-
లౌకిక విలువలు లోపించిన విద్యారంగం
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కేంద్రీయ విద్యాలయాల్లో హిందూ మతానికి చెందిన సంస్కృత శ్లోకాలు చెప్పించటాన్ని సవాల్ చేస్తున్న ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (íపీఐఎల్) సుప్రీంకోర్టులో 2018 జనవరి నుండి విచారణలో ఉంది. విషయ ప్రాధాన్యత దృష్ట్యా ఈ కేసును ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి అప్పగించాలని భారత ప్రధాన న్యాయమూర్తిని కోరుతూ పిటిషన్ని విచారిస్తున్న జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ నవీన్ సిన్హా ఈ ఏడాది జనవరి 28 న తీర్మానించారు. ఈ నేపథ్యంలో లౌకిక రాజ్యం, అందులో విద్యారంగం పాత్రను పరిశీలించాలి. లౌకిక రాజ్యంలో అధికారిక మతం అనేది ఉండదు. ప్రభుత్వం ఏ మతానికీ అనుకూలంగా గానీ, ప్రతికూలంగా గానీ వ్యవహరించకూడదు. మత విశ్వాసాలు, ఆచార వ్యవహారాల పట్ల తటస్థంగా ఉండాలి. ఏ మతానికీ ప్రాధాన్యత గానీ, ప్రోత్సాహం గానీ, అవకాశం గానీ కల్పించకూడదు. సెక్యులర్ స్టేట్స్గా చెప్పుకుంటున్న భారత్ వంటి కొన్ని దేశాల ప్రభుత్వాలు వివిధ సందర్భాల్లో ఆయా దేశాల్లోని మతాచారాలు పాటించడం, మతాల అవసరాలు తీర్చడం జరుగుతోంది. మరోవైపు సెక్యులర్ విలువలను పాటించాలనే ఉద్యమాలు కూడా ఊపందుకుంటున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్ నివాసి అడ్వకేట్ వినాయక్ షా పిల్లలు కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులు. ఆయనే సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ వేశారు. పాఠశాల ప్రార్ధనా సమయంలో విద్యార్థులతో అసతోమా సద్గమయా, తమసోమా జ్యోతిర్గమయా, మృత్యోర్మా అమృతంగ మయా, ఓం శాంతి శాంతి శాంతిః అనే బృహదారణ్యక ఉపనిషత్తులోని శ్లోకాన్ని చెప్పిస్తున్నారు. అది విద్యార్థుల్లో మత విశ్వాసాన్ని చొప్పించటమేనని, శాస్త్రీయ దృక్పథాన్ని దెబ్బతీస్తుందనీ, రాజ్యాంగం ఆర్టికల్ 28 (1)కి విరుద్ధమైందనీ అందువలన ఆ పద్ధతిని నిషేధించాలని షా కోరారు. పూర్తిగా ప్రభుత్వ నిధులతో నడిచే విద్యాసంస్థల్లో ఏ మతానికి సంబంధించిన విషయాలనూ బోధించకూడదని రాజ్యాంగ ఆదేశం. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో పనిచేస్తున్న కేంద్రీయ విద్యాలయాల సిలబస్, యూనిఫామ్, ప్రార్ధన, ఎకడమిక్ కేలండర్ ఒకే విధంగా ఉంటాయి. కేంద్రీయ విద్యాలయాల వలెనే కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో కూడా అలాంటి ప్రార్ధనలే చేయిస్తున్నారు. అంతర్లీనంగా ఇక్కడా హిందూ మత ప్రచారం కూడా జరుగుతుందని ఆ పాఠశాలలో చదివిన అలోకానంద బిసోయ్ ఇటీవల ’యూత్ కీ ఆవజ్.