breaking news
Pushkara celebrations
-
భక్తుల కొంగుబంగారం ముక్తీశ్వరుడు పుష్కరాలు : ఇక్కడి స్పెషల్ ఏంటంటే..?
రాష్ట్రంలోని మహాప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒక్కటైన మహాక్షేత్రం కాళేశ్వరం. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారం కాళేశ్వర–ముక్తీశ్వరులు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల భక్తులతో నిత్యం పూజలందుకుంటూ విరాజిల్లుతోంది. ఈ క్రమంలో ఈనెల 15నుంచి 26 వరకు సరస్వతీ నది పుష్కర శోభను సంతరించుకోనుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టం పై రెండు శివలింగాలు ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఈలింగాలలో ఒకటి కాలుడు (యముడు), ముక్తీశ్వరుడు(శివుడు)గా వెలిసినట్లు పురాణాలు పేర్కొంటున్నా యి. ముక్తీశ్వర లింగానికి రెండు నాశికారంధ్రాలు ఉంటాయి. అందులో ఎన్ని బిందెల నీళ్లు పోసి నా బయటకు కనిపించవు. ఆ నీరు సొరంగ మార్గం గుండా గోదావరిలో కలుస్తుందని పూర్వీకులు తెలుపుతున్నారు. గర్భగుడికి నాలుగు దిక్కులా నాలుగు ద్వారాలు, నాలుగు నంది విగ్రహాలు, నాలుగు ధ్వజ స్తంభాలు, నాలుగు గోపురాలు ఉండడం కాళేశ్వర క్షేత్రం విశేషం. కాళేశ్వరం క్షేత్రం గోదావరి పరీవాహక ప్రాంతం కావడంతో మహారాష్ట్ర నుంచి ప్రవహిస్తున్న ప్రాణహిత, ఆదిలాబాద్ నుంచి గోదావరి, అంతర్వాహిణి సరస్వతీ నదులు కలిసిన క్షేత్రం కాళేశ్వరమని ప్రాచుర్యంలో ఉంది. కాళేశ్వరం క్షేత్ర నిర్మాణం..పూర్వం యమ ధర్మరాజు ఓ కార్యం నిమిత్తం స్వర్గలోకంలో ఇంద్రుడి వద్దకు వెళ్లాడు. ఇంద్రలోకంలోని వైభవాలు చూశాడు. ప్రజలు ఇక్కడ సుఖసంతోషంగా ఉంటూ యమ లోకానికి రావడానికి ఇష్టపడడం లేదు. వీరంతా ఆ మహాశివుడిని పూజిస్తున్నట్లు తెలుసుకున్నాడు. మహాశివుడిని పూజిస్తే కోరికలు తీరుతాయని గ్రహించి ముక్తీశ్వర ఆలయం ఎదుట 12 సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేశాడు. ముక్తీశ్వరుడు ప్రత్యక్షమై యమధర్మరాజును తపస్సు ఎందుకు చేస్తున్నావు..నీ కోరిక ఏంటని ప్రశ్నించాడు.అందుకు యమధర్మరాజు నీవు భక్తులకు సర్వపాపాలు తొలగించి సుఖసంతోషాలను ప్రసాదిస్తూ కైలాసానికి పంపుతున్నావు. యమలోకంలో నాకు పని లేకుండా పోయిందని పేర్కొన్నాడు. అందుకోసం ముక్తీశ్వరాలయంలో నీ లింగం పక్కనే నాకు చోటు కల్పించి భక్తులు నీకంటే ముందు నన్నే పూజించాలని ముక్తీశ్వరుడితో వేడుకున్నాడు. అందుకు ముక్తీశ్వరుడు తన పక్కన ఆలయంలో చోటు కల్పించాడు. అందుకే కాలుడు, ముక్తీశ్వరుడు ఇద్దరు వెలిసిన నేపథ్యంలో ‘కాళేశ్వరం’ అనే పేరు వచ్చినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. అదేవిధంగా కాళేశ్వరమనే పట్టణం నిర్మింతమైంది. ఈ ఆలయంలో ఒకే పానవట్టం పై ఓవైపు యముడు, మరోవైపు శివుడు కొలువయ్యారు. ముందు యముడి(కాలుడు)ని కొలిచిన తర్వాతే శివు(ఈశ్వరుడు)డిని భక్తులు ఆరాధిస్తారు. అప్పటి నుంచి ఈ క్షేత్రం భక్తజనులతో ప్రాచుర్యంలోకి వచ్చిందని పురాణాలు తెలుపుతున్నాయి. ప్రధానాలయంతో పాటు మహాసరస్వతి, శ్రీశుభానందాదేవి అమ్మవారి ఆలయాల్లో భక్తులు పూజలు చేస్తారు.శ్రాద్ధ త్రికోటి సరస్వతీనది పుష్కరాలుశ్రాద్ధ త్రికోటి సరస్వతీనది పుష్కరాలు ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్నాయి. నదిలో స్నానమాచరిస్తే పుణ్యఫలం లభిస్తుంది. ముఖ్యంగా పితృదేవతలకు తీర్థశ్రాద్ధాలు, పిండప్రదానాలు ముఖ్యం. సంకల్ప స్నానాలు చేయాలి. నదీపూజ తప్పని సరి చేయాలి. -పనకంటి ఫణీంద్రశర్మ, ఉపప్రధాన అర్చకుడు, కాళేశ్వరం దేవస్థానంప్రయాగ కన్నా త్రివేణి స్నానం గొప్పనదిలో 12 రోజుల పాటు స్నానాలు ఆచరిస్తే పుణ్యఫలం లభిస్తుంది. 33 కోట్ల దేవతామూర్తులు నది జలాల్లో సంచరిస్తారు. పుష్కరిణిలో స్నానాలు చేస్తే పాపాలు తొలగి పుణ్యం ప్రాప్తిస్తుంది. త్రివేణి సంగమం కలిసే చోట అంతర్వాహిణి సరస్వతీనదిలో పుష్కర స్నానం చేస్తే ప్రయాగ నది కన్నా కోటిరెట్ల పుణ్యమని పురాణాల్లో ఉంది. పుష్కర స్నానంతో సర్వపాపాలు తొలగి ముక్తి లభిస్తుంది. -త్రిపురారి కృష్ణమూర్తిశర్మ, రిటైర్డ్ ఉపప్రధాన అర్చకుడు, కాళేశ్వరం దేవస్థానం -
బాబూ... ఇదేనా మర్యాద?
