breaking news
Shanghai Cooperation Coalition
-
తూర్పు లద్దాఖ్లో శాంతితోనే సత్సంబంధాలు
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్లో యథాతథ స్థితి కొనసాగుతుండడం, బలగాల ఉపసంహరణ విషయంలో చైనా సానుకూల చర్యలు చేపట్టకపోవడం వల్ల ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రతికూలతలు నెలకొన్నాయని భారత్ చైనాకు స్పష్టం చేసింది. షాంఘై కోఆపరేషన్ కార్పొరేషన్(ఎస్సీఓ) సదస్సు సందర్బంగా బుధవారం దుషాంబెలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి, భారత విదేశాంగ మంత్రి జైశంకర్ల మధ్య ప్రత్యేకంగా సమావేశం జరిగింది. వాస్తవాధీన రేఖ వెంట ఎలాంటి ఏకపక్ష మార్పులను భారత్ అంగీకరించబోదని ఈ సందర్భంగా జై శంకర్ వాంగ్ యికి స్పష్టం చేశారు. తూర్పు లద్దాఖ్లో పూర్తి స్థాయిలో శాంతి నెలకొన్న తరువాతనే ఇరుదేశాల మధ్య సానుకూల సంబంధాలు సాధ్యమవుతాయన్నారు . రెండు దేశాల మధ్య మిలటరీ స్థాయిలో తదుపరి దశ చర్చలు సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ప్యాంగ్యాంగ్ సరస్సు ప్రాంతం నుంచి ఫిబ్రవరిలో ఇరుదేశాల బలగాలు వెనక్కు వెళ్లిన తరువాత.. ఇతర వివాదాస్పద ప్రదేశాల నుంచి బలగాలను ఉపసంహరించే ప్రక్రియలో ప్రతిష్టంభన నెలకొంది. తూర్పు లద్దాఖ్లో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా ప్రయత్నించడంతో ఇరుదేశాల సంబంధాలు దిగజారిన విషయాన్ని జైశంకర్ ప్రస్తావించారు. ‘తూర్పు లద్దాఖ్లో వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొని ఉన్న మిగతా అన్ని సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కారం సాధించాల్సిన అవసరం ఉంది’ అని జై శంకర్ స్పష్టం చేశారని విదేశాంగ శాఖ తెలిపింది. అఫ్గాన్లో శాంతి స్థాపనే లక్ష్యం ఉగ్రవాదాన్ని కలసికట్టుగా ఎదుర్కోవడం, ఉగ్ర సంస్థలకు ఆర్థిక సహకారాన్ని ఆపేయడం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) తప్పనిసరిగా చేయాలని జై శంకర్ అన్నారు. రష్యా, పాకిస్తాన్, చైనా విదేశాంగ మంత్రులతో కలిసి బుధవారం ఆయన ఎనిమిది సభ్య దేశాలు ఉన్న ఎస్సీఓ కీలక సదస్సులో పాల్గొన్నారు. -
ఎస్సీఓ వద్ద విభేదాలొద్దు
భారత్, పాకిస్తాన్లకు స్పష్టం చేసిన చైనా బీజింగ్: షాంఘై సహకార కూటమి (ఎస్సీఓ)లో భారత్, పాక్లు తమ ద్వైపాక్షిక విభేదాల్ని లేవనెత్తకూడదని చైనా స్పష్టం చేసింది. ఆ మేరకు కూటమి నిబంధనల్ని రెండు దేశాలు కచ్చితంగా పాటించాలని సూచించింది. భారత్, పాక్లను అధికారికంగా ఎస్సీఓలోకి ఆహ్వానిస్తూ గురువారం బీజింగ్లోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇరు దేశాల్ని కొత్త సభ్య దేశాలుగా ఖరారు చేస్తూ భారత్, పాక్ల జాతీయ పతాకాల్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా చైనా విదేశాంగ శాఖ సహాయ మంత్రి కోంగ్ గ్జుయాన్యు ప్రసంగిస్తూ.. భారత్, పాకిస్తాన్లు షాంఘై సహకార కూటమిలో సభ్యత్వం పొందడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ‘ఎస్సీఓ చాప్టర్లో సూచించిన నిబంధనల మేరకు ద్వైపాక్షిక సమస్యల్ని ఇరుదేశాలకు కూటమి ముందుకు తేకూడదు. రెండు దేశాలు ఈ నిబంధనకు కట్టుబడి ఉంటాయని ఆశిస్తున్నా’నని కోంగ్ అన్నారు. చైనా, భారత్, పాకిస్తాన్ల అభివృద్ధి క్రమం, సవాళ్లు ఒకేవిధంగా ఉన్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు మూడు దేశాలు కలసికట్టుగా ముందుకు సాగుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలి చైనాలో భారత రాయబారి విజయ్ గోఖలే మాట్లాడుతూ.. ‘ఎస్సీఓ పరిధిలో సంబంధాల మెరుగుదలకు, వాణిజ్య విస్తరణకు భారత్ మద్దతిస్తుంది. అయితే దేశ సార్వభౌమత్వం, సమైక్యతను గౌరవించేలా అవి కొనసాగాల’ని ఎల్ఓసీలో చైనా–పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ను పరోక్షంగా ప్రస్తావించారు. ఉగ్రవాదం, అతివాదంపై పోరులో పరస్పర సహకారానికి ఆసక్తిగా ఉన్నామని, అంతరిక్షం, ఐటీ రంగాల్లో నైపుణ్యాన్ని సభ్య దేశాలతో పంచుకునేందుకు సిద్ధమని గోఖలే స్పష్టం చేశారు. జూన్ 8, 9 తేదీల్లో కజకిస్తాన్ రాజధాని ఆస్తానాలో జరిగిన ఎస్సీఓ సదస్సులో భారత్, పాకిస్తాన్లను సభ్య దేశాలుగా చేర్చుకున్న సంగతి తెలిసిందే. ఎస్సీఓలో మొత్తం 8 సభ్య దేశాలుండగా.. కూటమికి చైనా నేతృత్వం వహిస్తోంది. చైనాతో పాటు రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, భారత్, పాకిస్తాన్లు సభ్య దేశాలు కాగా.. అఫ్గానిస్తాన్, బెలారస్, ఇరాన్, మంగోలియా పరిశీలక దేశాలుగా కొనసాగుతున్నాయి