కామ్’ అనే ఆన్ లైన్ పత్రికలో వ్రాశారు. భోజనం చేసే ముందు క్రిష్ణ యజుర్వేద తైత్తరీయ ఉపనిషత్తులోని శ్లోకం చెప్పిస్తారు. పాఠశాల ప్రారంభ సమయంలో జరిగే ప్రార్ధనలో రోజుకో విద్యార్ధితో మైకులో నేటి సూక్తి పేరుతో భగవద్గీత లేదా వేదాల్లోని ఒక శ్లోకాన్ని, దాని అర్ధాన్ని చెప్పిస్తారు. మిషనరీ స్కూల్సులో క్రైస్తవ మతం గురించి, మదర్సాల్లో ఇస్లాం మతం గురించి చెబుతున్నట్లు ఎప్పుడైనా పత్రికల్లో వార్తలు వస్తే అదేమి పని అని చాలామంది ప్రశ్నిస్తుంటారు. అవి ప్రైవేట్ యాజమాన్యంలోని కొద్దిమంది విద్యార్థులు ఉండే పరిమిత సంఖ్యలోని పాఠశాలలు. ముస్లిం విద్యార్థుల్లో కేవలం మూడు శాతం మంది మాత్రమే మదర్సాల్లో చదువుతున్నట్లు సచార్ కమిటీ నివేదిక పేర్కొన్నది. కానీ 13 కోట్ల మంది విద్యార్థులు చదివే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాఠశాలల్లో జరుగుతున్న హిందూమత ప్రచారం గురించి ప్రశ్నించరేమి అని బిసోయ్ అడుగుతున్నాడు. అయితే రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో కూడా హిందూమత ఆచారాలు, పద్ధతులు పాటించడం జరుగుతున్న విషయం తెలిసిందే. స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ డే ఉత్సవాల్లో మహాత్మాగాంధీ ఫొటోకి కుంకుమబొట్లు పెట్టడం, కొబ్బరికాయలు కొట్టడం, అగరొత్తులు వెలిగించడం చేస్తున్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్, వసతి గృహాల్లో కూడా భోజన సమయంలో ఓం శాంతి శ్లోకాలు చెప్పిస్తారు. వినాయక చవితి రోజుల్లో విగ్రహాలు పెట్టి పూజలు చేయడం కూడా కొన్ని స్కూల్స్, హాస్టల్సులో జరుగుతోంది. మధ్యప్రదేశ్, హరియాణా తదితర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విద్యార్థులతో ఉదయం సూర్య నమస్కారాలు చేయిస్తున్నారు. పాఠ్యపుస్తకాల్లో రామాయణ, మహాభారత పాఠాలు చేరుస్తున్నారు. మహారాష్ట్రలోని కాలేజీల్లో భగవద్గీత పుస్తకాలు పంచి పెట్టారు. అన్నిటికీ మించి సైన్స్ కాంగ్రెస్ సభల్లోనే ప్రధానమంత్రి, విద్యాశాఖ మంత్రులు, వైస్ చాన్స్లర్లు రామాయణం, మహాభారతం గురించి కీర్తిం చడం తెలిసిందే. రాజ్యాంగ ఆదేశమైన లౌకిక విలువలను విద్యార్ధి దశ నుండే నేర్పాలి. మతాచారాలు, పద్ధతులను నిరుత్సాహపర్చాలి. మత సంబంధిత పాఠాలను నిషేధించాలి. ఈ పని చేయగలిగే అవకాశం అందరికంటే ఉపాధ్యాయులకే ఎక్కువగా ఉంటుంది. వినాయక్ షా వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో వచ్చే తీర్పు విద్యారంగంలో లౌకిక రాజ్యం పునాదులను బలపర్చటానికి తోడ్పడాలని ఆశించాలి. నాగటి నారాయణ, విద్యారంగ విశ్లేషకులు మొబైల్ : 94903 00577 -
మీకు తక్షణ శక్తినిచ్చేది - విలాస విద్య
విద్య - విలువలు లోకంలో లౌకిక విద్య అని, విలాస విద్య అని రెండుంటాయి. లౌకిక విద్య కడుపునింపడానికి పనికొస్తుంది. మీరు చదువుకున్న బీటెక్, ఎంటెక్, ఎంబీబీఎస్... ఇవన్నీ మీ సామాజికహోదాను నిర్ణయిస్తాయి. మీరు చదువుకున్న చదువుకు మీకో ఉద్యోగం, ఉపాధి లభిస్తాయి. దాన్నిబట్టి మీకు కొంత సంపాదన వస్తుంది. ఇది మీకు సామాజిక భద్రతను కల్పిస్తుంది. మీకు పాలుపోసేవాడు కావచ్చు, మరొకడు కావచ్చు మిమ్మల్ని నమ్మడానికి ఈ సామాజిక భద్రత, హోదా పనికొస్తాయి. విలాస విద్య అని మరొకటుంది. ఇది ప్రతివాళ్లకూ కావాలి. ఇది లేదు- అంటే వ్యక్తిలోనో, స్వభావంలోనో ఏదో లోటు ఉందని గుర్తు. ఇది ఆత్మపోషణ కోసం, ఆత్మ సంతృప్తికోసం పనికొస్తుంది. పూర్వం ఉన్న గురుకుల