breaking news
sathyasaibaba
-
ప్రేమమూర్తికి హృదయాంజలి
-
జనహితం .. సత్యసాయి అభిమతం!
నేడు బాబా జయంతి పుట్టపర్తి టౌన్ : సమత..మమత..మానవత్వం ఈ మూడు కలగలిపిన స్వరూపమే సత్యసాయి బాబా. సత్యం, ధర్మం, శాంతి ప్రేమ..అనే విలువలను బోధిస్తూ మనిషిలో దాగి ఉన్న మానవత్వాన్ని నిద్రలేపిన సత్యసాయి.. ధీనులకు నిస్వార్థ సేవలు అందించి సేవకు ప్రతి రూపంగా నిలిచారు. ఆధ్యాత్మిక బోధనలతో తన భక్త కోటిని ముక్తిమార్గం వైపు పయనింపజేసి, భగవత్ స్వరూపుడయ్యారు.దాహం కేకలు పెడుతున్న కరువు సీమ ప్రజల దాహార్తి తీర్చి అపరభగీరథుడయ్యారు. పేదరికం ఓ వైపు.. రోగాలు మరోవైపు.. చుట్టుముట్టి పేదలు వైద్యానికీ నోచుకోని వారికి ఖరీదైన వైద్యం అందిస్తూ ‘వైద్యో నారాయణుడు’ అయ్యారు. ప్రకృతి విలయం ధాటికి ‘గూడు’ చెదిరిన ఎందరో నిరాశ్రయులను చేరదీసి అను‘గృహం’ కల్పించి, వారిపాలిట ఆపద్బాంధవుడిగా నిలిచారు. విలువలతో కూడిన విలువైన విద్యను కేజీ టు పీజీ వరకు ఉచితంగా అందిస్తూ వేలాది కుటుంబాల్లో అక్షరజ్యోతులు వెలిగించారు. ‘మానవ సేవయే ..మాధవ సేవ’ అన్న నినాదంతో మానవాళి శ్రేయస్సు కోసం సత్యసాయి అందించిన సేవలు అజరామరం.. అజేయం. అభాగ్యుల ఆరోగ్య ప్ర‘దాత’ : వైద్యసేవలకు నోచుకోని పుట్టపర్తి ప్రాంత ప్రజలకు ‘వైద్యం’ అందించే లక్ష్యంతో సత్యసాయి తన 30వ ఏట 1956 ఆక్టోబర్ 4న ఉచితంగా వైద్యం అందించే జనరల్ ఆస్పత్రిని నిర్మించారు. ఇందులో 94 పడకలు, 2 అపరేషన్ థియేటర్లు, 8 వార్డులు, జనరల్ మెడిసిన్, సర్జన్కు సంబంధించి చిన్నిపిల్లల విభాగం, కన్ను, ముక్కు, చెవి, దంతవైద్యం, స్త్రీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందిస్తున్నారు. సిమ్స్ ద్వారా ఖరీదైన వైద్యసేవలు వైద్యం వ్యాపార వస్తువుగా మారిన ఈ రోజుల్లో నయాపైసా తీసుకోకుండా అన్ని వైద్యసేవలు అందించే ఆసుపత్రి ఉందంటే సంభ్రమాశ్చర్యాలకు గురికాకతప్పదు. ఇంతటి గొప్ప ఖ్యాతిని పుట్టపర్తి సమీపంలోని ప్రశాంతి గ్రాం వద్ద నిర్మించిన సత్యసాయి సూపర్స్పెషాలిటీ సత్యసాయి 91వ జయంత్యుత్సవాల్లో సిమ్స్ రజతోత్సవం వైభవంగా జరుపుకుంది. - సత్యసాయి 1991 నవంబర్ 22న ప్రశాంతి గ్రాం వద్ద ఉచితంగా ఆధునిక సౌకర్యాలతో వైద్యసేవలు అందించే లక్ష్యంతో సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ను నిర్మించారు. దీన్ని అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు చేతులు మీదుగా ప్రారంభింపజేశారు. - 300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆస్పత్రిలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 8 అపరేషన్ థియేటర్లు, ఆధునిక వైద్యపరికరాలు అందుబాటులో ఉన్నాయి. గెండె, కిడ్నీలు, కంటి జబ్బులు, ఎముకల శస్త్ర చికిత్సలు, అత్యవసర వైద్యం , ప్లాస్టిక్ సర్జరీ, రేడియాలజీ తదితర విభాగాల్లో శస్త్ర చికిత్సలు అందిస్తున్నారు. - ఈ ఆస్పత్రి ద్వారా ఇప్పటికి 43 లక్షల మందికి వైద్య చికిత్సలు అందించారు. ఇందులో 3.2 లక్షల మందికి శస్త్ర చికిత్సలు చేశారు. - బెంగళూరులోని వైట్ఫీల్డ్ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ పేరిట 306 పడకల సూపర్స్సెషాలిటీ ఆస్పత్రి నెలకొల్పారు. 2001లో అప్పటి ప్రధాని వాజ్పేయి ఆస్పత్రిని ప్రారంభించారు. - బెంగళూరులోని వైట్ఫీల్డ్లో మహిళలు, పిల్లలకు సేవలు అందించేందుకు మరో జనరల్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. తొలుత 30 పడకలు ఉండగా ప్రస్తుతం 50 పడకలుగా అభివృద్ధి చేశారు. సత్యసాయి ‘సంచార’ వైద్యం : మారుమూల ప్రాంతాలకు సరైన రోడ్డు సౌకర్యాలు లేక ఆస్పత్రులకు రాలేక వైద్యసేవలు పొందలేకపోతున్న విషయాన్ని గ్రహించిన సత్యసాయి.. సత్యసాయి సంచార వైద్యసేవల పేరిట వైద్యసేవలు అందిస్తున్నారు. 