breaking news
ravishanker
-
అదే సినిమాకి ప్లస్ అయ్యింది: డైరెక్టర్ పరశురాం
‘‘దేశ ప్రజలందరికీ కనెక్ట్ అయ్యే కథ ‘సర్కారువారి పాట’. బ్యాంకింగ్ సెక్టార్, ఈఎంఐతో ఇబ్బందిపడని మధ్య తరగతి మనిషి ఉండరు. అలాంటి పాయింట్ని మహేశ్గారి లాంటి సూపర్ స్టార్తో చెప్పించడం సినిమాకి ప్లస్ అయ్యింది. రచయితగా, దర్శకుడిగా ఈ సినిమా నాకు తృప్తినిచ్చింది. మా సినిమాకి ప్రీమియర్ షో నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి బ్లాక్ బస్టర్ స్పందన రావడం ఆనందంగా ఉంది. మహేశ్గారి ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్, ఫ్యామిలీ ఆడియన్స్, మాస్, క్లాస్.. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులకు మా సినిమా నచ్చింది’’ అని పరశురాం అన్నారు. చదవండి: బాలీవుడ్పై మహేశ్ కామెంట్స్, స్పందించిన బోనీ కపూర్, ఆర్జీవీ మహేశ్బాబు, కీర్తీ సురేష్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారువారి పాట’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ సినిమా గురువారం (మే 12) విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిర్వహించిన ‘బ్లాక్ బస్టర్ మీట్’లో నవీన్ ఎర్నేని మాట్లాడుతూ.. ‘‘మా రెండేళ్ల కష్టం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్తో ఎగిరిపోయింది. అమెరికాలో ప్రీమియర్లో మిలియన్ డాలర్స్ని కలెక్ట్ చేసి నాన్ ‘ఆర్ఆర్ఆర్’ రికార్డులన్నీ క్రాస్ చేసింది’’ అన్నారు. వై. రవిశంకర్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడంతా పాన్ ఇండియా సినిమాలైపోయాయి. పూర్తిగా తెలుగులో ‘సర్కారువారి పాట’ లాంటి పెద్ద సినిమా మళ్లీ చూడగలమా? అంటే సందేహమే’’ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ‘సర్కారు వారి పాట’ మూవీ చూసిన దర్శకేంద్రుడు, ఏమన్నారంటే -
తప్పు ఎవరు చేసినా ఉపేక్షించం
-
'జైలుకైనా వెళ్తాం కానీ రూపాయి కూడా చెల్లించం'
ఢిల్లీ: ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనం నిర్వహణ కోసం యమునా నదీ పరిసర ప్రాంతాల్లో పర్యావవరణానికి హాని కలిగించారన్న కారణంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.. శ్రీశ్రీ రవిశంకర్ నేతృత్వంలోని 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' సంస్థకు 5 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. కార్యక్రమ ప్రారంభానికి ముందుగానే ఈ జరిమానాను డిపాజిట్ చేయాలని గ్రీన్ ట్రీబ్యునల్ ఆదేశాలలో పేర్కొంది. అయితే దీనిపై శ్రీశ్రీ రవిశంకర్ గురువారం జాతీయ మీడియాతో మాట్లాడుతూ అవసరమైతే జైలుకైనా వెళ్తాం కానీ ఒక్క రూపాయి కూడా చెల్లించబోం అని స్పష్టం చేశారు. యమునా నదీ పరిసరాల్లో చేసిన ఏర్పాట్లన్ని తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేసినవే అని, కార్యక్రమం ముగిసిన అనంతరం వాటిని తొలగిస్తామని ఆయన వెల్లడించారు. ప్రపంచ సాస్కృతిక సమ్మేళనం ప్రైవేటు కార్యక్రమం కాదని, లక్షలాది మంది హాజరౌతున్న ఈ కార్యక్రమాన్ని వ్యక్తిగత కార్యక్రమంగా చూడొద్దని శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు.