-
కరెంట్ కొరతకు కొత్త జవాబు
నా ఉచ్ఛ్వాసం కవనం... నా నిశ్వాసం గానం.. అన్నాడో కవి. నా ఉచ్ఛ్వాసం మీథేన్.. నా నిశ్వాసం విద్యుత్.. అంటున్నాయి ఒక రకం బ్యాక్టీరియాలు. మానవాళిని వేధిస్తున్న పర్యావరణ కాలుష్యం, ఇంధన కొరతకు అవి సమాధానం చెబుతాయంటున్నారు శాస్త్రవేత్తలు.. జనాభా పెరిగిపోయే కొద్దీ శిలాజ ఇంధనాల వాడకం పెరిగి వాతావరణ కాలుష్యం హద్దులు దాటుతోంది. అలాగని ఇంధన వాడకాన్ని పరిమితం చేయదలిస్తే మానవ అభివృద్ధి కుంటుపడుతుంది. ఈ నేపథ్యంలో పర్యావరణహిత ఇంధనాల కోసం మనిషి అన్వేషణ చాలా రోజులుగా జరుగుతోంది. వాయు, సౌర విద్యుత్లాంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకం జరుగుతున్నా అది శిలాజ ఇంథనాలను పరిమితం చేసే స్థాయిలో జరగడంలేదు. వీటికయ్యే ఖర్చు, సాంకేతిక సమస్యలు ప్రత్యామ్నాయ ఇంధనాన్ని విరివిగా వాడేందుకు అడ్డంకిగా మారుతున్నాయి. తాజాగా ఈ సమస్యకు పరిష్కారం దొరికిందంటున్నారు శాస్త్రవేత్తలు. వాయు కాలుష్యకాల్లో కీలకమైన మీథేన్ను వాడుకుని విద్యుత్ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాను కనుగొన్నామని నెదర్లాండ్స్ పరిశోధకులు చెప్పారు. మీథేన్ను ఇంధనంగా వాడుకోవడం చాలా రోజులుగా జరుగుతున్నదే. బయోగ్యాస్ ప్లాంట్లలో వ్యర్థాలను సూక్ష్మ జీవులు మీథేన్గా మారుస్తాయి. ఇలా ఉత్పత్తి అయిన మీథేన్ను మండించి టర్బైన్లు తిరిగేందుకు వాడతారు. దీంతో విద్యుదుత్పాదన జరుగుతుంది. అయితే ఉత్పత్తి అయిన బయోగ్యాస్లో సగానికన్నా తక్కువే విద్యుదుత్పాదనకు ఉపయోగపడుతోంది. ఈ నేపథ్యంలో తమ ప్రయోగం ప్రత్యామ్నాయ ఇంధనోత్పత్తిలో ముందడుగు అని రాడ్బౌడ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త కార్నెలియా వెల్టె చెప్పారు. ప్రయోగ ఫలితాలను ఫ్రాంటియర్స్ ఇన్ మైక్రోబయాలజీలో ప్రచురించారు. ఇలా చేశారు పరిశోధనలో భాగంగా కాండిడేటస్ మిథేనోపెరెండెన్స్ అనే బ్యాక్టీరియాకున్న ప్రత్యేక టాలెంట్ను గుర్తించామని వెల్టె చెప్పారు. ఈ సూక్ష్మజీవులు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా బతుకుతుంటాయి. ఇవి మీథేన్ను ఆక్సిజన్ అవసరం లేకుండానే విడగొట్టి శక్తిని ఉత్పత్తి చేస్తాయని చెప్పారు. ఏఎన్ఎంఈ (అనరోబిక్ మీథనోట్రోపిక్) ఆర్కియాగా పిలిచే ఈ జీవులు కొన్ని రసాయన ప్రక్రియల ద్వారా తమ సమీపంలోని పదార్ధాల నుంచి ఎలక్ట్రానులను విడగొడతాయి. కరెంటంటేనే ఎలక్ట్రానుల ప్రవాహం. అంటే ఇవి తమ దగ్గరలోని పదార్ధాలను ఆక్సిడైజ్ చేసి కరెంటును ఉత్పత్తి చేస్తాయి. ఇందుకు కొద్దిగా నైట్రేట్ల సాయం తీసుకుంటాయి. ప్రయోగంలో భాగంగా ఈ సూక్ష్మజీవులను ఆక్సిజన్ రహిత ట్యాంకులో మీథేన్తో కలిపి ఉంచారు. దగ్గరలో