breaking news
Siddharth Jadhav
-
రజాకార్లపై పోరు!
మరాఠీ చిత్రం ‘రజాకర్’ను నిర్మాత రాజమౌళి తెలుగులో ‘నైజాం సర్కరోడ’గా అనువదించారు. సిద్ధార్థ్ జాదవ్, జ్యోతి సుభాష్, శరద్ బుటాదియా ముఖ్య తారలుగా రాజ్దుర్గె దర్శకత్వం వహించారు. రాజమౌళి మాట్లాడుతూ – ‘‘దేశ స్వాతంత్య్రం తర్వాత హైదరాబాద్ను సొంతం చేసుకోవాలన్న రజాకార్లపై తిరుగుబాటు చేసిన ఓ యువకుడి కథాంశమే ఈ చిత్రం. సామాన్య పౌరుల అండతో ఆ యువకుడు రజాకార్లపై ఎలా పోరు జరిపాడన్నది ఆసక్తికరంగా తెరకెక్కించాం. మాటలు, పాటలు నేనే రాశా. మయురేష్ కేల్కర్ అందించిన పాటలు బాగున్నాయి. త్వరలో చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అన్నారు. -
రజాకార్ల దౌర్జన్యంపై...
సిద్ధార్థ జాదవ్, జ్యోతి సుభాష్, జాకీర్ హుస్సేన్ ముఖ్య తారలుగా రాజు దుర్గే దర్శకత్వంలో మౌళి ఫిలింస్ పతాకంపై రాజమౌళి నిర్మించిన సినిమా ‘నైజాం సర్కరోడా’. మంగళవారం హైదరాబాద్లో ప్రదర్శించిన ఈ సినిమా ప్రివ్యూ షోకి ప్రజా గాయకుడు గద్దర్, ప్రొఫెసర్ కోదండరాం, పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. గద్దర్ మాట్లాడుతూ – ‘‘సామాన్య ప్రజలపై రజాకార్లు ఎలాంటి అకృత్యాలకు పాల్పడ్డారన్న అంశాన్ని సినిమాలో చక్కగా చూపించారు. శత్రువును ఎదుర్కోవాలంటే చేతిలో ఆయుధమే ఉండాలా? మనలో శక్తి సామర్థ్యాలను ఆయుధంగా ఎందుకు మలుచుకోకూడదు? అనే అంశం బాగుంది’’ అన్నారు. ‘‘భారతదేశ చరిత్రలో హైదరాబాద్ విముక్తి పోరాటం ఓ అధ్యాయమైతే... అందులో సామాన్యుడు ఎదుర్కొన్న పరిస్థితులు మరో అధ్యాయం’’ అన్నారు రాజమౌళి. ‘‘చిన్నప్పటి నుంచి చూసిన పలు ఘటనల ఆధారంగా ఈ సినిమా తీశా’’ అన్నారు దర్శకుడు రాజు దుర్గే.