breaking news
Rajshri
-
అంగరంగ వైభవం.. రాజా, రాజిల వివాహం..
కళకళలాడిన ఆర్ట్స్ కళాశాల మైదానం వధూవరుల్ని ఆశీర్వదించిన ప్రముఖులు వరుడు జక్కంపూడి రాజాను ఆశీర్వదించిన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో జక్కంపూడి విజయలక్ష్మి, సింధుసహస్ర, కొత్తపల్లి భుజంగ రాయుడు, సుబ్బారాయుడు తదితరులు (అంతర చిత్రం) వధూవరులను అభినందిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల, ఆమె భర్త అనిల్కుమార్ మాజీమంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహనరావు, వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మిల పెద్ద కుమారుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి రాజాకు, ద్రాక్షారామ వాస్తవ్యులు గంధం నారాయణరావు, అన్నపూర్ణ దంపతుల కుమార్తె రాజశ్రీ(రాజీ)తో శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. వరుడు రాజాను ఆయన నివాసంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉదయం ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకకు వేలాదిగా ప్రజానీకం హాజరయ్యారు. ఆల్కాట్తోట (రాజమండ్రి) : మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహనరావు, వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మిల జ్యేష్టకుమారుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి రాజా, ద్రాక్షారామ వాస్తవ్యులు గంధం నారాయణరావు, అన్నపూర్ణ దంపతుల కుమార్తె రాజశ్రీల వివాహం శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. అలనాటి సంప్రదాయాలను గుర్తుకు తీసుకువచ్చేలా రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కల్యాణవేదికపై రాజా, రాజి వివాహబంధంతో ఒక్కటయ్యూరు. వరుడు రాజా ఇంటి నుంచి గుర్రపుబగ్గీపై ఊరేగింపుగా కల్యాణవేదికకు చేరుకోగా, ఆయన వెంట ఎద్దుల బండ్లపై పెండ్లి సామాన్లు తీసుకు వచ్చారు. పెండ్లికుమార్తె రాజశ్రీని పల్లకిలో ఊరేగింపుగా కల్యాణవేదిక వద్దకు తోడుకుని వచ్చారు. వివిధ పార్టీల నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు, ఆత్మీయబంధుమిత్రులు వివాహ వేడుకకు హాజరై నవవధూవరులపై అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వివాహానికి వచ్చిన జనవాహినితో కళాశాల మైదానం కిక్కిరిసింది. ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జక్కంపూడి వారి ఇంటికి చేరుకుని వరుడు రాజాను అక్షింతలు వేసి ఆశీర్విదించారు. ఆయన సుమారు గంటపాటు జక్కంపూడి కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీ నేతలు విజయసాయిరెడ్డి, షర్మిల, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, బ్రదర్ అనిల్కుమార్, వైఎస్సార్ సీపీ శాసన సభాపక్ష ఉపనేత, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, వంతల రాజేశ్వరి, చిర్ల జగ్గిరెడ్డి, తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, బొడ్డు భాస్కరరామారావు, మాజీ మంత్రులు పిల్లి సుభాష్చంద్రబోస్, కొత్తపల్లి సుబ్బారాయుడు, బొత్స సత్యనారాయణ, పినిపే విశ్వరూప్, మెట్ల సత్యనారాయణరావు, మాజీ ఎంపి గిరజాల వెంకటస్వామినాయుడు, ఉండవల్లి అరుణకుమార్, బుచ్చిమహేశ్వరరావు, జి.వి.