breaking news
Special drive program
-
లాహిరి లాహిరిలో...
-
మరో అవకాశం
కరీంనగర్: యువతీ, యువకులకుశుభవార్త. 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల కమిషన్ మరో అవకాశం కల్పించింది. అంతేకాకుండా ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ, గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్ల జాబితాలో తమ పేర్లుగల్లంతయ్యాయని పలువురు ఆందోళన వ్యక్తం చేసిన విషయం విదితమే. ఈ మేరకు ప్రత్యేక అవకాశం కల్పించిన ఎన్నికల కమిషన్ జాబితా విడుదల చేసిన విషయం విదితమే.అయితే,అప్పట్లో దరఖాస్తు చేసుకోలేని వారి కోసం మళ్లీ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా శని, ఆదివారాల్లో ఓటరుగా నమోదు, చేర్పులు, మార్పుల ప్రక్రియ అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులతో పాటు చిరుమానా మారిన వారు మార్పులు, చేర్పులు అవసరమైన వారు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. జిల్లాలో 9,68,305 మంది ఓటర్లు గ్రామపంచాయతీ ఎన్నికల అనంతరం అర్హులైన వారితో పాటు ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. ఈ మేరకు దరఖాస్తులు స్వీకరించిన అనంతరం అర్హులకు చోటు కల్పించాక గత నెల 22న తేదీన జాబితా విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం కరీంనగర్ జిల్లాలో 9,68,305 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 4,81,271 మంది కాగా, మహిళలు 4,87,013 మందితో పాటు ఇతరులు 21 మంది ఉన్నట్లు తేల్చారు. మళ్లీ ఓటరుగా నమోదుతో పాటు మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించనున్న ఈ నేపథ్యంలో ఈ సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రత్యేక ఏర్పాట్లు ఈ ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారంతా తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించారు. అర్హులైన వారు తగిన ఆధారాలతో స్థానిక రెవెన్యూ కార్యాలయం లేదా బీఎల్ఓల వద్ద నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. లేనిపక్షంలో మీ సేవ కేంద్రాలు, ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇందుకోసం ఇదే సమయంలో బీఎల్ఓలు ప్రతీ ఇంటికి వెళ్లి ఓటరు జాబితాను పరిశీలిస్తారు. జాబితాలో లేని వారిని గుర్తించి పేర్లను నమోదు చేసుకునేలా చర్యలు తీసుకుంటారు. ఇక ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేసేందుకు కళాజాత బృందాలను సైతం నియమించారు. ఆయా బృందాల సభ్యులు గ్రామాల్లో ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తారు. ఇక పోలింగ్ కేంద్రాల్లో రెండు రోజుల పాటు బీఎల్ఓలు ఉదయం 9 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరించనున్నారు. -
పబ్లిక్ మేనిఫెస్టో
-
రైల్వే ఆదాయం పెంచేందుకు స్పెషల్ డ్రైవ్
ఆలంపల్లి, న్యూస్లైన్: రైళ్లలో టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తే చర్యలు తీసుకుంటామని రైల్వే డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రఘునాథ్రెడ్డి ప్రయాణికులను హెచ్చరించారు. సోమవారం వికారాబాద్ రైల్వేస్టేషన్లో తనిఖీలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిక్కెట్ లేకుండా రైళ్లలో ప్రయాణిస్తున్న వారిని తనిఖీలు చేసేందుకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సికింద్రాబాద్, చిత్తాపూర్, వాడీ, వికారాబాద్, పర్లి సెక్షన్ల పరిధిలో ప్రత్యేకంగా 44 మంది టీసీలు, పది మంది ఆర్పీఎఫ్ పోలీసులతో తనిఖీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని రైల్వేస్టేషన్లో తని ఖీలు కొనసాగుతున్నట్లు రఘునాథ్రెడ్డి తెలిపారు. ఆదివారం నుంచి తనిఖీలు చేస్తూ టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న 144 మంది ప్రయాణికులపై కేసులు నమోదు చేసి రూ. 70 వేల జరిమానా వసూలు చేశామన్నా రు. రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణించడం సరికదని ఆయన చెప్పారు. ప్రయాణికులంతా విధిగా టికెట్ తీసుకొని ప్రయాణించాలన్నారు. 10 టెటరింగ్ కేసులు(ఉమ్మివేత) నమోదు చేసి రూ. 2 వేల జరిమానా విధించినట్లు రైల్వే డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రఘునాథ్రెడ్డి చెప్పా రు. రైళ్లలో, రైల్వేస్టేషన్లలో గుట్కాలు, పాన్మసాలాలు ఉమ్మివేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. సీట్లపై ఆహారం, ఇతర ప దార్ధాలు వేసి అపరిశుభ్రం చేయడం తగదన్నారు. రైల్వే ఆదాయం పెం చేందుకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రైల్వే డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రఘునాథ్రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో వికారాబాద్ స్టేషన్ మేనేజర్ మోహన్, తనిఖీ సిబ్బంది ఉన్నారు.