2006 మార్చి 30న సత్యసాయి సంచార వైద్య సేవలను సత్యసాయి ప్రారంభించారు. ఆధునిక వసతులున్న మొబైల్ వాహనం పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు, ఓడీసీ, చెన్నేకొత్తపల్లి, నల్లమాడ మండలాల్లో 12 నోడల్ పాయింట్ల ద్వారా 63 గ్రామాల ప్రజలకు ఉచిత వైద్యసేవలను అందిస్తున్నారు. అదేవిధంగా మరో 400 గ్రామాల ప్రజలు వైద్యసేవలు పొందుతున్నారు. ప్రతి నెలా 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 12 నోడల్ పాయింట్లకు వెళ్లి మొబైల్ వాహనం వెళ్తుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 16 జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సైతం సంచార వైద్యసేవలు అందిస్తున్నారు. అపర భగీరథుడు సత్యసాయి : వరుస కరువు, ఫ్లోరైడ్ రక్కసి వెరసి గుక్కెడు నీళ్లు దొరక్క గొంతెండిన అనంతపురం జిల్లా వాసుల దాహం తీర్చేందుకు రూ.500 కోట్ల వ్యయంతో సత్యసాయి తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. సత్యసాయి తాగునీటి పథకం ద్వారా జిల్లాలోని 1447 గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా సుమారు 3,200 కిలో మీటర్లు మేర పైప్లైన్ వేయించారు. బాబా తన 75వ జన్మదినం కానుకగా అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులమీదుగా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో 18 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు,136 గ్రౌండ్ లెవెల్ రిజర్వాయర్లు, 2350 ఓవర్హెడ్ ట్యాంకులను నిర్మించారు. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాలో సైతం 141 గ్రామాలకు, మెదక్ జిల్లాలో 179 గ్రామాలకు, తూర్పుగోదావరిలో 220, పశ్చిమగోదావరి జిల్లాలో 230 గ్రామాలకు రక్షిత మంచినీరు అందిస్తున్నారు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాజధాని చెన్నై నగరం దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన తెలుగుగంగ, కండలేరు కాలువల నిర్మాణానికి సత్యసాయి రూ.250 కోట్ల సహాయం అందించారు. ‘పర్తి’ ప్రాంతానికి ‘వరం’ సత్యసాయి తాగునీటి పథకం : పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు గ్రామాలకు వరం సత్యసాయి తాగునీటి పథకం సత్యసాయి నిర్యాణం అనంతరం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆయన ఆశయాలను కొనసాగింపుగా పుట్టపర్తి, కొత్తచెరవు, బుక్కపట్నం మండలాల పరిధిలో మరో 126 గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూ.90 కోట్ల పైబడి వ్యయంతో తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. వేలాది కుటుంబాల్లో ‘విద్యాజ్యోతులు’ : సత్యసాయి వేలాది కుటుంబాల్లో విద్యాజ్యోతులు వెలిగిస్తున్నారు. కేజీ నుంచి పీజీ వరకు విలువలతో కూడిన ఉచిత విద్యను అందించాలన్న లక్ష్యంతో సత్యసాయి 1981లో సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లర్నింగ్ను ఏర్పాటు చేశారు.ఈ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రశాంతి నిలయం క్యాంపస్, అనంతపురంలో సత్యసాయి మహిళా క్యాంపస్, బెంగళూరులోని బృందావన్ క్యాంపస్, మద్దనహళ్లి క్యాంపస్ల ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారు. ఏడు విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), ఐదు విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ), మూడు ప్రొఫెషనల్ కోర్సులు యూనివర్శిటీ ద్వారా అందిస్తున్నారు. మానవతా విలువలు, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను, జీవనోపాధులు మెరుగు పరిచేందుకు ప్రాచీన గురుకుల విద్యావిధానంలో విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. సత్యసాయి యునివర్శిటీకి 1986లో ఇండియన్ యూనివర్శిటీ అసోసియేషన్లో శాశ్వత సభ్యత్వం లభించింది. 