breaking news
Ravikumar reddy
-
సిట్బెల్ట్ పెట్టుకోలేదని కొట్టారు
-
'అనంత'లో వైఎస్ఆర్ సీపీ నేతపై ఎస్ఐ దాడి
అనంతపురం(నల్లచెరువు): అనంతపురంలో వైఎస్సార్సీపీ శ్రేణులపై వేధింపులు ఆగడంలేదు. రక్షణగా ఉండాల్సిన పోలీసులు అధికారపార్టీ అండ చూసుకుని చెలరేగిపోతున్నారు. తాజాగా..నల్లచెరువులో వైఎస్సార్సీపీ సర్పంచ్ రవికుమార్ రెడ్డిపై ఎస్ఐ నరేంద్రభూపతి దాడి చేశారు. రవి మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తన పొలం నుంచి ఇన్నోవా కారులో వస్తుండగా సీటు బెల్టు ఎందుకు పెట్టుకోలేదని నానా బూతులు తిట్టాడు. ఇదేమిటి అని అడిగిన రవిపై ఎస్ఐ చేయిచేసుకున్నాడు. కారును పాక్షికంగా ధ్వంసం చేశాడు. ఊరు వదిలి వెళ్లకపోతే నీ అంతు చూస్తానని ఎస్ఐ బెదిరించాడు. గాయాలైన రవి కదిరి ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. వైఎస్సార్సీపీ కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా బుధవారం ఉదయం రవిని పరామర్శించారు. సర్పంచ్ పై దాడిని ఆయన ఖండించారు. -
కనుపాపకు ఎంత కష్టం
రోజూ నగరంలో కంటి సమస్యలతో వైద్యుల వద్దకు వెళుతున్న వారు 5,000 ఇందులో గాలి, రసాయన కాలుష్యాల కారణ బాధితులు 500 ఎక్కువగా ఇలాంటి బాధితులు 18 నుంచి 35 ఏళ్ల లోపువారే పొల్యూషన్ వల్ల దీర్ఘకాలిక కంటిసమస్య మారిన బాధితుల సంఖ్య ఏటా 15 వేలు ఇందులో అబ్బాయిలే 70 శాతం మంది. నయనం ప్రధానం. కానీ నగర జీవి కంటిపాపకు కష్టకాలమొచ్చింది. ఇది ఎంత వేగంగా అంటే మనకు ఏం జరుగుతోందో తెలిసే లోపే చూపు మసకబారుతోంది. ఇంటికెళితే చికాకు. ఆఫీసుకొస్తే అలసట. ఆఫీసు పనులతో మానసిక ఒత్తిడి. ప్రయాణం చేయడంతో కంటిపాపపై ఒత్తిడి. ఇదీ నగరంలో లక్షలాది మంది యువతీయువకుల పరిస్థితి. కంటి బాధితులు మిగతా ఏరంగంలో పెరగనంతగా పెరుగుతున్నారు. కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడం వారిని తిన్నగా అంధత్వం దిశగా నెడుతోంది. అరవై ఏళ్లకు చత్వారం వస్తుందంటారు. కానీ ముప్ఫై దాటాయో లేదో కళ్లకు అద్దాలు. నలభై దాటితే చత్వారం. యాభైలో మరింత దారుణం. ప్రతి వందమంది కంటి బాధితుల్లో నగరంలో పొగలు, దుమ్మూ ధూళితో వస్తున్న కంటివ్యాధుల బాధితులు కనీసం 15 శాతం దాటారు. పొగల సెగలు కంటిపాపను ఛిద్రం చేస్తున్న తీరుపై డాక్టర్లే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీస జాగ్రత్తలు పాటిస్తే కొంతవరకైనా కంటిని కాపాడుకోవచ్చునని ప్రముఖ కంటి వైద్య నిపుణులు డా.రవికుమార్రెడ్డి చెబుతున్నారు. ఇలా మొదలవుతున్నాయ్ కంటిపాప కష్టాలు - నగరంలో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు కంటి వ్యాధులకు గురవుతున్నారు. - ప్రధానంగా రెండు రకాల ఇబ్బందులు కంటివ్యాధులకు కారణమవుతోంది - వెజిటబుల్ మెటీరియల్...