హర్షకుమార్, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఆళ్ళనాని, కారుమూరి నాగేశ్వరరావు, తానేటి వనిత, గ్రంధి శ్రీ నివాస్, పెండెందొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, నల్లమిల్లి శేషారెడ్డి, పాముల రాజేశ్వరి, బండారు సత్యానందరావు, అల్లూరు కృష్ణం రాజు, జీఎస్ రావు, వంగా గీత, వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధులు అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, సినీనటులు సుమన్, ఆలీ, దర్శకుడు వి.వి.వినాయక్, జిల్లా పరిషత్ ప్రతిపక్షనేత జ్యోతుల నవీన్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు, వంకా రవీంద్రనాథ్, నియోజకవ ర్గ కన్వీనర్లు ఆకుల వీర్రాజు, వల్లూరి పట్టాభిరామారావుచౌదరి, కొండేటి చిట్టిబాబు, బొంతు రాజేశ్వరరావు, తోట సుబ్బారావునాయుడు, రాజమండ్రి నగరపాలక మండలి ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిళారె డ్డి, పార్టీ రాష్ట్రకార్యదర్శులు కర్రి పాపారాయుడు, మిండగుదిటి మోహన్, నక్కా రాజబాబు, భూపతిరాజు సుదర్శనబాబు, వట్టికూటి రాజశేఖర్, దూలం వెంకన్నబాబు, రాయపురెడ్డి చిన్న, మింది నాగేంద్ర, వివిధ విభాగాల చైర్మన్లు అనంత ఉదయభాస్కర్(బాబు), పెట్టాశ్రీనివాస్, మండపాక అప్పన్నదొర, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ, రాష్ట్ర సేవాదళ్ ప్రధానకార్యదర్శి సుంకర చిన్ని, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శులు పోలు కిరణ్మోహన్రెడ్డి, గుర్రం గౌతమ్, సీజీసీ మాజీ సభ్యులు గంపల వెంకటరమణ, పార్టీ నాయకులు సాకా ప్రసన్నకుమార్, పి.కె.రావు, విప్పర్తి వేణుగోపాలరా వు, పెనుమత్స చిట్టిరాజు, అడపా హరి, రావి పాటి రామచంద్రరావు, శెట్టిబత్తుల రాజ బా బు, ఆదిరెడ్డి వాసు, తాడి విజయభాస్కరరెడ్డి, సత్యనారాయణచౌదరి, వాసిరెడ్డి జమీల్, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యం, రాజ మండ్రి మేయర్ పంతం రజనీ శేషసాయి, డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్, డీసీఎంఎస్ చైర్మన్ కె.వి.సత్యనారాయణరెడ్డి, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు శిరంగు కు క్కుటేశ్వరరావు, హస్తకళల అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ పంతం నానాజీ, అమలాపురం మాజీ చైర్మన్ నల్లా విష్ణు, చాంబర్ అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ, పలువురు అధికారులు, ప్రముఖులు వధూవరులను ఆశీర్వదించారు. -
అసహాయులకు అండ
సాయాల్లో బోలెడు రకాలుంటాయి. ఒక్కోసారి ‘మాట’ చేసినంత సాయం మరేదీ చేయకపోవచ్చు. ఈ సూక్ష్మాన్ని గ్రహించిన ఓ లా స్టూడెంట్ ఓ వేదికను ఏర్పాటు చేశాడు. దానికి ‘న్యాయ సహాయ’ అని పేరు పెట్టాడు. ‘వినడానికి పేరు, ఆలోచన చాలా బాగున్నాయి. కానీ ఆచరణలో మనమెంతవరకూ ‘న్యాయం’ చేయగలం’ అని మొదట సందేహించిన అతని తల్లి చివరకు బిడ్డ మాటను కాదనకుండా తన వంతు సేవకు సిద్ధ్దపడింది. తనలాంటి మరో నలుగురు సేవాభావం కలిగిన లాయర్లను సభ్యులుగా మార్చి, ‘న్యాయ సహాయ’ ద్వారా పేదలకు ఉచితంగా న్యాయ సలహాలిస్తూ చిన్న ‘మాట’ సాయం చేస్తోంది. ఐలయ్య హైదరాబాద్లోని మియాపూర్లో మేస్త్రీ పని చేసుకుంటూ భార్యాబిడ్డల్ని షించుకుంటున్నాడు. నాలుగంతస్తుల అపార్డుమెంటు పని సగం పూర్తయింది. ఒకరోజు ఐలయ్య స్లాబ్ పనిచేస్తుండగా ఉన్నట్టుండి పైకప్పు కూలి మీద పడింది. పనివాళ్లంతా కలిసి ఆసుపత్రిలో చేర్పించారు. మెదడుకి బలమైన గాయమైంది. కుడి కన్ను పూర్తిగా పోయింది. కుడి చేయి, కాలు పనిచేయడం మానేశాయి. ఆరునెలలు ఆసుపత్రిలో ఉండి వైద్యం చేయించారు. తనకు సంబంధం లేదన్న