breaking news
siva sankar
-
Putha Siva Sankar: తక్షణమే నారా లోకేష్ క్షమాపణ చెప్పాలి..
-
పవన్ కళ్యాణ్ పై పుత్తా శివశంకర్ ఫైర్
-
స్టెప్పులతో ఇరగదీసిన పల్నాడు జిల్లా కలెక్టర్
-
కలెక్టర్ సాబ్.. మీరు చేసిన పనికి హ్యాట్యాఫ్!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ధర్మవరం జెడ్పీ హైస్కూల్... ఎస్.కోట మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాల. గత పాలకుల నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరిన ఆ విద్యాలయం ఇప్పుడు ఆధునికీకరణకు అద్దం పడుతోంది. ధర్మవరం జెడ్పీ హైస్కూల్ స్టూడెంట్నని అక్కడి విద్యార్థులు ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటున్నారు. దానికి రెండు కారణాలు... ఒకటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగంలో చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు. మరొకటి అక్కడి పూర్వ విద్యార్థి, పల్నాడు జిల్లా కలెక్టరు లోతేటి శివశంకర్ కృషి. విద్యాబుద్ధులు నేర్పడమే గాక తాను ఐఏఎస్ అధికారి కావాలనే లక్ష్యానికి బీజం వేసిన పాఠశాలకు గురుదక్షిణ సమర్పించిన తీరు స్ఫూర్తిదాయకమైంది. సొంతంగా రూ.8.5 లక్షలు ఖర్చు చేసి డిజిటల్ లైబ్రరీని అందుబాటులోకి తెచ్చారు. ఏదో చేశామంటే చేశామని గాకుండా ఆధునికీకరణ, సౌకర్యాల కల్పన, పుస్తకాల బహూకరణ... ఇలా ప్రతి విషయంలోనూ ఆయన ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. లోతేటి శివశంకర్ పదో తరగతి (1995–96 బ్యాచ్) వరకూ ధర్మవరం జెడ్పీ హైస్కూల్లో చదివారు. తర్వాత ఐఏఎస్ సాధించి వివిధ హోదాల్లో పనిచేస్తున్నా ఆ స్కూల్ను ఆయన మరచిపోలేకపోయారు. అత్యున్నత సర్వీసు సాధించడంలో తనను స్ఫూర్తి ప్రదాతగా భావిస్తున్న విద్యార్థులకు తన వంతు తోడ్పాటు అందించడానికి ఇతోధికంగా కృషి చేస్తున్నారు. అప్పటికే తన పదో తరగతి బ్యాచ్ స్నేహితులతో కలిసి బాహుదా సేవాసంఘాన్ని ఏర్పాటు చేశారు. ధర్మవరం గ్రామంలో సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. తిత్లీ తుఫాన్ సమయంలో దెబ్బతిన్న విద్యుత్తు వ్యవస్థను రెండ్రోజుల్లోనే పునరుద్ధరించగలిగారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో కూడా గ్రామంలో వైద్య సేవలు అందేలా ఆ సంఘం విశేష కృషి చేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలతో ధర్మవరం జెడ్పీ హైస్కూల్కు రూపురేఖలు మారాయి. మన బడి నాడు–నేడు కార్యక్రమం ఎంతో దోహదం చేసింది. ఆర్నెల్ల క్రితం ఆ పాఠశాలను సందర్శించిన శివశంకర్... అక్కడి విద్యార్థుల విద్యా మనోవికాసానికి ఉపయోగపడేలా డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తండ్రి పేరుతో రూ.8.5 లక్షల విరాళం.. డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయడానికి పాఠశాల ప్రాంగణంలోనే ఒక హాల్ను శివశంకర్ ఎంపిక చేశారు. తన తండ్రి లోతేటి సన్యాసప్పడు పేరుతో రూ.8.5 లక్షల విరాళంగా సమకూర్చారు. ఆ నిధులతో చక్కని మార్చుల్స్, సీలింగ్, గోడలకు పుట్టీ, పెయింటింగ్తో ఆహ్లాదంగా ఆ హాల్ను అభివృద్ధి చేశారు. ఏసీ సౌకర్యంతో పాటు స్టడీ టేబుళ్లు, కుషన్ కుర్చీలు సమకూర్చారు. రెండు కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. అంతేకాదు సీసీ కెమెరాలతో రక్షణ ఏర్పాట్లు చేశారు. ఇక పుస్తకాలను సమకూర్చడంలో శివశంకర్ తన వంతు కృషి చేశారు. తాను చదువుకున్న, సేకరించిన పుస్తకాలను లైబ్రరీకి ఇచ్చేశారు. చలం మాస్టారి సహకారంతో వైజ్ఞానిక, సాహిత్య, పోటీ పరీక్షల పుస్తకాలన్నీ అందుబాటులోకి తెచ్చారు. అవన్నీ భద్రంగా ఉంచేందుకు ప్రత్యేక కప్బోర్డులను ఏర్పాటు చేశారు. అత్యధిక కాలం లైబ్రరీలో పుస్తక పఠనంలోనే గడిపిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను విద్యార్థులు స్పూర్తిగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ డిజిటల్ లైబ్రరీకి ఆయన పేరుతోనే నామకరణం చేశారు. అంతేకాదు పుస్తక పఠనం వైపు విద్యార్థుల ఆసక్తిని పెంచడానికి పోటీ కూడా పెట్టారు. రానున్న దసరా సెలవుల్లో బాహుదా సేవాసంఘం సభ్యులు వారికి పోటీ పరీక్ష నిర్వహించనున్నారు. అందులో అత్యుత్తమ ప్రతిభ చూపిన తొలి 20 మంది విద్యార్థులను ఐదు రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలో విజ్ఞాన యాత్రకు తీసుకెళ్తానని శివశంకర్ హామీ ఇవ్వడం విశేషం. -