అంటే వృక్ష సంబంధిత లేదా జంతు సంబంధిత రేణువులు. - వాహనాల నుంచి వచ్చే రసాయన ధూళి. కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, ఓజోన్, సల్ఫర్ డయాక్సైడ్ తదితరం - ఈ రెండు రకాల కారణాల వలన ప్రతి వందమందికీ పదిహేను మంది ఏడాదికి రెండు మూడు సార్లు కంటి వైద్యుల దగ్గరకు వెళుతున్నారు - ప్రధానంగా వీటి వలన కళ్లకలక, ఇన్ఫెక్షన్, కార్నియల్ అల్సర్ తదితరం వస్తున్నాయి - కళ్లు ఎరుపుగా మారడం, కళ్లనుంచి పదే పదే నీళ్లు కారడం వస్తున్నాయి - కళ్లలో ఇరిటేషన్, అలర్జీ, కళ్లు డ్రై అవడం అంటే పొడిబారడం జరుగుతుంది - ఇలాగే కొన్నేళ్ల తర్వాత కళ్లు మసకబారడం జరుగుతుంది - ఆ తర్వాత కొన్నేళ్లలో కంటిచూపు తగ్గుతూ వస్తుంది - ఎయిర్ పొల్యూషన్, కెమికల్ పొల్యూషన్ వల్ల కంటిలో నల్లగుడ్డుపై ఎరిటియం అనే కండరం పెరుగుతుంది. ఇది తిన్నగా చూపును తగ్గిస్తుంది కొద్ది పాటి జాగ్రత్తలు పాటిస్తే - ద్విచక్ర వాహనదారులు ప్రయాణం చేస్తున్నప్పుడు రక్షణగా అద్దాలు (ప్రొటెక్టివ్ గ్లాసెస్) ధరించడం వలన కళ్లను గాలి పొల్యూషన్ నుంచి కాపాడుకోవచ్చు - అద్దంతో కూడిన హెల్మెట్ కవర్ను ధరించడం మంచిదే - ఇంటినుంచి ఆఫీసుకు వెళ్లగానే మంచినీళ్లతో కళ్లను కడుక్కోవడం మంచిది - అలాగే ఆఫీసునుంచి ఇంటికి వచ్చినప్పుడు కూడా మంచినీళ్లతో కళ్లను కడుక్కోవాలి - ప్రయాణం చేసి కొద్దిగా కంటికి ఇబ్బందిగా ఉన్నప్పుడు లూబ్రికెంట్ డ్రాప్స్ వేసుకోవచ్చు - పదే పదే కళ్లతో బాధపడుతూంటే వైద్యుల సలహా మేరకు యాంటిబయోటిక్ చుక్కలు వేసుకోవచ్చు. - ద్విచక్రవాహనంలో తిరిగే వారు ప్రతి ఆరుమాసాలకు కంటి వైద్యులను సంప్రదించడం మంచిది - ద్విచక్ర వాహనంలో వెళ్తున్నప్పుడు చిన్నపిల్లలను ఎలాంటి కళ్లద్దాలుగానీ, హెల్మెట్గానీ లేకుండా ముందువైపు కూర్చోపెట్టద్దు. - ఎక్కువగా పెద్ద పెద్ద చౌరస్తాల్లో ట్రాఫిక్ జామ్ అయినప్పుడు కళ్లకు ఎఫెక్ట్ అయ్యే పొగలు వెలువడున్నాయి. వీలైనంత వరకూ ఇలాంటి చౌరస్తాల గుండా వెళ్లడం తగ్గించాలి - డా. రవికుమార్రెడ్డి కంటివైద్య నిపుణులు, మెడివిజన్ హాస్పిటల్ మెహిదీపట్నం -
తాగునీటికే ప్రాధాన్యం
ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి వేంపల్లె : జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి తెలిపారు. ఎంపీపీ రవికుమార్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు షబ్బీర్వల్లి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డితో కలసి మంగళవారం ఆయన వేంపల్లె మండలం ముతుకూరు, నందిపల్లె, కత్తలూరులో పర్యటించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల వేంపల్లె మండల నాయకులతో సమావేశమైన సమయంలో పై గ్రామాల్లో తలెత్తిన తాగునీటి ఎద్దడి, సిమెంట్ రోడ్ల అవసరాన్ని వారు వివరించారు. ఈ నేపథ్యంలో ఎంపీ ఆ గ్రామాల్లో పర్యటించారు. తాగునీటి పథకాన్ని ఆయన నిచ్చెన ఎక్కి స్వయంగా పరిశీలించారు. తరువాత పరిస్థితిపై ఆర్డబ్ల్యూఎస్ డీఈ శేషఫణి, ఏఈ ఖాదర్బాషాతో చర్చించారు. సమస్య పరిష్కారానికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చాలా గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందన్నారు. వాటి పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని ప్రకటించారు. ఎంపీటీసీ సభ్యులు ఎన్.గంగిరెడ్డి, కె.వెంకటేశ్, సర్పంచ్లు ఆర్ఎల్వీ ప్రసాద్రెడ్డి, మునెమ్మ, సింగిల్విండో ఉపాధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, సింగిల్ విండో డెరైక్టర్ నాగిరెడ్డి పాల్గొన్నారు.