2008లో సత్యసాయి డీమ్డ్ యునివర్శిటీ సత్యసాయి యునివర్శిటీగా అవతరించింది. ఆధునిక ఆలయాలను పోలిన నిర్మాణంలో సత్యసాయి యునివర్శిటీ భవనం పుట్టపర్తిలో ఎద్దుల కొండపై దర్శనమిస్తుంది. నిరాశ్రయులకు ఆపన్న హస్తం : ప్రపంచంలో ఏ మూల ప్రకృతి విపత్తులు సంభవించినా అక్కడ సత్యసాయి సేవాసంస్థలు వాలిపోయి సేవా కార్యక్రమాలను చేపడుతున్నాయి. సత్యసాయి ట్రస్ట్ ద్వారా వరద బాధితులకు ఆపన్నహస్తం అందించారు. 2008లో ఒడిశాలో భారీ వరదలు రావటంతో పలువురు నిరాశ్రయులుగా మిగిలారు. ఆపదలో చిక్కుకున్న వారికి అండగా నిలుస్తూ సత్యసాయి ట్రస్ట్ నాలుగు జిల్లాల్లో 750 మందికి పక్కాగృహాలను నిర్మించింది. సుమారు ఒక్కో గృహానికి రూ.1.30 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందించారు. దేశంలో జరిగిన గుజరాత్ భూకంప, ఉత్తరాఖండ్ వరదలతోపాటు, ఇటీవల రాష్ట్రంలో సంభవించిన హుదూద్ తుఫాను విలయం సమయంలనూ సత్యసాయి సేవాదళ్ సేవలను అందించారు. దేశంలోనే కాకుండా ఇండోనేషియా, జపాన్లలో సునామీలు సంభవించిన సమయంలో సత్యసాయి సేవాదళ్ బాధితులకు సేవలను అందించారు. గ్రామసేసే.. రామ సేవ : సామాజిక అవసరాలైన కూడు, గుడ్డకు నోచుకోలేని వారికి ఒక్క పూటైనా ‘అన్నం’ పెట్టాలన్న మానవతాహృదయంతో ‘ సత్యసాయి గ్రామసేవ’ 2000లో ప్రారంభించారు. ప్రతి ఏటా దసరా పర్వధిన వేడుకలను పురస్కరించుకుని పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాలకు చెందిన 150 గ్రామాల్లో సుమారు 55 వేల కుటుంబాలకు అన్నప్రసాదాలు , నూతన వస్త్రాలను అందిస్తున్నారు. సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులలో సేవాభావాన్ని పెంపొందించే విధంగా ఈ కార్యక్రమంలో వారిని భాగం చేస్తూ నిర్వహించడం విశేషం. 16 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్విగ్నంగా సాగుతోంది. సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు 50 వాహనాల్లో వెళ్లి గ్రామీణులకు అన్నప్రసాదాలు అందజేస్తారు. -
నేటి నుంచి సత్యసాయి జయంతి వేడుకలు
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు, భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక వైద్య శిబిరాలు, తాగునీటి కేంద్రాలు పుట్టపర్తి టౌన్ : సత్యసాయి బాబా 91వ జయంతి వేడుకలు శుక్రవారం నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్లు ఇప్పటికే భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేపట్టాయి. దేశ, విదేశాల నుంచి వేడుకల్లో పాల్గొనేందుకు భక్తులు తరలిరానుండడంతో ఎటువంటి అసౌకర్యం కలుగ కుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, ప్రత్యేక వైద్యశిబిరాలు, తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేపడుతున్నారు. ప్రత్యేక నిఘా.. జయంతి వేడుకల కోసం పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతోపాటు, పుట్టపర్తి పరిసర ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పుట్టపర్తి పట్టణ డీఎస్పీ ముక్కా శివరామిరెడ్డి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వేడుకల జరిగే రోజుల్లో నిరంతర పర్యవేక్షించేందుకు గోకులంలోని డీఎస్పీ గెస్ట్ హౌస్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి 400 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని భద్రతా ఏర్పాట్లకు కేటాయించారు. భద్రతా ఏర్పాట్ల కోసం విచ్చేసిన సిబ్బందికి గురువారం సాయంత్రం గోకులంలోని డ్వాక్రా బజార్ వద్ద డీఎస్సీ ముక్కాశివరామిరెడ్డి సమీక్ష నిర్వహించి, భద్రతా ఏర్పాట్లపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేడుకల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 25 మంది ఎస్ఐలు, 350 మంది సిబ్బందిని నియమించామన్నారు.ఇందులో రద్దీ నియంత్రణకు రోప్పార్టీలు, ట్రాఫిక్ కంట్రోల్ పార్టీలు, సెక్యురిటీ, పెట్రోలింగ్, డాగ్స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ స్వాడ్లు విధులు నిర్వహిస్తున్నారన్నారు. అలాగే సత్యసాయి సూపర్స్పెషాలిటీ ఆసుపత్రి, కర్ణాటక నాగేపల్లి, పుట్టపర్తి బస్ డిపో వద్ద చెక్పోస్ట్లు ఏర్పాటు చేశాన్నారు. ప్రత్యేక వైద్య సౌకర్యాలు వైద్య ఆరోగ్య శాఖ అధ్వర్యంలో పలు ప్రాంతాల్లో భక్తుల కోసం ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాట్లు చేపట్టారు. ఈ ఏర్పాట్లు శుక్రవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం 17 మంది వైద్యులు, 63 మంది సిబ్బందిని నియమించారు.ఒక 104, రెండు 108 వాహనాలతోపాటు మొబైల్ టీంను సిద్దంగా ఉంచారు. పారిశుద్ధ్య చర్యలు భక్తుల సౌకర్యార్థం నగర పంచాయతీ అధికారులు, కమిషనర్ విజయభాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. ఎనుములపల్లి మార్కెట్ వద్ద సత్యసాయి మైదానం, కమ్మవారిపల్లి చింతతోపుల వద్ద, కర్ణాటక నాగేపల్లి వద్ద వాహనదారుల కోసం పార్కింగ్ స్థలాలను సిద్ధం చేస్తున్నారు.పట్టణంలోని హనుమాన్ సర్కిల్, విద్యాగిరి, గోకులం, చిత్రావతి రోడ్డు, సంగీత కళాశాల, చిత్రావతి ఘాట్, వెస్ట్గేట్, తహశీల్దార్ కార్యాలయం, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక బస్సులు.. భక్తుల కోసం ఆర్టీసీ వివిధ ప్రధాన నగరాల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసిందని పుట్టపర్తి డీఎం రమణయ్య తెలిపారు. ప్రధానంగా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, చెన్నై నగరాల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నామన్నారు.ధర్మవరం, పుట్టపర్తి రైల్వేష్టేషన్ల నుంచి ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామన్నారు. వేడుకల కోసం ప్రత్యేకకంగా 135 ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశాన్నారు. వేణుగోపాల్ స్వామి రథోత్సవంతో వేడుకలు ప్రారంభం సత్యసాయి 91వ జయంతి వేడుకలు శుక్రవారం వేణుగోపాల స్వామి రథోత్సవంతో ఘనంగా ప్రారంభం కానున్నాయి.వేడుకల కోసం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సత్యసాయి మహాసమాధిని, సాయికుల్వంత్ సభా మందిరాన్ని సర్వం సిద్దం చేశారు. ప్రశాంతి నిలయం ఉత్తర గోపురాన్ని ప్రత్యేకంగా అలకంరించారు. ఉదయం 8 గంటలకు ఉత్తర గోపురం వద్ద రథోత్సవాన్ని సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ప్రారంభించనున్నారు. తొలుత పెదవెంకమరాజు కల్యాణమండపం వద్ద ప్రత్యేకంగా అలంకరింపబడిన రథాన్ని ప్రశాంతి నిలయం ఉత్తర గోపురం వద్దకు తీసుకువచ్చి, సాయికుల్వంత్ సభా మందిరంలోని సత్యసాయి మహాసమాధి చెంత ఉత్సవమూర్తులైన వేణుగోపాల్ స్వామి, సీతారామలక్ష్మణుల విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చి రథోత్సవాన్ని ప్రారంభించనున్నారు.