యజమానిపై కేసు పెట్టాడు ఐలయ్య. యజమాని తన ‘బలాన్ని’ చూపించి అందరి నోరూ మూయించాడు. ఐలయ్య వెళ్లి అడిగితే ‘ఏవో నాలుగు రూపాయిలిస్తాను... సరిపెట్టుకో’ అన్నాడు. చదువు లేని పేదవాడు ఏం చేస్తాడు! అంతా తన కర్మ అనుకుని భార్య సంపాదనతో నాలుగు ముద్దలు తింటూ పదేళ్ల వయసు పిల్లల భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఇంతలో ఎవరో ఐలయ్యకు ‘న్యాయ సహాయ’ గురించి చెప్పారు. ‘‘ఐలయ్యకు జరిగిన అన్యాయం గురించి విన్నాక చాలా బాధ కలిగింది. ఏడుస్తూ...‘‘అమ్మా... మీరైనా నాకు న్యాయం చేయండమ్మా... ఇద్దరు ఆడపిల్లల తండ్రిని. వారిని మంచి చదువులు చదివించుకుందామనుకున్నాను. ఇప్పుడు నా పరిస్థితి వారికి కడుపు నిండా అన్నం కూడా పెట్టలేకుండైంది’’ అని చెప్పాడు. క్షణం ఆలస్యం చేయకుండా అతనికి ముందు లీగల్ కౌన్సెలింగ్ ఇచ్చి వెంటనే లేబర్ కమిషనర్ దగ్గర కేసు పెట్టించాను. ప్రస్తుతం కేసు నడుస్తోంది. చట్ట ప్రకారం అతని యజమాని 15 నుంచి 20 లక్షలరూపాయల నష్ట పరిహారం చెల్లించాలి. ఇలాంటి కేసుల్లో బాధితుడి వయసు, సంపాదన, అతనిపై ఆధారపడ్డ వాళ్ల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని యజమానులతో కోర్టు నష్ట పరిహారం ఇప్పిస్తుంది. ఐలయ్య కేసు గెలిచే వరకూ అతనికి తగిన సలహాలిస్తూ ముందుకు నడిపించే బాధ్యత మాది’’ అని చెప్పారు లాయర్ రాజశ్రీ. కొడుకు చెప్పిన ‘న్యాయ సహాయ’ ఆలోచనను ఆచరణలో పెట్టిన తల్లి ఆమె. ‘న్యాయ సహాయ’ వేదికను ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చిన ఆ కుర్రాడి పేరు లింగం శెట్టి పారు.్థ ప్రస్తుతం ఇతను ఒరిస్సాలో నేషనల్ లా యూనివర్సిటీలో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. అతనికి అండగా నిలిచిన అమ్మ రాజశ్రీ తనతోటి వారితో కూడా ‘న్యాయ సహాయ’ గురించి చర్చించి మరో నలుగురిని సభ్యులుగా చేర్చుకున్నారు. ‘‘నాతో పాటు కల్లూరి గీత, ఎల్. స్వర్ణలత, సి. పద్మజ, ఎన్. నర్సింహారావు ఇందులో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ప్రారంభించింది కరీంనగర్లోనైనా మాకు హైదరాబాద్లో కూడా లాయర్లసాయం ఉంది. వీరితో పాటు పార్థు, స్వచ్ఛందంగా ముందుకొచ్చిన కొందరు లా విద్యార్థులు కూడా మాకు అండగా ఉన్నారు’’ అని చెప్పారు రాజశ్రీ. నిందితుల తరఫున... ‘న్యాయ సహాయ’ ఏర్పాటుకి పార్థుని కదిలించిన విషయం మన రాష్ట్రంలో వేల సంఖ్యలో జైళ్లలో మగ్గుతున్న నిందితుల సంఖ్య. వీరిలో చాలామంది కేవలం ఆరోపణలు ఎదుర్కొంటూనే నెలల తరబడి కటకటాల వెనక ఉండిపోతున్నారు. వీరి కోసం కూడా ‘న్యాయ సహాయ’ పనిచేస్తోంది. ‘‘ఇప్పటి వరకూ ఏడుగురు నిందితులకు బెయిల్ ఇప్పించాం. చాలామంది నిందితులకు నా అన్నవాళ్లు ఉండరు. అలాంటి కేసులకు సంబంధించి పోలీసులే కమ్యూనికేషన్ బాధ్యత తీసుకోవాలి. అన్నిచోట్లా అది అమలు కాదు. దీంతో చాలామంది బెయిల్ని పొందే హక్కుని కోల్పోతున్నారు. దీనికోసం మేం జైళ్లకు వెళ్లి కేసుల్ని పరిశీలించి అవసరమైనవారికి బెయిల్ ఇప్పించే పని కూడా చేస్తున్నాం’’ అని చెప్పారు మరో లా స్టూడెంట్ పి. దినేశ్. తప్పుదోవ పట్టించే కొందరున్న ఈ ప్రపంచంలో తప్పొప్పులు చెప్పి న్యాయ మార్గంలో నడిపించే న్యాయవాదులు కూడా ఉన్నారు. ‘‘ మేం ‘మాట‘ సాయం చేయడం న్యాయమే కాదు ధర్మం కూడా’’ అంటున్నారు రాజశ్రీ. న్యాయం కోసం పోరాడే వృత్తిలో ఉన్న లాయర్లలో మరింత మంది ఈ ధర్మానికి నిలబడితే సామాన్యుడికే కాదు, సమాజానికీ అదే పెద్ద సాయం!