breaking news
Simantam
-
వేడుకగా భార్యకు సీమంతం .. ఇంతలోనే విషాదం
బూర్జ: వారికి వివాహం జరిగి పదేళ్లయింది. సంతానం కోసం ఎన్నో ఆలయాలు తిరిగారు. ఎందరో దేవుళ్లకు మొక్కారు. వాళ్ల పూజలు ఫలించాయి. భార్య గర్భవతి అని తెలియగానే భర్త సంబరపడిపోయారు. ఏడు నెలలు గిర్రున తిరిగాయి. సీమంతం వేడుక శుక్రవారం ఎంతో ఘనంగా నిర్వహించారు. బంధువులు, స్నేహితులతో ఆ ఇల్లు సందడి నెలకొంది. మరికొద్ది రోజుల్లోనే ముద్దులొలికే చిన్నారిని ఎత్తుకుంటానని ఎన్నో కలలు కన్నారు. ఇంతలోనే ఆ కుటుంబంలోనే అంతులేని విషాదం చోటుచేసుకుంది. బిడ్డను చూడకుండానే ఆ తండ్రి విద్యుత్ షాక్తో మరణించిన హృదయవిదారక సంఘటన మండలంలోని కేకేరాజపురంలో శనివారం జరిగింది. నాలుగు రోజుల క్రితమే స్వగ్రామానికి గ్రామానికి చెందిన వేపారి లోకేశ్వరరావు(46) ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ప్రసుత్తం వీరు విశాఖపట్టణంలో నివాసం ఉంటున్నాడు. ఆయనకు పదేళ్ల క్రితం జ్ఞాన ప్రసూన(పద్మ)తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. పిల్లలు కలగకపోవడంతో నిరుత్సాహపడ్డారు. చివరకు పద్మ గర్భవతి అని తెలియడంతో వారి కుటుంబంలో కొత్త ఆశలు చిగురించాయి. స్వగ్రామంలో భార్యకు సీమంతం చేయాలని నాలుగు రోజుల క్రితం భార్యను తీసుకుని లోకేశ్వరరావు కేకే రాజపురానికి వచ్చారు. బంధువులు, మిత్రులు అందరినీ పిలిచి సంప్రదాయబద్ధంగా, ఎంతో ఘనంగా శుక్రవారం సీమంతం నిర్వహించారు. వచ్చిన వారంతా భార్యాభర్తలను చూసి ఎంతో సంతోషించారు. బంధువులంతా ఇంకా ఇంట్లోనే ఉన్నారు. ఆ ఆనందం ఇంకా 24 గంటలు కూడా కాలేదు. ఇంతలోనే లోకేశ్వరరావు విద్యుత్షాక్తో శనివారం మృత్యువాతపడ్డారు. ఆస్పత్రికి తరలించేలోగానే.. బంధువులు వస్తారని మూడు రోజులు కిందటే ఇంట్లో కొత్తగా మోటార్ వేయించారు. శనివారం మోటార్ ఆన్ చేసేందుకు ప్రయత్నించినా ఆన్ కాలేదు. అందులో నీరు పోయగానే వెంటనే విద్యుత్ సరఫరా జరిగింది. దీంతో మోటార్కే అతుక్కుపోయారు. పక్కనే ఉన్న తల్లి రాజేశ్వరమ్మ కర్రతో కొట్టడంతో కిందకు పడిపోయారు. హుటాహుటిన లోకేష్ను ఆటోలో పాలకొండ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. లోకేశ్వరరావు మృతిచెందాడని తెలియడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వార్త విన్న పద్మ విలపిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది. మరో రెండు నెలల్లో చిన్నారిని చూసుకుని మురిసిపోవాలని లోకేష్ ఎంతో సంబరపడ్డాడని, కానీ బిడ్డను చూడకుండానే ఇలా విగతజీవిగా మారడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక్కగానొన్క కొడుకు తన చేతుల్లోనే మరణించడాన్ని తట్టుకోలేక ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. గ్రామానికి వచ్చి నాలుగు రోజులు మిత్రులను కలిసి ఆనందాన్ని పంచుకున్నాడని, ఆ సంతోషం కొన్ని గంటలు కూడా నిలవలేదని విషణ్ణ వదనాలతో రోదిస్తున్నారు. -
గోమాతకు సీమంతం
అ అంటే అమ్మ అని.. ఆ అంటే ఆవు అని చిన్నారులకు అక్షరాలు నేర్పుతుంటాం. అమ్మ తర్వాత అంతటి ప్రాశస్త్యం కలిగిన గోమాతకు పండుగలు, వ్రతాల సమయంలో విశిష్ట పూజలు చేస్తారు. అదేవిధంగా వైఎస్సార్ జిల్లా పాత కడపకు చెందిన పల్లా నరసింహులు పెంచుతున్న గోవుకు నిత్యం పూజలు చేస్తుంటారు. ప్రస్తుతం ఆ ఆవు చూడిదైంది (గర్భం దాల్చింది). సంప్రదాయం ప్రకారం మహిళలకు ఏ విధంగా అయితే సీమంతం చేస్తారో నరసింహులు తన కూతురులాగా భావించే గోమాతకు శనివారం సాయంత్రం సీమంతం చేశారు. గ్రామంలోని మహిళలందరు వచ్చి గోమాత చుట్టూ తిరుగుతూ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ.. ఈ గోమాత చూడిదైన ప్రతిసారి కోడెదూడలే పుడుతున్నా యని తెలిపారు. వాటిని చాలా మంది కొనుగొలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. – కడప అగ్రికల్చర్ -
గోమాతకు సీమంతం
లక్ష్మీనగర్లో అపురూప వేడుక పాపన్నపేట: మాతృత్వం మహిళకు ఓ వరం.. ప్రసవం పునర్జన్మతో సమానం.. అందుకే గర్భం దాల్చిన మహిళను ఇంటిల్లిపాది అపురూపంగా చూసుకుంటారు. ఐదు నెలలో సీమంతంచేసి రకరకాల తినుబండారాలుచేసి పెట్టడం ఆనవాయితీ. అయితే లక్ష్మీనగర్ గ్రామ మహిళలు మాత్రం కాస్తా వెరైటీగా ఆలోచించి గోమాతకు సీమంతంచేసి తమ జంతుప్రేమను చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే... పాపన్నపేట మండలం లక్ష్మినగర్లో గ్రామస్తులు తమదైన రీతిలో వినూత్న కార్యక్రమాలు చేపడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల గ్రామపుట్టినరోజు జరుపుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. అలాగే పవిత్రంగా పూజించే గోమాతకు గురువారం శ్రీమంతం చేశారు. మహిళలంతా ఒకచోటచేరి గోమాతను పసుపు, కుంకుమలు, పూలతో అలంకరించి, రకరకాల తినుబండారాలు చేసి పెట్టారు. సాధారణంగా గోమాతను మహిళతో సమానంగా గౌరవిస్తుంటారు. గ్రామీణ అన్నదాతలకు ఆవు బహుళ ప్రయోజనకారి. అందుకే నోరులేని ఆ సాధుజంతువుకు అపురూపమైన ఆతిథ్యం ఇవ్వాలనే ఆలోచన తమకు వచ్చిందని మహిళలు తెలిపారు.