ఒక మెటల్ ఆనోడ్ను జీరో ఓల్టేజ్ వద్ద సెట్ చేసి పెట్టారు. దీంతో ఈ మొత్తం సెటప్ ఒక బ్యాటరీలా మారిందని, ఇందులో ఒకటి బయో టెర్మినల్ కాగా ఇంకోటి కెమికల్ టెర్మినల్ అని వెల్టె తెలిపారు. సదరు బ్యాక్టీరియా తమ దగ్గరలోని మీథేన్నుంచి ఎలక్ట్రానులను విడగొట్టి కార్బన్ డైఆక్సైడ్గా మారుస్తాయి. ఈ ప్రక్రియలో దాదాపు చదరపు సెంటీమీటర్కు 274 మిల్లీ యాంప్ల కరెంటు ఉత్పత్తి అయింది. దీన్ని మరింత పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పరిశోధన ఆధారంగా భారీ స్థాయిలో బ్యాక్టీరియా బ్యాటరీలను నిర్మించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ► ప్రపంచ జనాభాలో 94 కోట్ల మంది (13 శాతం)కి ఇంకా విద్యుత్ సౌకర్యం లేదు. ► భూతాపాన్ని పెంచే గ్రీన్హౌస్ వాయువుల్లో మీథేన్ కీలకమైనది. మొత్తం గ్రీన్హస్ వాయువుల్లో దీని వాటా 20 శాతం. ► కార్బన్ డై ఆక్సైడ్తో పోలిస్తే మీథేన్ భూమిపై సూర్యతాపాన్ని 25 శాతం వరకు పట్టి ఉంచుతుంది. ► పశువ్యర్థాలు, బొగ్గు గనుల నుంచి ఎక్కువగా మీథేన్ విడుదలవుతుంది. ► భారీస్థాయిలో శిలాజ ఇంధనాల వాడకం తగ్గితే భూతాపం గణనీయంగా అదుపులోకి వస్తుంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
అతలాకుతలం
సాక్షి, కడప : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో కురిసిన వర్షం జిల్లాలోని పలు ప్రాంతాలను కుదిపేసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో జిల్లా అతలాకుతలమైంది. వంకలు, వాగులు ఉగ్రరూపం దాల్చడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చెరువులకు గండ్లు పడ్డాయి. కొసినేనిపల్లె వంక ఉధృతంగా ప్రవహించడంతో ఎర్రగుంట్ల మండలం కలమల్ల కృష్ణానగర్ దళితవాడకు చెందిన రామసుబ్బమ్మ అనే మహిళ మృతి చెందింది.రామలక్షుమ్మ అనే మరో మహిళ గల్లతైంది. 50 ఇళ్లు పూర్తిగా నేలమట్టం కాగా, 150 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఆర్టీపీపీలోని ఈఎస్పీ, కోల్ప్లాంట్, మెయిన్ ప్లాంట్లోకి నీరు చేరింది. మోటార్లు పూర్తిగా నీట మునిగాయి. మరో 10 రోజుల వరకు విద్యుత్ ఉత్పత్తిని పునరుద్దరించే అవకాశాలు లేవని అధికారులు పేర్కొంటున్నారు. ఐదు యూనిట్లలో 1050మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ముంపు గ్రామాల్లోకి శ్రీనివాసపురం రిజర్వాయర్ నీరు చేరింది. సుండుపల్లె,చిన్నమండెం, పులివెందుల, జమ్మలమడుగు ప్రాంతాల్లోని పలు చెరువులు పూర్తిగా నిండగా,కొన్నింటికి గండ్లు పడ్డాయి. జిల్లాలో అత్యధికంగాప్రొద్దుటూరు పట్టణంలో 215.