breaking news
public sector employees
-
ప్రభుత్వ ఉద్యోగులను విదేశాలకు వెళ్లనీయని చైనా
ప్రభుత్వ ఉద్యోగులపై చైనా ప్రభుత్వం వింత వింత ఆంక్షలు పెడుతోంది. ఉపాధ్యాయులు, వైద్యులు సహా ప్రభుత్వ యాజమాన్యంలోని వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులెవరినీ దేశం దాటి విదేశాలకు వెళ్లనీయడం లేదు. ప్రజల్లో సైద్ధాంతిక భావాలు సడలకుండా ఉండేందుకు, విదేశీ ప్రభావాన్ని అరికట్టడానికి, జాతీయ భద్రతను పెంచడానికి చైనా ప్రభుత్వం ఈ చర్యలకు పూనుకుంది.కీలక ఆంక్షలు ఇవే..పాస్ పోర్ట్ సరెండర్: చాలా మంది ప్రభుత్వ రంగ ఉద్యోగులు ఇప్పుడు తమ పాస్ పోర్ట్ లను స్థానిక అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది.వ్యక్తిగత ప్రయాణానికి అనుమతి తప్పనిసరి: విదేశాలలో వ్యక్తిగత సెలవులను కూడా యజమాన్యాలు లేదా స్థానిక ప్రభుత్వ విభాగాలు ఆమోదించాలి. అయితే విదేశీ పర్యటనలకు అనుమతులు ఇవ్వకుండా నిరాకరిస్తున్నారు.విదేశాల్లో చదువుపై నిషేధం: చాలా ప్రావిన్సుల్లో విదేశాల్లో చదువుకున్న వ్యక్తులు ఇప్పుడు కొన్ని ప్రభుత్వ పదవులకు అనర్హులు.వ్యాపార ప్రయాణ ఆంక్షలు: సాధారణ పరిశోధన, అధ్యయనం ప్రయాణాలను కూడా అనేక ప్రాంతాలలో నిషేధించారు.ఇదంతా ఎందుకంటే..తమ దేశ ప్రజలపై ముఖ్యంగా విద్యావేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులలో విదేశీ సైద్ధాంతిక ప్రభావం గురించి చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కువగా ఆందోళన చెందుతోంది. రాజకీయ క్రమశిక్షణ, పార్టీ పట్ల విధేయతను బలోపేతం చేసే విస్తృత ప్రచారంలో భాగంగా ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విదేశాలతో ఉద్యోగుల వ్యక్తిగత, కుటుంబ సంబంధాలను కూడా అధికారులు మ్యాపింగ్ చేస్తున్నారు.ఆంక్షల పరిధి, ప్రభావంచైనా ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ ఆంక్షలు చైనా శ్రామిక శక్తిలో విస్తృత భాగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ప్రభుత్వ పట్టణ స్థానిక సంస్థలలో పనిచేసే సుమారు 16.7 కోట్ల మందిపై వీటి ప్రభావం పడుతోంది. కొన్ని నగరాల్లో రిటైరైన వారు కూడా తమ పాస్పోర్టులను తిరిగి పొందడానికి రెండేళ్లు వేచి ఉండాల్సి వస్తుంది. కొంతమంది ఉద్యోగులనైతే సోషల్ మీడియా ఖాతాలను బహిర్గతం చేయాలని, తమ నివాస నగరాన్ని విడిచి వెళ్లేటప్పుడు రిపోర్ట్ చేయాలని అడుగుతున్నారట. -
మూడు రోజుల్లో పరిష్కారం
కర్నూలు, న్యూస్లైన్: ప్రజల ఫిర్యాదులపై మూడు రోజుల్లోగా ఎలాంటి చర్యలు తీసుకున్నామనే విషయాన్ని తమ సిబ్బంది తెలియజేస్తారని ఎస్పీ రఘురామిరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ‘మీతో మీ ఎస్పీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉదయం 10.30 నుంచి 12 గంటల వరకు తన చాంబర్లో బాధితుల నుంచి ఫోన్లో స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు. 9440795567 నెంబర్కు ఫోన్ చేసిన ప్రజలతో ‘హలో.. నమస్తేనండి. నేను ఎస్పీ రఘురామిరెడ్డిని మాట్లాడుతున్నా. చెప్పండి.. ఏంటి మీ సమస్య’ అంటూ శాంతి భద్రతలపై ఫిర్యాదులను ఎంతో ఓపికగా వింటూ పేపర్పై రాసుకున్నారు. మొదటి రోజు 32 ఫిర్యాదులు అందంగా.. వాటిని సంబంధిత పోలీసు అధికారులకు తెలియజేసి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ విభాగాలకు సంబందించిన ఫిర్యాదులను(ఎక్సైజ్, రెవెన్యూ) సంబంధిత అధికారులకు ఉత్తరాల ద్వారా తెలియజేస్తామని బాధితులకు ఎస్పీ హామీ ఇచ్చారు. బాకీ వసూళ్లు, ఒప్పంద ఉల్లంఘన వంటి సివిల్ తగాదాల్లో పోలీసులు కలగజేసుకోరని, ఈ ఫిర్యాదులను న్యాయ సేవా సంస్థ వారికి పంపుతామన్నారు. శాంతి భద్రతలకు సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలను మాత్రమే ప్రస్తావించి పరిష్కారం పొందాలని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కల్లూరు మండలం ఉల్లిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేమడూరు గ్రామంలో బస్టాండ్ వద్దనున్న దేవాలయం సమీపంలో మద్యం బెల్టు దుశాఖలు.. 10 పబ్లిక్ సెక్టార్ల ఉద్యోగులు నేటి నుంచి సమ్మె బాట పడుతుండగా.. ఉపాధ్యాయులు ఈనెల 16 నుంచి సమ్మెలోకి వెళ్లనున్నారు. మొత్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు దాదాపు కాణం ఉండటంతో భక్తులు, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తుడు నారాయణరెడ్డి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఆళ్లగడ్డలోని లక్ష్మీ ప్రసన్న సినిమా థియేటర్ వద్దనున్న స్థలాలను బలిజ వెంకటేశ్వర్లు, ప్రసాద్, వెంకటరెడ్డి అనే వ్యక్తులు ఆక్రమించుకుంటున్నారని ఘాతంశెట్టి నాగరత్నమ్మ ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా మరికొన్ని సమస్యలను ఎస్పీ స్వీకరించారు.