జిల్లా కేంద్రం సాధించే వరకు పోరాటం
మెదక్: కాకతీయుల కోటగా.. నిజాం నవాబుల ఖిల్లాగా వినుతికెక్కిన మెదక్ సుభా మరో ఉద్యమానికి వేదికైంది. జిల్లా కేంద్రం కోసం 57ఏళ్లుగా పోరాటం చేస్తున్నా..తమకు న్యాయం జరగడం లేదంటూ మూడు రోజుల క్రితం మరోమారు పట్టణ ప్రజలు మహోద్యమానికి ఊపిరి పోశారు. ఇంకెన్నాళ్లు ఈ దగా..ఇకపై సహించేది లేదు, ప్రాణాలైన ఫణంగా పెడతాం..జిల్లా కేంద్రం సాధించి తీరుతాం అంటూ..నిరవధిక దీక్షలకు శ్రీకారం చుట్టారు. నిజాం కాలంలో మెదక్ పట్టణం నాలుగు జిల్లాలకు సుభాగా పరిపాలనా కేంద్రంగా విరాజిల్లింది. నేటి తెలంగాణ రాజధాని హైదరాబాద్ జిల్లా సైతం మెదక్ సుభాలోనే భాగమై ఉండేది. కాని అధికారులు, పాలకుల స్వార్థంతో 1932లో జిల్లా కేంద్రాన్ని సంగారెడ్డి పట్టణానికి తరలించారు. నాటి నుంచి జిల్లా కేంద్రం కోసం పోరాటం జరుగుతూనే ఉంది. 1957లో సంఘ సేవకులు రాందాస్ జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ 43రోజుల పాటు దీక్షలు చేపట్టారు. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కళావెంకట్రావ్ ఇచ్చిన హామీ మేరకు దీక్ష విరమించారు. కానీ ఆ హామీ అమలుకు నోచుకోలేదు. దీంతో 1976లో డాక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో మళ్లీ నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. అప్పటి మంత్రి బాగారెడ్డి బుజ్జగింపుతో దీక్షలు ఆగిపోయాయి. 1982లో తిరిగి మెదక్ను జిల్లా కేంద్రం చేయకుంటే ఎన్నికలను బహిష్కరిస్తామని పట్టణ ప్రజలు హెచ్చరించారు. అప్పటి కేంద్ర మంత్రి శివశంకర్, బాగారెడ్డిలు మెదక్కి వచ్చి ఇందిరమ్మను గెలిపిస్తే ప్రధాన మంత్రి అవుతారని, అనంతరం మెదక్ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇది కూడా అమలుకు నోచుకోక పోవడంతో 2009లో రాంరెడ్డి కన్వీనర్గా మల్కాజి సత్యనారాయణ కార్యదర్శిగా జిల్లా కేంద్ర సాధన సమితి ఏర్పడింది. నాటి నుంచి పోరాటం కొనసాగుతూనే ఉంది. 2010లో 57 రోజుల పాటు రిలే దీక్షలు చేపట్టి, లక్ష సంతకాలు సేకరించి 14 డిసెంబర్ 2010న మెదక్ నుంచి పాదయాత్ర ప్రారంభించి 23న అప్పటి ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. అలాగే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కూడా వినతిపత్రం సమర్పించారు. అప్పటి నుంచి బైక్ ర్యాలీలు, జెండావిష్కరణలు, ప్రజాప్రతినిధుల తీర్మానాలు సేకరిస్తూ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేశారు. సెప్టెంబర్ ప్రకటనతో అడియాశలు: తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ ఒక ప్రకటన వెలువడడంతో మెదక్ పట్టణ ప్రజల ఆశలు అడియాశలయ్యాయి. వెంటనే స్పందించిన డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే కొత్త జిల్లాల ఏర్పాటు ఉంటుందన్న ప్రకటన వెలువడింది. అయినప్పటికీ మెదక్ ప్రజల్లో జిల్లా కేంద్రం ఏర్పాటుపై కమ్ముకున్న అనుమానపు నీడలు తొలగిపోలేదు. నిరవధిక రిలేదీక్షలు ప్రారంభం: మెదక్ జిల్లా కేంద్రం కోసం గురువారం పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో జిల్లా కేంద్ర సాధన సమితి ఆధ్వర్యంలో రిలే నిరవధిక దీక్షలు ప్రారంభమయ్యాయి. పట్టణంలోని పలు రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు. ప్రజ సంఘాలు, మేధావులు ఉద్యమానికి మద్దతిస్తున్నారు.