breaking news
Pooja programs
-
అమ్మాయిల అంతరాత్మ
ఎలీనా, లాస్య స్మైలీ, తన్వీ, శశిరేఖ ముఖ్య తారలుగా, జయక్రిష్, సమీర్, అర్జున్, మల్లిక్ బాబు కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అంతరాత్మ’. ఎమ్. నాగ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తుమ్మల మనోజ్ యాదవ్, రావూరు సురేందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్లో జరిగాయి. తొలి సన్నివేశానికి ఏసీపీ బాలకృష్ణా రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. నటుడు అలీ స్క్రిప్ట్ను మేకర్స్కు అందించారు. ‘‘నలుగురు అమ్మాయిల మధ్య సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఫిల్మ్ ఇది. సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేస్తాం’’ అన్నారు నాగ రాజశేఖర్. ఐఏఎస్ ఆఫీసర్ మురళీమోహన్ ఓ అతిథిగా పాల్గొన్న ఈ చిత్రానికి సంగీతం: జీఎమ్ సతీష్, కెమెరా: నాగరాజు. -
వినాయకుని వ్రత కల్పం... చేసుకోవలసిన విధి
పూజకు ఏర్పాట్లు ముందుగా పీటమీద ముగ్గువేసి, బియ్యంపోసి, దానిమీద శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి ప్రతిమను ఉంచి పైభాగాన పసుపు కుంకుమలతో అలంకరించిన పాలవెల్లిని కట్టాలి. పసుపు వినాయకుణ్ణి చేయాలి. పూజ చేసేవాళ్ళు బొట్టు పెట్టుకుని దీపారాధనచేసి వినాయకునికి నమస్కరించి పూజ ప్రారంభించాలి. ముందుగా పసుపుతో చేసిన గణపతిని పూజించాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపారాధన: (ఈ క్రింది శ్లోకాన్ని చదువుతూ దీపాన్ని వెలిగించి, దీపం కుంది వద్ద అక్షతలు ఉంచి నమస్కరించాలి.) శ్లో‘‘ భోదీపదేవి రూపస్త్యం, కర్మసాక్షి హ్యామిఘ్నకృత్‘ యావత్పూజాం కరిష్యామి తావత్వం సిద్ధిదో భవ‘‘ దీపారాధన ముహూర్తస్తు సుముహూర్తోస్తు‘‘ పరిశుద్ధి: (పంచపాత్రలోని నీటిని చెంచాతో తీసుకుని కుడిచేతి బొటనవేలు, మధ్య ఉంగరపు వేళ్ళతో నీటిని ఈ కింది మంత్రం చెబుతూ తలపై చల్లుకోవాలి) అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా! యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశ్శుచిః పుండరీకాక్ష, పుండరీకాక్ష, çపుండరీకాక్షాయ నమః విఘ్నేశ్వరుని వ్రతకల్పము శ్రీ గణేశాయ నమః శ్లో‘‘ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాన్తయే ‘‘ అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దన్తం భక్తానాం యేకదన్త ముపాస్మహే ‘‘ శ్రీ గణేశ షోడశ నామ ప్రతిపాదక శ్లోకాః శ్లో‘‘ సుముఖశ్చైకదన్తశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరమ్బస్కన్దపూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శ్రుణుయాదపిః విద్యారమ్భే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా, సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తన్య నజాయతే ‘‘ ఆచమనం: ఓం కేశవాయ స్వాహా నారాయణాయ స్వాహా మాధవాయ స్వాహా (అని 3 సార్లు తీర్థం పుచ్చుకోవాలి) తరువాత చేయి కడుక్కోవాలి. గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః హృషీకేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః (రెండు అక్షతలను వాసన చూసి వెనుకకు వేయవలెను) శ్లో‘‘ ఉత్తిష్ఠంతు భూత పిశాచాః! యేతే భూమి భారకాః ఏతేషామవిరోధేన! బ్రహ్మకర్మ సమారభే! (ముక్కుపట్టుకుని ఎడమవైపు నుండి గాలిపీల్చి క్రింది మంత్రం చదివిన తరువాత ముక్కు కుడివైపు నుండి గాలి వదలవలెను.) ప్రాణాయామము: ఓం భూః ఓం భువః ఓగ్ం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగ్ం సత్యం ఓం తత్సవితుర్వ రేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్‘‘ ఓమాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్‘‘ సంకల్పం: మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావరీ మధ్యప్రదేశే స్వగృహే (సొంత ఇల్లుకానివారు మమ వాసగృహే అని చెప్పుకోవాలి) సమస్త దేవతాబ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ శుభకృత్ నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష బుుతౌ, భాద్రపద మాసే, శుక్లపక్షే, చతుర్థి తిథౌ, సౌమ్యవాసరే, శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణ, ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ, శ్రీమాన్ శ్రీమతః గోత్రః................. (మీ గోత్రం చెప్పవలెను) నామధేయః ............................... (ఇంటిపెద్ద / యజమాని తన పేరు చెప్పుకోవలెను) ధర్మపత్నీ సమేతస్య మమ సపుత్రకస్య, సపుత్రికస్య సహ కుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, వీర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, ఉద్యోగ, వ్యాపార, ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, సకల ధనకనక, విద్యా ప్రాప్త్యర్థం, వస్తువాహన సమృద్ధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్థ్యర్థం, సర్వాభీష్ట ఫల సిద్థ్యర్థం శ్రీ వరసిద్ధివినాయక దేవతా ముద్దిశ్య శ్రీ వరసిద్ధివినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే‘‘ (కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో తాకవలెను) తదంగ కలశపూజాం కరిష్యేః (మరలా కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో తాకవలెను) కలశపూజ: (కలశాన్ని గంధం, పుష్పములు, అక్షతలతో పూజించి కలశముపై కుడిచేతిని ఉంచి, క్రింది శ్లోకము చెప్పుకొనవలెను) శ్లో‘‘ కలశస్య ముఖే విష్ణుః కంఠేరుద్ర సమాశ్రితః మూలేతత్రస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌతు సాగరాః సర్వేసప్తద్వీపా వసుంధరా! ఋగ్వేదోధయజుర్వేదస్సామవేదో హ్యధర్వణః అంగైశ్చసహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః గంగేచ యమునే కృష్ణే గోదావరీ సరస్వతీ! నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు ‘‘ అయాంతు శ్రీ గణపతి పూజార్థం దురితక్షయ కారకాః కలశోదకేన పూజా ద్రవ్యాణిచ సంప్రోక్ష్యః దేవమాత్మానంచ సంప్రోక్ష్యః (పసుపుతో చేసిన గణపతిని తమలపాకుపై ఉంచి కుంకుమతో బొట్టు పెట్టవలెను. పసుపు విఘ్నేశ్వరుని క్రింది విధంగా పూజించాలి) శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి (నమస్కరించవలెను) గణానాంత్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనా ముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణాస్పత ఆనసృణ్వన్నూతిభిస్సీదసాదనం ఆవాహయామి ఆవాహనం సమర్పయామి (నీటిని చల్లవలెను) పాదయోః పాద్యం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను) హస్తయోః అర్ఘ్యం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను) ముఖే ఆచమనీయం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను) ఔపచారిక స్నానం సమర్పయామి (నీటిని చల్లవలెను) స్నానానంతర ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను) వస్త్రం సమర్పయామి (పత్తితో చేసిన వస్త్రం లేదా పుష్పం ఉంచాలి) గంధాన్ ధారయామి (గంధమును చల్లవలెను) కుంకుమం సమర్పయామి గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి (అక్షతలు చల్లవలెను) పుష్పాని సమర్పయామి (పూలతో స్వామివారిని అలంకరించవలెను) స్వామికి పుష్పాలతో పూజ (ఈ క్రింది నామాలు చదువుతూ పుష్పాలతో పూజ చేయవలెను) ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయనమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కంద పూర్వజాయ నమః ఓం మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి (పుష్పాలతోను, పత్రితోనూ పూజించవలెను) ధూపం ఆఘ్రాపయామి (అగరువత్తిని వెలిగించవలెను) దీపం దర్శయామి (దీపమును చూపవలెను) నైవేద్యం సమర్పయామి (బెల్లం ముక్కను నైవేద్యం పెట్టాలి) ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహిః ధియోయోనః ప్రచోదయాత్‘‘ సత్యం త్వరేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి (అని చెప్పి నైవేద్యముపై చుట్టూ నీటిని తిప్పి నైవేద్యంపై నీటిని అభికరించి ఎడమచేతితో కుడిచేతిని పట్టుకొని, కుడిచేతితో నైవేద్యాన్ని గణాధిపతికి చూపిస్తూ ఈ క్రింది మంత్రాలు చెప్పుకోవలెను). ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా శ్రీ మహాగణాధిపతయే నమః యథాభాగం గుడం నివేదయామి (బెల్లం ముక్కను నివేదించాలి) మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని చల్లవలెను) హస్తప్రోక్షయామి, పాదౌ ప్రోక్షయామి, ముఖే ఆచమనీయ సమర్పయామి (4సార్లు నీళ్ళు చూపించి వదలాలి) తాంబూలం సమర్పయామి (తాంబూలం ఉంచవలెను) ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను) ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి (కర్పూరమును వెలిగించాలి) శ్లో‘‘ వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ ‘ అవిఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా ‘‘ శ్రీ మహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. గణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. మమ ఇష్టకామ్యార్థ çఫలసిద్ధ్యర్థం గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి (గణపతికి పూజచేసిన అక్షతలు కొన్ని తీసుకొని శిరస్సున ఉంచుకొనవలెను.) శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి (పసుపు గణపతిని తూర్పునకు కొద్దిగా జరిపి మరల యథాస్థానంలో పెట్టాలి) వరసిద్ధి వినాయక పూజా ప్రారంభం స్వామిన్, సర్వజగన్నాథ యావత్పూజావసానగా తావత్త్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధింకురు ధ్యానం: స్వామివారి రూపాన్ని ఊహించుట (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకుని గణపతికి నమస్కరిస్తూ ఈ కింది ప్రార్థన చేసిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి) ఓం భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం‘‘ విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహం భజే‘‘ ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం‘‘ పాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధి వినాయకమ్‘‘ ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం ‘‘ భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకమ్ ‘‘ ద్యాయేద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం‘‘ చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితాం ‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధివినాయక స్వామినే నమః ధ్యాయామి. (వినాయకుని ధ్యానించండి...) ప్రాణప్రతిష్ఠ: (స్వామివారికి ప్రాణంపోయుట) ఓమ్ అసునీతే పునరస్మాను చక్షుః పునఃప్రాణ మిహనో దేహి భోగమ్‘ జ్యోక్పశ్యేమ సూర్యముచ్ఛరంత మనుమతే మృఢయాన స్వస్తి అమృతం నై ప్రాణాః ‘ ప్రాణానేవ యథాస్థాన మువహ్వ యతే ‘‘ స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకమ్‘ తావత్త్వం ప్రతిభావేన ప్రతి మేస్మిన్ సన్నిధిం కురు‘‘ సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్రం పరివార సమేతం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిన్ ఆవాహితో భవ, స్థాపితో భవ, సుముఖోభవ, సుప్రసన్నోభవ, వరదో భవ, స్థిరాసనంకురు, ప్రసీదః ప్రసీదః ప్రసీదః‘‘ ఆవాహనమ్: స్వామివారిని పిలవటం స్వామివారు వచ్చినట్లుగా భావించటం. (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకుని గణపతికి ఆసనం చూపుతూ నమస్కరించి ఈ కింది శ్లోకాన్ని చదివిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి) అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర‘ అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః ఆవాహయామి‘‘ ఆసనమ్: స్వామివారు మనముందు ఆసనముపై కూర్చుండినట్లు ఊహించటం (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకొని గణపతికి నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకాన్ని చదివిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి). మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం! రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః నవరత్నఖచిత సింహాసనార్థ పుష్పాక్షతాన్ సమర్పయామి‘‘ పాద్యమ్: స్వామివారి పాదాలకు నీళ్ళు సమర్పించి పాదాలు కడుగుతున్నట్లు భావించడం (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దికొద్దిగా చల్లాలి) శ్లో‘‘ సర్వతీర్థ సముద్భూతం‘‘ పాద్యం గంగాది సంయుతం‘‘ విఘ్నరాజ! గృహాణేదం‘‘ భగవన్భక్త వత్సల‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః తమ పాదయోః పాద్యం సమర్పయామి‘‘ అర్ఘ్యమ్: స్వామివారి చేతులకు నీళ్ళు ఇచ్చుట (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దికొద్దిగా చల్లాలి) గౌరీపుత్ర నమస్తేస్తు! శంకర ప్రియనందన! గృహాణార్ఘ్యం మయాదత్తం గంధపుష్పాక్షతైర్యుతం‘‘ శ్రీ సిద్ధిబుద్ధిసమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి‘‘ ఆచమనీయమ్: స్వామివారి నోటికి నీళ్ళు అందించడం తాగుతున్నట్లు భావించుట (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దిగా చల్లాలి) అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజితః గృహాణాచమనం దేవః తుభ్యం దత్తం మయా ప్రభో‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి‘‘ మధుపర్కం: పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార వీటిని కలిపి స్వామివారికి అందించుట (గణపతికి మధుపర్కం సమర్పించాలి) దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం‘‘ మధుపర్కం గృహాణేదం గణనా«థం నమోస్తుతే‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మధుపర్కం సమర్పయామి. పంచామృత స్నానమ్: పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, వీటితో అభిషేకించేటట్లు భావించుట (పంచామృతాలతో ఈ కింద చెప్పిన వరుసలో గణపతికి అభిషేకం చేయాలి) పాలు: ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వతస్సోమ వృషిణ యం‘ భవా వాజన్య సంగధే‘‘ శ్రీ సిద్ధిబుద్ధిసమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః క్షీరేణ స్నపయామి‘‘ పెరుగు: ఓం దధిక్రాపుణ్ణో ఆకారిషం‘ జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్‘ ప్రణ ఆయూగ్ంషి తారిషత్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః దధ్నా స్నపయామి‘‘ నేయి: ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునా త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో స్సూర్యన్యరశ్మిభిః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః ఆజ్యేన స్నపయామి‘‘ తేనె: ఓం మధువాతా బుుతాయతే‘ మధుక్షీరంతి సింధవః మాధ్వీర్నస్సంత్వోషధీ!‘ మధునక్తముతోషసి మధుమత్వార్థినగ్ం రజః‘ మధుద్యైరస్తునః పీతా‘ మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తుసూర్యః మాధ్వీర్గావో భవంతునః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మధునా స్నపయామి‘‘ పంచదార: ఓం స్వాదుఃపవన్వ దివ్యాజన్మనే‘ స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే‘ స్వాదుర్మి త్రాయ వరుణాయ వాయమే‘ బృహస్పతయే మధుమాగ్ం ఆదాభ్యః‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః శర్కరేణ స్నపయామి‘‘ (మిగిలిన పంచామృతాలన్నింటినీ ఈ క్రింది శ్లోకం చెబుతూ అభిషేకం చేయాలి) స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక‘ అనాథనాథ‘ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి. ఫలోదకమ్: (కొబ్బరినీటితో అభిషేకం చేయాలి) యాః ఫలినీర్యా ఫలాపుష్పాయాశ్చ పుష్పిణీః‘ బృహస్పతి ప్రసూతాస్తానో ముంచస్త్యగ్ంహనః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః ఫలోదకేన స్నపయామి‘‘ శుద్ధోదకమ్: మంచి నీటితో స్వామిని అభిషేకించునట్లుగా భావించడం (ఈ కింది శ్లోకంతో కలశంలోని నీటితో అభిషేకం చేయాలి. ఇక్కడ గణపతి ఉపనిషత్తు, పురుషసూక్త, నమకచమకాదులతో యథాశక్తి అభిషేకం చేయవచ్చు) గంగాది సర్వతీర్థేభ్యః అహృతైరమలైర్జలైః స్నానం కురుష్వ భగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి‘‘ స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి‘‘ (అంటూ కలశంలోని పుష్పంతో నీటిని పళ్ళెంలో విడవాలి. తరువాత ప్రతిమను వస్త్రంతో తుడిచి గంధం కుంకుమలతో అలంకరించి యథాస్థానంలో ఉంచాలి.) వస్త్రమ్: (నూతన వస్త్రములనుగాని, పత్తితో చేసిన వస్త్రద్వయాన్నిగాని ఈ కింది శ్లోకం చదివాక గణపతి పాదాలవద్ద ఉంచాలి) రక్తవస్త్రద్వయంచారు దేవయోగ్యంచ మంగళం‘ శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి‘‘ యజ్ఞోపవీతమ్: (పత్తితో చేసిన యజ్ఞోపవీతాన్ని గాని, పుష్పాక్షతలను గాని దేవునివద్ద ఉంచాలి) రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనంచోత్తరీయకం‘ గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి‘‘ గంధమ్: (ఒక పుష్పాన్ని చందనంలో ముంచి గణపతి పాదాల వద్ద ఉంచాలి) చందనాగరుకర్పూర కస్తూరీ కుంకుమాన్వితం‘ విలేపనం సురశ్రేష్ఠ! ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయకస్వామినే నమః గంధాన్ ధారయామి. అక్షతలు: (అక్షతలను దేవుని పాదాల వద్ద ఉంచాలి) అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్‘ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి‘‘ సింధూరం: శ్లో‘‘ ఉద్యద్భాస్కర సంకాశం‘‘ సంధ్యా వదరుణంప్రభో‘‘ వీరాలంకరణం దివ్యం‘‘ సింధూరం ప్రతిగృహ్యతాం‘‘ శ్రీ సిద్ధిబుద్ధి నమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః సింధూరం సమర్పయామి‘‘ మాల్యం: శ్లో‘‘ మాల్యాదీవి సుగంధాని‘‘ మాలత్యా దీనివై ప్రభో‘‘ మయాహృతాని పుష్పాణి‘‘ ప్రతిగృహ్ణీష్య శాంకర‘‘ శ్రీ సిద్ధిబుద్ధి నమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః మాల్యం సమర్పయామి‘‘ పుష్పమ్: (సుగంధ పుష్పాలను దేవుని పాదాల వద్ద ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పం చొప్పున అధాంగపూజ, అష్టోత్తరాలను చెబుతూ అలంకరణ చేయాలి. పుష్పాలు సరిపోని పక్షంలో అక్షతలతో పూజించవచ్చు). సుగన్ధానిచ పుష్పాణి జాజీకుందముఖానిచ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే‘ శ్రీ సిద్ధిబుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః పుష్పైః పూజయామి‘‘ అధాంగ పూజా: (స్వామి వారి అంగాన్ని ఒక్కొక్కటిగా అర్చించుట) గణేశాయ నమః పాదౌ పూజయామి‘ ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి‘ విఘ్నరాజాయ నమః జానునీ పూజయామి‘ కామారిసూనవే నమః జంఘే పూజయామి‘ అఖువాహనాయ నమః ఊరుః పూజయామి‘ హేరంబాయ నమః కటిం పూజయామి‘ లంబోదరాయ నమః ఉదరం పూజయామి‘ గణనాథాయ నమః హృదయం పూజయామి‘ స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి‘ పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి‘ గజవక్త్రా్తయ నమః వక్త్రం పూజయామి‘ విఘ్నహంత్రే నమః నేత్రౌ పూజయామి‘ శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి‘ ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి‘ సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి‘ శ్రీ గణాధిపాయ నమః సర్వాణ్యంగాని పూజయామి‘‘ ఏకవింశతి పత్ర పూజ ఏకవింశతి పత్రిపూజ సమయంలో పత్రితోనే పూజించాలి. దూర్వాయుగ్మ పూజ సందర్భంలో గరికతో పూజించాలి. లేని పక్షంలో అక్షతలతో పూజించాలి. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి‘ (మాచి ఆకు) ఓం గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి‘ (బలురక్కసి లేక ములక) ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి‘ (మారేడు) ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి‘ (గరికె రెమ్మలు) ఓం çహరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి‘ (ఉమ్మెత్త ఆకు) ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి‘ (రేగు ఆకు) ఓం గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి‘ (ఉత్తరేణి) ఓం గజకర్ణకాయ నమః తులసీ పత్రం పూజయామి‘ (తులసి) ఓం ఏకదంతాయ నమః చూత పత్రం పూజయామి‘ (మామిడి ఆకు) ఓం వికటాయనమః కరవీర పత్రం పూజయామి‘ (గన్నేరు ఆకు) ఓం భిన్న దంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి‘ (విష్ణుక్రాంతం) ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి‘ (దానిమ్మ) ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి‘ (దేవదారు) ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి‘(మరువం) ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి‘ (వావిలాకు) ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి‘ (జాజి తీగ ఆకు) ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి‘ (దేవకాంచనం) ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి‘ (జమ్మి ఆకు) ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి‘ (రావి ఆకు) ఓం సుర సేవితాయ నమః అర్జునపత్రం పూజయామి‘ (తెల్లమద్ది) ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి‘ (జిల్లేడు ఆకు) ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాణి పూజయామి‘‘ (21 రకముల ఆకులను కలిపి వేసి నమస్కారము చేయవలెను) ఏకవింశతి దూర్వాయుగ్మ పూజ (రెండు, రెండు గరికలుగా స్వామిని అర్చించాలి) గణాధిపాయ నమః దుర్వాయుగ్మం పూజయామి! పాశాంకుశధరాయనమః దుర్వాయుగ్మం పూజయామి! ఆఖువాహనాయ నమః దుర్వాయుగ్మం పూజయామి! వినాయకాయనమః దుర్వాయుగ్మం పూజయామి! ఈశపుత్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి! సర్వసిద్ధిప్రదాయ నమః దుర్వాయుగ్మం పూజయామి! ఏకదంతాయనమః దుర్వాయుగ్మం పూజయామి! ఇభవక్త్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి! మూషికవాహనాయ నమః దుర్వాయుగ్మం పూజయామి! కుమారగురవే నమః దుర్వాయుగ్మం పూజయామి! కపిలవర్ణాయనమః దుర్వాయుగ్మం పూజయామి! బ్రహ్మచారిణేనమః దుర్వాయుగ్మం పూజయామి! మోదకహస్తాయనమః దుర్వాయుగ్మం పూజయామి! సురశ్రేష్ఠాయనమః దుర్వాయుగ్మం పూజయామి! గజనాసికాయ నమః దుర్వాయుగ్మం పూజయామి! కపిత్థఫలప్రియాయనమః దుర్వాయుగ్మం పూజయామి! గజముఖాయనమః దుర్వాయుగ్మం పూజయామి! సుప్రసన్నాయనమః దుర్వాయుగ్మం పూజయామి! సురాగ్రజాయనమః దుర్వాయుగ్మం పూజయామి! ఉమాపుత్రాయనమః దుర్వాయుగ్మం పూజయామి! స్కందప్రియాయనమః దుర్వాయుగ్మం పూజయామి! శ్రీ వరసిద్ధి వినాయకాయస్వామినే నమః ఏకవింశతి – దుర్వాయుగ్మం సమర్పయామి శ్రీ గణపతి అష్టోత్తర శతనామావళి ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్వైమాతురాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతినే నమః ఓం సుప్రదీపాయ నమః ఓం సుఖనిధయే నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం సురారిఘ్నాయ నమః ఓం మహాగణపతయే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం లంబకర్ణాయ నమః ఓం హ్రస్వగ్రీవాయ నమః ఓం మహోదరాయ నమః ఓం మహోత్కటాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మంత్రిణే నమః ఓం మంగళస్వరూపాయ నమః ఓం ప్రమధాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం విఘ్నకర్త్రే నమః ఓం విఘ్నహంత్రే నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాటత్పయే నమః ఓం శ్రీపతయే నమః ఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం బలాయ నమః ఓం బలోద్ధితాయ నమః ఓం భవాత్మజాయ నమః ఓం పురాణపురుషాయ నమః ఓం పూష్ణే నమః ఓం పుష్కరక్షిప్తవారిణే నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం మంత్రకృతే నమః