విద్యాభ్యాసానికీ, ప్రస్తుత విద్యావిధానానికీ ప్రధాన వ్యత్యాసం ఇక్కడే ఉంది. విలాసవిద్య అంటే హాబీ. నేను కేంద్ర ప్రభుత్వంలో ఒక ఉద్యోగిని. అది నేను లౌకికంగా చదువుకున్న చదువు ద్వారా లభించింది. నా ఆత్మ సంతృప్తిపొందడానికి, ఆత్మపోషణకు అది కారణం కాలేదు. కానీ నాకు ఆర్ష వాఙ్మయం అంటే చాలా ఇష్టం. రామాయణ, భారత, భాగవతాలు చదవడం, పదిమందికీ చెప్పడమంటే బాగా ఇష్టం. నాకు ఉద్యోగంలో ఇంక్రిమెంట్ వచ్చినా, ప్రమోషన్ వచ్చినా అవి నా దృష్టిలో పెద్ద విషయాలు కావు. నా పనితీరును బట్టి, నా సర్వీసు రికార్డును బట్టి అవి మామూలుగా వచ్చాయనిపిస్తుంది తప్ప అవి నా మనసును ఉల్లాసపరచలేవు. అదే నేను మహాభారతం మీద ప్రసంగం చేస్తున్నప్పుడు, భీష్మస్తుతి చెప్తున్నప్పుడు భీష్మాచార్యులవారి భక్తికి మనసు పులకించిపోయిందనుకోండి. పద్యాలు అనర్గళంగా చెప్పి, భీష్ములవారిని తలచుకుని పొంగిపోతూ రాత్రి పడుకుని నిద్రపోయేటప్పుడు కూడా ఆ పద్యాలే దొర్లుతూండగా ఆనందపడే పరిస్థితి ఉంటుంది. ఆ సంతోషం మరేదీ నాకివ్వదు. అయితే విలాసవిద్య మనిషిని ఎప్పుడు కూడా సంస్కరించేది అయి ఉండాలి. పాడుచేసేదిగా ఉండకూడదు. మంచి ఉద్యోగం ఉంది కానీండి జేబుదొంగతనాలుచేస్తే ఆత్మతృప్తిగా ఉంటుందని అన్నారనుకోండి. అలా ఉండకూడదు. విలాస విద్య మనిషి ఉన్నతికి పనికిరావాలి తప్ప వినాశనానికి కాదు. పూర్వం భవాన్స్వాళ్ళు ’భారతీయ సాంస్కృతిక వారసత్వం’ అని ఒక పరీక్ష పెట్టి అందులో కూడా కనీస ఉత్తీర్ణత సాధిస్తేనే డిగ్రీ ప్రదానం చేసేవారు. అలా విలాసవిద్యను ప్రోత్సహించేవారు. విలాసవిద్య ఒక సంగీతం కావచ్చు, ఒక నృత్యం కావచ్చు. 20 త్యాగరాజ కీర్తనలు నోటికి వచ్చనుకోండి. మీ మనసు బాగా లేనప్పుడు ‘నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సుఖమా’ అని పాడుకున్నారనుకోండి. మీ మనసు ప్రశాంతత సంతరించుకుంటుంది. మా అమ్మంటే నాకు ప్రాణం. ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచిపెద్దచేసింది. మా అమ్మ చనిపోయిన రోజున నేను విచలితుడినయిపోయాను. తట్టుకోలేకపోయాను. అంత బాధలో నన్ను నిలబెట్టినవి రామాయణ, భారతాది గ్రంథాలే. మీకు మంచి పుస్తకాలు చదవడం ఇష్టమనుకోండి. స్వామి వివేకానంద ప్రవచనాలు, జవహర్లాల్ నెహ్రూ రాసిన ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ మీ ఆల్మరాలో ఉన్నాయనుకోండి. మహాత్ములు రాసిన పుస్తకాలు మీ గదిలో ఉంటే మీరు మహాత్ముల మధ్యలో కూర్చుని ఉన్నారని గుర్తు. వివేకానంద ప్రవచనాలు చదువుతున్నారంటే... ఆ స్వామి మాట్లాడుతుంటే మీరు ఎదురుగా కూర్చుని వింటున్నారని అర్థం. మంచి పుస్తకాలు ఎంపికచేసి తెచ్చుకోండి. రోజుకో 10 పేజీలు చదవండి. మీలో శక్తి పెరగడాన్ని, మీలో మార్పును మీరే గమనిస్తారు. ఇవి మానసికంగా మిమ్మల్ని ఎలా తయారుచేస్తాయంటే... జీవితంలో ఎదురయ్యే సంఘటనలకు, దుర్ఘటనలకు ఎలా, ఎంతవరకు ప్రతిస్పందించాలో, ఏది ఎంత మోతాదులో స్వీకరించాలో నేర్పుతాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విలాసవిద్య ఇష్టం. నాకు ప్రకృతిని పరిశీలించడం ఇష్టం. రవీంద్రనాథ్ ఠాగూర్ పాడయిపోయిన పాత పడకమంచం గిరికీల శబ్దాల నుంచి, పక్షుల కిలకి రావాల వరకు చూసి పరవశిస్తూ ప్రకృతి కవిగా మారి ప్రపంచం మొత్తం మీద సాహిత్యానికి నోబెల్ బహుమతి పొందిన ఏకైక భారతీయుడయ్యాడు. ఎవరిలో ఏ విస్ఫోటం దాగుందో తెలియదు. మనసు శాంతిపొందడానికి కావలసింది ఏదో ఉంటుంది మన లోపల. విలాసవిద్య దాన్ని వెలికి తీస్తుంది. కాకినాడలో ప్రఖ్యాత గైనకాలజిస్టు ఒకామె ఉన్నారు. మహిళా మందిరంలో ఆమె తంబూర పట్టుకుని కీర్తనలు పాడుతూంటే మైమరిచిపోతాం. అలాగే హైదరాబాద్లో ఇప్పటికీ బ్రెస్ట్ కాన్సర్ కేంద్రానికి అధిపతిగా ఉన్న ఒక డాక్టర్ చాలా బిజీగా ఉండికూడా ప్రతిరోజూ అరగంట నృత్యం ప్రాక్టీస్ చేస్తుంది. ఆమె కాకినాడలో జరిగే శారద నవరాత్రులకు వచ్చి ప్రదర్శన ఇస్తే కొన్ని వేలమంది నిలబడి చప్పట్లుకొడుతూ (స్టాండింగ్ ఓవేషన్) ఆమెను ఘనంగా అభినందిస్తారు. ఒకప్పుడు ప్రధానమంత్రికి కార్యదర్శిగా, రాష్ర్ట ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసి కూడా ధైర్యంగా పిలకబెట్టుకుని, పంచెకట్టుకుని, పైన నామం పెట్టుకుని తాను నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడి పీవీఆర్కే ప్రసాద్గారు కృషి చేస్తున్నారు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి డిజిపిగా ఎంతో తీరికలేకుండా ఉండికూడా అరవింద్రావుగారు గురువు దగ్గరకూర్చుని సంస్కృతం నేర్చుకున్నారు. పీహెచ్డీ చేశారు. అబ్దుల్ కలాంగారు రాష్ర్టపతి పదవిలో ఉండికూడా చాలా పుస్తకాలు రాశారు. జవహర్లాల్ నెహ్రూ జైల్లో కూర్చుని కూతురికి ఉత్తరాలు రాస్తే అవి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే గ్రంథాలయ్యాయి. అందువల్ల టైం లేదనే సాకులు చెప్పకండి. ఇప్పుడు నేను చెప్పిన వారంతా పురాణాల్లోని వారుకారు, సమకాలీకులు, వీరిని ఉదహరిస్తే మీరు బాగా గుర్తుపెట్టుకుంటారు, త్వరగా స్ఫూర్తిపొందుతారని చెబుతున్నా. వీరికంటే మనం ఎక్కువ బిజీగా ఉన్నామా ? ఒక్కసారి ఆలోచించండి. ఉత్సాహం ఉండాలి కానీ టైం లేకపోవడమన్నది ఉండదు. మీలో అంతర్గతంగా ఉన్న శక్తిని వెలికితీయగలిగేది విలాసవిద్య. దానివల్ల శాంతి పొందుతారు. ఈ విద్యను మీరే వెతుక్కోవాలి. అయితే అది పాడుచేసేది మాత్రం అయి ఉండకూడదు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
ఐపీఎల్లో నేటి (మే 1) మ్యాచ్.. చెన్నైని ఢీకొట్టనున్న పంజాబ్
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- లోకం చెడ్డదేం కాదు బాస్.. హార్ట్ టచింగ్ వీడియో
- స్టార్ హీరో అజిత్ బర్త్ డే.. అద్భుతమైన గిఫ్ట్తో భార్య సర్ప్రైజ్
- కార్మిక సోదరులకు సీఎం జగన్ మే డే శుభాకాంక్షలు
- ఈసారి ఓటు మార్పు కోసమే
- మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే
- కృష్ణమ్మ తీరం విజయహారం
- వేసవిలో శునకాలు ఎందుకు రెచ్చిపోతుంటాయి?
- గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
- ఊసరవెల్లి సిగ్గుపడుతోంది!
- శభాష్ సుమతి.. ప్రయాణికుడి ప్రాణం కాపాడిన పోలీస్
Advertisement