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. యానాది కాలనీ పూర్తిగా నీట మునిగింది. ముద్దనూరులోని కొసినేనిపల్లె వంకలో ఆరుగురు రజకులు చిక్కుకున్నారు. వీరిని పోలీసులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆర్డీఓ రఘునాథరెడ్డి సంఘటనా ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ముద్దనూరు దళితవాడ జలమయమైంది. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో ముద్దనూరు చుట్టుపక్కల ఉన్న పుల్లేరు వంక, కొసినేనిపల్లె వంక, కాయవంక పారడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎర్రగుంట్ల మండలం కృష్ణానగర్ దళితవాడలోకి కొసినేనిపల్లె వంక, సిరిగేపల్లె చెరువు , ఆర్టీపీపీ కొండల నుంచి భారీగా నీరు రావడంతో ఇళ్లు కూలి రామసుబ్బమ్మ అనే మహిళ మృతి చెందింది. ఆమె మరదలు రామలక్షుమ్మ గల్లంతైంది. భర్త రాముడు, చెల్లెలు, కుమార్తె స్థానికుల సహాయంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆర్టీపీపీలోని ఈఎస్పీ, కోల్ప్లాంట్, మెయిన్ప్లాంట్లోకి నీరు చేరి మోటార్లు పూర్తిగా నీట మునగడంతో పది రోజులపాటు విద్యుత్ ఉత్పత్తికి అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు. పొట్లదుర్తి, కల్లమల,చిలంకూరు, మాలేపాడు వంకలు పొంగి ఉధృతంగా ప్రవహించాయి. ఆయా ప్రాంతాలను జిల్లా కలెక్టర్ కోనశశిధర్, జాయింట్ కలెక్టర్ నిర్మల, ఆర్డీఓ వీరబ్రహ్మం పరిశీలించారు. మృతి చెందిన మహిళ, గల్లంతైన మహిళ కుటుంబ సభ్యులకు తాత్కాలిక సహాయం కింద రూ. 10వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అందజేశారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 2 వేలు చొప్పున సహాయాన్ని అందించారు. ప్రొద్దుటూరులో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీల కారణంగా రోడ్లపైనే మురికి నీరు పొంగి ప్రవహించింది. మున్సిపల్ కార్యాలయం, కోర్టు, త్రీ టౌన్ పోలీసుస్టేషన్, అగ్నిమాపక కేంద్రం నీటమునిగాయి. యానాదికాలనీ పూర్తిగా నీటిలో చిక్కుకుపోవడంతో భారీగా ఆస్తినష్టం జరిగింది. వైఎస్సార్సీపీనేత రాచమల్లు ప్రసాద్రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు. కొర్రపాడు వద్ద నల్లవాగు, గోపవరం వద్ద కేసీ కెనాల్ ఉప్పవాగువంక భారీగా ప్రవహించడంతో ప్రొద్దుటూరుపట్టణానికి మధ్యాహ్నం వరకు రాకపోకలు నిలిచిపోయాయి. పెన్నాకు భారీగా నీరు చేరడంతో నది ప్రవహించింది. రాజుపాలెం, చాపాడులో భారీ వర్షం కురవడంతో వరి, పత్తి, పసుపు పంట నీట మునిగింది. రైతులకు తీవ్ర నష్టం సంభవించింది. కొండ ప్రాంతం నుంచి భారీగా వర్షపు నీరు చేరడంతో మైలవరం దక్షిణ కాలువ రెండుచోట్ల కొట్టుకుపోయింది. కన్యతీర్థంలో మనిషిలోతు నీరు ప్రవహించింది. అక్కడున్న 15 మంది తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని బయటపడ్డారు. జమ్మలమడుగు-ముద్దనూరు మధ్య రాకపోకలు స్తంభించాయి. సంబేపల్లె మండలంలోని పది చిన్న కుంటలు తెగిపోయాయి. దేవపట్ల చెరువు తెగిపోయింది. దాలం చెరువుకు పదిచోట్ల గండ్లుపడ్డాయి. తద్దికూలవంక ఉధృతంగా ప్రవహించడంతో రాయచోటి-రాజంపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు గ్రామాలైన పాతవటంపల్లె, కొత్తవటంపల్లె, బండకింద పురుగుపల్లెలోకి శ్రీనివాస రిజర్వాయర్ నీరు చేరడంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పులివెందుల మండలం బెస్తవారిపల్లె సమీపంలో పీబీసీ కాలువ కోసుకుపోయింది. వేముల మండలం కొండ్రెడ్డిపల్లె చెరువుకు గండి పడింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.మబ్బుచింతలపల్లె, ఆర్.తుమ్మలపల్లెలో కొండపై నుంచి వర్షపు నీరు భారీగా రావడంతో 80 ఎకరాల్లో అరటి పంట పూర్తిగా దెబ్బతింది.దాదాపు రూ. 2 కోట్ల మేర నష్టం సంభవించింది. బద్వేలులోని ఆర్టీసీ డిపోను వర్షం నీరు చుట్టుముట్టింది. డిపోలోని బస్సులు నీటిలో మునిగాయి. 40 మి.మీ.పైగా వర్షపాతం నమోదైన మండలాలు జిల్లాలో 40మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం 20 మండలాల్లో నమోదైంది. అందులో కమలాపురం, ఎర్రగుంట్ల, వీఎన్ పల్లె,చిన్నమండెం, సంబేపల్లె, బద్వేలు, గోపవరం, బి.మఠం, జమ్మలమడుగు, మైలవరం, ముద్దనూరు, ప్రొద్దుటూరు,చాపాడు, దువ్వూరు,రాజుపాలెం, దువ్వూరు, లింగాల, వేంపల్లె, వేముల, తొండూరు ఉన్నాయి. 20-40 మిల్లీమీటర్ల మధ్య వర్షపాతం ఎనిమిదిమండలాల్లో నమోదు కాగా, అందులో రాయచోటి, చక్రాయపేట, రామాపురం, గాలివీడు, పెద్దముడియం, కొండాపురం, మైదుకూరు, సింహాద్రిపురం ఉన్నాయి. అలాగే 20 మి.మీ.లోపు వర్షపాతం నమోదైన మండలాలు 15 ఉన్నాయి. అందులో వల్లూరు, కడప, పెండ్లిమర్రి, చెన్నూరు, ఖాజీపేట, వీరబల్లి, సుండుపల్లె, ఎల్ఆర్ పల్లె, గాలివీడు, ఓబులవారిపల్లె, పుల్లంపేట, బి.కోడూరు, కలసపాడు, సిద్దవటం, అట్లూరు ఉన్నాయి. ఇదిలా ఉండగా రాజంపేట, నందలూరు, పెనగలూరు, చిట్వేలి, పోరుమామిళ్ల, కాశినాయన, ఒంటిమిట్ట మండలాల్లో వర్షం కురువలేదు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆదివాసీల హక్కుల జోలికొస్తే ఊరుకోం
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
గర్భిణులూ జెర జాగ్రత్త..
న్యూస్రీల్
వడగండ్ల వాన
‘బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి’
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
ఉద్యోగాలిప్పిస్తానని ఘరానా మోసం
ఎన్నికల వేళ డేగకళ్ల నిఘా
నాంచారమ్మ జాతర విజయవంతం చేయండి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement