breaking news
PPP project
-
అమ్మకానికి హైదరాబాద్ మెట్రో! ఎల్ అండ్ టీ కీలక నిర్ణయం?
ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకి కోవిడ్ సంక్షోభం శాపంగా మారింది. వరుస లాక్డౌన్లు, కఠిన నిబంధనలు, వర్క్ఫ్రం హోం వంటి కారణాల వల్ల నష్టాల ఊబి నుంచి బయటపడలేకపోతుంది. దీంతో హైదరాబాద్ మెట్రోలో తన వాటా అమ్మేందుకు ఎల్ అండ్ టీ సన్నాహలు చేస్తోంది. మెట్రో స్పీడుకి కోవిడ్ బ్రేకులు పబ్లిక్ , ప్రైవేటు పార్టనర్షిప్లో ప్రపంచలోనే అతి పెద్ద మెట్రోగా 71 కిలోమీటర్ల నిడివితో మూడు మార్గాల్లో హైదరాబాద్ మెట్రో ఘనంగా ప్రారంభమైంది. ఆరంభానికి తగ్గట్టే ప్రారంభించిన ఏడాదిలోపే నిత్యం 4.50 లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేరవేసే ప్రయాణ సాధనంగా మారింది. ఇక లాభాల రూట్లోకి వెళ్లడమే తరువాయి అనే సమయంలో కోవిడ్ సంక్షోభం వచ్చి పడి మెట్రో స్పీడుకి బ్రేకులు వేసింది. నష్టాల ట్రాక్లో కోవిడ్ ఫస్ట్ వేవ్ కారణంగా ఆరు నెలల పాటు మెట్రో రైలు నడవలేదు. ఆ తర్వాత కఠిన నిబంధనల మధ్య 2020 సెప్టెంబరులో మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి, క్రమంగా ప్రయాణికుల సంఖ్య పుంజుకుంటున్న తరుణంలో 2021 మేలో మరోసారి కరోనా సెకండ్ వేవ్ వచ్చి పడింది. ఫలితంగా మరోసారి మెట్రో సేవలు నిలిచిపోయాయి. దీంతో వరుసగా మెట్రో నష్టాలు పెరిగాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో మెట్రో నష్టాలు రూ. 1,766 కోట్లకు చేరగా అంతకు ముందు ఏడాది ఈ నష్టం రూ. 382 కోట్లుగా నమోదైంది. మొత్తంగా రెండు వేలకు కోట్లకు పైగా నష్టాల్లో మెట్రో నడుస్తోంది. వర్క్ఫ్రం హోం ఎఫెక్ట్ కరోనా భయాలు పూర్తిగా తొలగిపోకపోవడంతో చాలా ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలు వర్క్ఫ్రం హోంనే కొనసాగిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కోవిడ్ కారణంగా పడిన జీతాల కోతకు తోడు మెట్రో సర్వీసులు రెగ్యులర్గా నడకవపోవడంతో చాలా మంది ప్రత్యామ్నాయ రవాణాకు మారిపోయారు. దీంతో సెకండ్ వేవ్ ముగిసినా మెట్రో ప్రయాణానికి మొగ్గు చూపుతున్న వారి సంఖ్య పెరగడం లేదు. ఫలితంగా రోజువారి ప్రయాణికుల సంఖ్య 4.50 లక్షల నుంచి కేవలం ఒక లక్షకు పడిపోయింది. మరికొంత కాలం ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉండటంతో మెట్రో నష్టాలు తడిసి మోపెడు అవుడం ఖాయంగా మారింది. వాటా అమ్మకానికి సిద్ధం లాభాలు తెచ్చివ్వని సంస్థల్లో వాటాలు అమ్మేయాలని ఎల్ అండ్ టీ సంస్థ నిర్ణయించింది. అందులో భాగంగా పంజాబ్లోని పవర్ ప్రాజెక్టుతో పాటు హైదరాబాద్ మెట్రోలో వాటాను అమ్మాలని సంస్థాపరమైన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. హైదరాబాద్ మెట్రోలో 15 శాతం వాటా అమ్మకానికి ఎల్ అండ్ టీ రెడీ అవుతోంది. హైదరాబాద్ మెట్రోలో వాటాను వాటాను కొనుగోలు చేసేందుకు గ్రీన్కో సంస్థ సిద్ధంగా ఉందంటూ ఎల్ అండ్ టీ వైస్ప్రెసిడెంట్ డీకే సేన్ అన్నారు. అయితే దీనిపై గ్రీన్ సంస్థ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ప్రభుత్వం అనుమతిస్తుందా ? హైదరాబాద్ మెట్రో పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్షిప్లో నిర్మించిన ప్రాజెక్టు కావడంతో ఎల్ అండ్ టీ తన వాటాలను ఏకపక్షంగా అమ్మేయడానికి వీలులేదు. తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వాటాల విక్రయానికి సంబంధించి ఎల్ అండ్ టీ సంస్థ నుంచి తమకు ఎటువంటి సమాచారం అందలేదని మెట్రో అధికారులు అంటున్నారు. సాయం అందేనా ? నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న హైదరాబాద్ మెట్రో రైలులో పెట్టుబడులు పెట్టేందుకు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఫండ్ ముందుకు వచ్చినట్టు వార్తలు రావడం కొంత శుభ పరిణామంగా చెప్పుకోవాలిజ హైదరాబాద్ మెట్రోలో నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడికి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఫండ్ సుముఖతగా ఉన్నట్టు సమాచారం. నష్టాల ఊబి నంచి బయట పడేందుకు గత కొంత కాలంగా సాఫ్ట్ రుణాల కోసం వివిధ బ్యాంకులను హైదరాబాద్ మెట్రో ఆశ్రయిస్తోంది. చదవండి : మెట్రో తడబాటు! ఏడాది సుమారు రూ.2 వేల కోట్ల నష్టం -
భూములిచ్చిన రైతులకు శఠగోపం
‘రాజధాని’ కోసం భూములను ‘దానం’ ఇవ్వని రైతులను భయపెట్టడం కోసం 2015 మే నెల 15వ తేదీన చంద్రబాబు ప్రభుత్వం 166 జీవో జారీ చేసింది. అయితే 166 జీవోకు, కేంద్ర ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్కు మధ్య పొంతన కుదరని కొన్ని అంశాలున్నాయి. నోటిఫికేషన్ (జీవో) విడుదల చేయటానికి ముందే రాష్ర్ట ప్రభుత్వం బీడు భూముల సర్వే నిర్వహించాలనీ, కనిష్టంగా అవసరమైన భూమిని మాత్రమే సేకరించాలనీ కేంద్ర ఆర్డినెన్స్ పేర్కొంది. ఈ రెండూ జరగలేదు. దీంతో జీవో 166 చెల్ల్లుబాటు కాదు. ల్యాండ్ పూలింగ్లో ఎకరం భూమిచ్చిన రైతుకు అభివృద్ధి చేసిన 1200 గజాల భూమినిస్తామనీ దాన్ని అధిక ధరకు తమకు నచ్చినట్లు అమ్ముకోవచ్చని చంద్రబాబు ప్రభుత్వం నమ్మబలికింది. కానీ కేంద్ర ఆర్డినెన్స్ పీపీపీ ప్రాజెక్టుల్లో అనంతరం కూడా భూమిపై ప్రభుత్వ హక్కు కొనసాగాలని పేర్కొంది. దీంతో పూలింగ్ ద్వారా ప్రతిఫలంగా పొందిన భూమిపై రైతుకు పూర్తిస్థాయి యాజమాన్య హక్కు గాలిలో దీపమే. ల్యాండ్ పూలింగ్కు ప్రతిఫలంగా వచ్చే భూమిపై సకల హక్కులు ఆ భూమినిచ్చిన రైతుకు దక్కే విషయంలోనూ నీలినీడలే. ఏదైనా కేంద్ర చట్టం లేదా నిబంధనకు, రాష్ర్ట చట్టం నిబంధనకు మధ్య వైరుధ్యం తలెత్తితే కేంద్రానిదే వర్తిస్తుంది. దీంతో జీవో 166 ప్రకారం భూసేకరణ ప్రక్రియను చేపడితే పూలిం గ్ను వ్యతిరేకించే రైతుల భూములను గుంజుకోవడం మాట అటుంచితే ఇప్పటికే పూలిం గ్కు సమ్మతి పత్రాలిచ్చిన ైరైతుల హక్కులపట్ల సందేహాలు పెరుగుతున్నాయి. పూలింగ్ను వ్యతిరేకించే వారి భూములనే సేకరిస్తామని మంత్రులు చెబుతున్నా జీవో 166లో మాత్రం యావత్ రాజధాని ప్రాంతాన్నీ నోటిఫై చేశారు. 166-జీవోతో ప్రతికూల ఫలితాలేమైనా ఉంటే అవి అందరు రైతులకూ వర్తించే ప్రమాదముంది. - రాజశంకర్ హైదరాబాద్