breaking news
satrucharla parikshit raju
-
Parikshit raju: గ్రామ సర్పంచ్ నుంచి జిల్లా అధ్యక్షుడి వరకు..
సాక్షి, విజయనగరం: రానున్న 2024 సాధారణ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యంగా పని చేస్తామని పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్సార్సీపీ నూతన అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్తురాజు స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం చరిత్రాత్మక అవసరమన్నారు. పార్టీ పెద్దలు, సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేల సహకారంతో పార్టీని మరింత పటిష్టం చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. ఆయన తొలుత 2012–17 మధ్యకాలంలో చినమేరంగి గ్రామ సర్పంచ్గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా పని చేశారు. తర్వాత పార్టీ అరకు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడిగా కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా పార్టీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో శనివారం ఆయన సాక్షికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. అరకు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ పార్టీ బాధ్యుడిగా గత ఎన్నికల సమయంలో విస్తృతంగా పర్యటించాను. పారీ్టపరంగా ఆయా నియోజకవర్గాల్లో పూర్తి అవగాహన ఉంది. ఇప్పుడు వాటిలోని సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటైంది. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా గతం కన్నా ఇప్పుడు ప్రాంత విస్తీర్ణం తగ్గింది. ప్రతిబంధకాలు అంతగా ఉండవు. సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన బడలిక తగ్గుతుంది. తద్వారా పార్టీ బాధ్యతలపై మరింతగా దృష్టి పెట్టడానికి అవకాశం కలిగింది. జగనన్న ఆశయాలకు అనుగుణంగా... పార్టీ అధిష్టానం నాకు పార్వతీపురం మన్యం జిల్లా బాధ్యతలు అప్పగించడం ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి జగనన్న ఆశయాలకు అనుగుణంగా పార్టీ కోసం పనిచేయడమే ఏకైక లక్ష్యం. ఇక సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఏయే అంశాలపై దృష్టి పెట్టాలనేదీ జిల్లా అధ్యక్షులతో జరిగే సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేస్తారు. ఆ ప్రకారం జిల్లాలో పార్టీని విజయపథంలో నడిపించడానికి నా వంతు కృషి చేస్తాను. పార్టీ పెద్దలు, నాయకుల సహకారంతో... పార్వతీపురం మన్యం జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరోసారి వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యంగా పని చేస్తాను. అత్యంత సీనియర్ నాయకులైన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్గా ఉండటం మా అదృష్టం. ఆయన సూచనలు, సహకారంతో మంచి ఫలితాలు తీసుకొస్తాననే నమ్మకం ఉంది. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, డిప్యూటీ ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యేలు పుష్పశ్రీవాణి, విశ్వాసరాయి కళావతి, అలజంగి జోగారావు సహకారంతో పార్టీని మరింత పటిష్టం చేయడానికి బాధ్యత తీసుకుంటాను. ఎక్కడ అవసరమైతే అక్కడ సేవలు ప్రస్తుతం సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ.. ఈ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. వారంతా తమ తమ పరిధుల్లో పార్టీ పటిష్టతకు అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. లబ్ధిదారుల నుంచి సానుకూలత ఉంది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో పార్టీ విజయపతాకం ఎగురవేస్తుందనడంలో సందేహం లేదు. ఇక విజయ ఢంకా మోగించడమే. -
ఎంగిలి మెతుకులకు కక్కుర్తి పడం
విజయనగరం మున్సిపాలిటీ: ఎంగిలి మెతుకులకు కక్కుర్తిపడే మనుషులం తాము కాదని, పదవులకు, పచ్చనోట్లకు లొంగే ప్రసక్తే లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి, కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి భర్త శత్రుచర్ల పరీక్షిత్రాజు స్పష్టం చేశారు. ఫ్యాన్ గుర్తుపై పోటీ చేసి గెలిచిన తన భార్యతోపాటు కుటుంబం, నియోజకవర్గ ప్రజలంతా జగన్మోహన్రెడ్డి వెంటే నడుస్తామన్నారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా శత్రుచర్ల కుటుంబమంతా వైఎస్సార్సీపీలోనే ఉంటుందన్నారు. అవసరమైతే పదవులైనా వదులుకుంటాం గానీ, జగన్మోహన్రెడ్డిని వీడేది లేదన్నారు. తమపై విశ్వాసముంచి కురుపాం ఎమ్మెల్యే సీటిచ్చిన జగన్ రుణం తీర్చుకుంటామని చెప్పారు. బొబ్బిలి ఎమ్మెల్యే పార్టీ మారుతున్న నేపథ్యంలో తమపై వస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఫ్యాన్గుర్తుపై పోటీ చేసి గెలిచినవారు నియోజకవర్గం అభివృద్ధి పేరుతో అధికారపార్టీలోకి చేరటం దారుణమన్నారు. భవిష్యత్లో వైఎస్సార్సీపీ అధికారంలోకొస్తే టీడీపీ తరపున పోటీ చేసి గెలిచిన వారంతా పార్టీ మారిపోతారా? అని ప్రశ్నించారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి గెలిచిన ఎమ్మెల్యేలు వెళ్లిపోతే ప్రతిపక్షం ఎక్కడుంటుందని, ప్రజాస్వామ్య ప్రభుత్వానికి అర్థం ఏముంటుందని ఆవేదన వెలిబుచ్చారు. రోజుకొక మాట, పూటకొక అబద్ధం చెప్పే చంద్రబాబు మాటల్ని ఎలా నమ్ముతున్నారో అర్థం కావట్లేదన్నారు. వచ్చేఎన్నికల్లో కురుపాం నుంచి గతంలో సాధించిన మెజార్టీకన్నా అత్యధిక మెజార్టీతో గెలిచి తీరుతామని ధీమా వెలిబుచ్చారు. స్వయానా సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి, జిల్లాలోని ఎమ్మెల్సీలు తిష్టవేసినా నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ గెలుపును ఆపలేరన్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్కృష్ణ రంగారావు, బేబీనాయనలు తమకు అత్యంత సన్నిహితులని, వారు పార్టీ మారటం బాధకలిగించిందనీ శత్రుచర్ల చెప్పారు. వారు తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సమావేశంలో సంగంరెడ్డి బంగారునాయుడు, ఎం.ఎల్.ఎన్.రాజు పాల్గొన్నారు.