలు ఇవ్వకపోవడంతోనే ఇలా జరుగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. జాడలేని ఫిజియోథెరపిస్టులు.. భవిత కేంద్రాల్లో పనిచేసే ఫిజియోథెరపిస్టులు కేంద్రానికి వచ్చి చిన్నారులకు వారంలో ఒకసారి చికిత్స చేయాల్సి ఉంటుంది. అన్ని మండలాల్లో ఉన్న భవిత కేంద్రాలలో ఫిజియోథెరఫిస్టులు రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పలువురు తల్లిదండ్రులు చెబుతున్నారు. అందులో కొంతమంది కేంద్రాలకు వచ్చి బయోమెట్రిక్ నమోదు చేసి వెళ్లిపోతున్నట్లు ఆరోపణలున్నాయి. సకాలంలో నిర్వహించని క్యాంప్లు.. జిల్లాలోని అన్ని మండలాల్లో వినికిడి లోపం, గ్రహణమొర్రి లోపం ఉన్న విద్యార్థులను ఆరోగ్యశాఖ, సర్వశిక్షా అభియాన్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి గుర్తించాల్సిన అవసరం ఉంది. అలా గుర్తించే పిల్లలకు సర్వశిక్షా అభియాన్ నిధులతో వారికి అవసరమైన ఉపకరణాలను(మిషన్లు) క్యాంపులు నిర్వహించి అందించాలి. ఆపరేషన్లకు సిఫార్సు చేయాలి. అయితే ఆ కార్యక్రమాలు నామమాత్రంగా నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారి నియామకం సర్వశిక్షా అభియాన్లో వ్యవహారాలన్నింటిని చూడాల్సిన జిల్లా సహిత విద్య అధికారిని నిబంధనలకు విరుద్ధంగా భర్తీ చేశారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రత్యేక అనుభవం, ఏడాది ఎంఎస్సీలో జువాలజీ పూర్తి చేసి, స్పెషల్ ఎడ్యుకేషన్పై ఏడాది పాటు కోర్సు చేసిన వారితో పోస్టు భర్తీ చేయాల్సి ఉంది. అయితే గతంలో ఉన్న ఆ శాఖ పీఓ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర సర్వశిక్షా అభియాన్ కార్యాలయానికి తెలియకుండా ఆ పోస్టు భర్తీ చేసినట్లు సమాచారం. ఈ కారణంగానే పలు సమస్యలు ఎదురవుతున్నాయన్న వాదనలున్నాయి. -
నిధుల విడుదలకు ప్రభుత్వానికి దివేదిస్తాం
నంద్యాల రూరల్: ప్రత్యేక అవసరాల పాఠశాలలకు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వానికి దివేదిస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. మండల పరిధిలోని అయ్యలూరు మెట్ట వద్ద ఉన్న నవజీవన్ మూగ, చెవిటి పిల్లల, క్రాంతినగర్లోని లూయిస్ బ్రెయిల్ అంధుల పాఠశాలలను బుధవారం ఆయన సందర్శించారు. ఆయా పాఠశాల యాజమాన్యం ఆర్థిక పరంగా రావాల్సిన నిధుల కోసం ప్రభుత్వానికి విన్నవించుకోగా, వాటిని విచారించి పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రతి నెల నగదు రూపంలో వికలాంగులకు అందుతున్న పెన్షన్ ఈనెల అందలేదని, వికలాంగ చిన్నారులు జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేయగా బ్యాంకుల ద్వారా పెన్షన్ త్వరగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. నవజీవన్, లూయిస్ బ్రెయిలీ స్కూల్లో వికలాంగులకు అందుతున్న విద్య, వసతులను అడిగి తెలుసుకొని జేసీ సంతృప్తి వ్యక్తం చేశారు. అయ్యలూరు మెట్ట వద్ద కర్నూలు–చిత్తూరు 18వ జాతీయ రహదారిపై నాలుగు లైన్ల రోడ్డు అనుసంధానం కావడంతో అమరావతి, తిరుపతి, కర్నూలు వైపు వెళ్లే సర్కిల్ను ఆధునీకరించేందుకు అవసరమైన భూసేకరణ నిమిత్తం రైతు బుగ్గరామిరెడ్డికి చెందిను 16సెంట్ల స్థలాన్ని సేకరించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈయన వెంట నంద్యాల ఆర్డీఓ సుధాకర్రెడ్డి, తహసీల్దార్ శివరామిరెడ్డి ఉన్నారు.