-
బాబూ... ఇదేనా మర్యాద?
* గురువారం సాయంత్రం ఆర్భాటంగా పుష్కర వేడుకలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం * శుక్రవారం ఉదయం లాంఛనంగా పుష్కరాలు ప్రారంభించిన సీఎం * 12 గంటలు గడిచిన తర్వాత విపక్ష నేతకు ఆహ్వానమంటూ డ్రామా సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం మర్యాద తప్పి వ్యవహరించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని పుష్కరాలకు ఆహ్వానించేందుకు.. పుష్కరాలు ప్రారంభమైన 12 గంటల తర్వాత మంత్రిని ఆయన ఇంటికి పంపింది. పుష్కరాలను అట్టహాసంగా నిర్వహిస్తామని ప్రభుత్వం కొన్ని నెలల ముందే చెప్పింది. దేశ, విదేశాల్లోని ప్రముఖులను ఆహ్వానిస్తున్నామని సీఎం చంద్రబాబు పలుమార్లు విలేకరులకు చెప్పారు. గత నెలలో ఢిల్లీలో జరిగిన అంతర్రాష్ట్రమండలి సమావేశానికి వెళ్లినప్పుడే పుష్కరాలకు రావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించినట్లు తెలిపారు. గత వారం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు, కేంద్ర మంత్రులను ఆహ్వానించేందుకు ఢిల్లీ వె ళ్లిన చంద్రబాబు మరోమారు ప్రధానిని కలసి ఆహ్వానించారు. దీన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ రాష్ట్రంలో ప్రతిపక్ష నేత విషయంలో ప్రభుత్వం అనుసరించిన వైఖరినే అందరూ తప్పుపడుతున్నారు. ఇతర ప్రముఖుల మాదిరిగా ప్రతిపక్ష నేత జగన్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ఆహ్వానించాలి. పుష్కరాలను ప్రారంభిస్తూ చంద్రబాబు దంపతులతో పాటు వివిధ పీఠాల అధిపతులు స్నానమాచరించిన తరువాత తీరికగా శుక్రవారం సాయంత్రం జగన్ను ఆహ్వానించేందుకు మంత్రి రావెల కిషోర్బాబును పంపింది. జగన్ హైదరాబాద్లో అందుబాటులో లేకపోవటం వల్ల ఆలస్యం చేశారా? అంటే అదీ లేదు. ఆయన హైదరాబాద్లోనే ఉన్నారు. ఏపీలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు కూడా. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వారం రోజుల పాటు హైదరాబాద్లో మకాం వే శారు. పలువురు సినీ ప్రముఖుల ఇళ్లకు వెళ్లి ఆహ్వానించారు. కానీ ప్రభుత్వ పెద్దలు విపక్ష నేతను మాత్రం విస్మరించారు. జగన్ నివాసానికి మంత్రి రావెల పుష్కరాలకు ఆహ్వానించేందుకు జగన్ అపాయింట్మెంట్ కావాలని కోరుతూ గురువారం సాయంత్రం మంత్రి రావెల కిషోర్బాబు కార్యాలయం నుంచి వైఎస్సార్సీపీ కార్యాలయానికి ఫోన్ వచ్చింది. అయితే జగన్ శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళుతున్నారని, శనివారం ఉదయం 10 గంటలకు రావాలని పార్టీ నేతలు జవాబిచ్చారు. శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో రావెల విలేకరులతో మాట్లాడారు. కొద్దిసేపటికి జగన్ను పుష్కరాలకు ఆహ్వానించేందుకు రావెల వెళుతున్నారని, దీన్ని కవర్ చేయాలంటూ టీడీపీ మీడియా విభాగం విలేకరులకు ఎస్సెమ్మెస్లు పంపింది. రాత్రి 7.30 ప్రాంతంలో రావెల, ప్రభుత్వ విప్ రవికుమార్లు లోటస్పాండ్కు వెళ్లారు. అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ నేత పార్థసారథి, తదితరులు మీకు శనివారం ఉదయం సమ యం ఇచ్చారు కదా.. అనడంతో వారు వెనుది రిగారు. రాజధాని అమరావతికి భూమిపూజ, శంకుస్థాపనలను టీడీపీ సొంత వ్యవహారం లా నిర్వహించిన ప్రభుత్వం ఇప్పుడూ అదే తీరులో వ్యవహరించడం విమర్శల పాలైంది.