ఓం చామీకరప్రభాయ నమః ఓం సర్వాయ నమః ఓం సర్వోపన్యాసాయ నమః ఓం సర్వకర్త్రే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం సర్వసిద్ధయే నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుమార గురవే నమః ఓం అక్షోభ్యాయ నమః ఓం కుంజరాసుర భంజనాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కపిత్థఫలప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం బ్రహ్మవిద్యాధిపాయ నమః ఓం విష్ణవే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తజీవితాయ నమః ఓం జితమన్మథాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం జ్యాయనే నమః ఓం యక్షకిన్నరసేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీరనినదాయ నమః ఓం వటవే నమః ఓం అభీష్టవరదాయినే నమః ఓం జ్యోతిషే నమః ఓం భక్తనిధయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం అపాకృతపరాక్రమాయ నమః ఓం సత్యధర్మిణే నమః ఓం సఖ్యే నమః ఓం సరసాంబునిధయే నమః ఓం మహేశాయ నమః ఓం దివ్యాంగాయ నమః ఓం మణికింకిణీ మేఖలాయ నమః ఓం సమస్తదేవతామూర్తయే నమః ఓం సహిష్ణవే నమః ఓం సతతోత్థితాయ నమః ఓం విఘాతకారిణే నమః ఓం విశ్వక్దృశే నమః ఓం విశ్వరక్షాకృతే నమః ఓం కళ్యాణ గురవే నమః ఓం ఉన్మత్తవేషాయ నమః ఓం అపరాజితే నమః ఓం సమస్త జగదాధారాయ నమః ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః ఓం ఆక్రాన్తచిదచిత్ప్రభవే నమః ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః శ్రీసిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. బిల్వం: శ్లో‘‘ త్రిదళం త్రిగుణాకరం‘‘ త్రినేత్రంచ త్రియాయుధం‘‘ త్రిజన్మ పాప సంహారం‘‘ ఏకబిల్వం శివార్పణం ‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః బిల్వపత్రం సమర్పయామి. ధూపమ్: (అగరువత్తులను వెలిగించి ఆ ధూపాన్ని గణపతికి కుడి చేతితో చూపించాలి. అంతేగాని అగరువత్తులను చుట్టూ తిప్పకూడదు) దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం‘‘ ఉమాసుత నమస్తుభ్యం గృçహాణవరదో భవ‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః ధూపమాఘ్రాపయామి. దీపమ్: (కర్పూర దీపాన్ని గాని, నేతి దీపాన్ని గాని కుడిచేతితో భగవంతునికి చూపాలి) సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాద్యోతితం మయా‘ గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే‘‘ శ్రీసిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః దీపం దర్శయామి‘‘. నైవేద్యమ్: (గణపతికి నివేదించాల్సిన అన్ని ఫలాలను, పిండి వంటలను పళ్ళెంలో ఒక ఆకువేసి ఆ ఆకులో పెట్టి ఉంచాలి. వాటిపై ఈ కింది మంత్రంతో నీళ్ళు చల్లాలి) ఓమ్ భూర్భువస్సువః‘ ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి‘ ధియోయనః ప్రచోదయాత్‘‘ (పుష్పంతో నీటిని పదార్థాల చుట్టూ తిప్పాలి) ఓమ్ సత్యంత్వర్తేన పరిషించామి‘‘ ఓమ్ బుుతంత్వా సత్యేన పరిషించామి‘‘ సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం దేవగణముదై్గః ప్రకల్పితాన్‘ భక్ష్యం భోజ్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ‘ ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః మహానైవేద్యం సమర్పయామి. (పుష్పంతో నీటిని రెండుసార్లు పళ్ళెంలో విడిచిపెట్టాలి) ఓమ్ అమృతమస్తు! ఓమ్ అమృతోపస్తరణమసి‘‘ (అయిదుసార్లు ఎడమచేతితో కుడిమోచేయిని పట్టుకుని కుడిచేతితో గణపతివైపు నైవేద్యాన్ని చూపాలి) ఓమ్ ప్రాణాయ స్వాహా‘ ఓమ్ అపానాయ స్వాహా‘ ఓమ్ వ్యానాయ స్వాహా‘ ఓమ్ ఉదానాయ స్వాహా ఓమ్ సమానాయ స్వాహా‘‘ (తరువాత సమర్పయామి అన్నప్పుడల్లా పుష్పంతో పళ్ళెంలో నీళ్ళు వదలాలి) మధ్యే మధ్యే పానీయం సమర్పయామి‘ అమృతాపి« దానమసి ఉత్తరాపోశనం సమర్పయామి‘ హస్తౌ ప్రక్షాళయామి‘ పాదౌప్రక్షాళయామి‘ శుద్ధాచమనీయం సమర్పయామి‘‘. తాంబూలమ్: (మూడు తమలపాకులు, వక్కలు, అక్షతలు, పుష్పం, ఫలం సుగంధ ద్రవ్యాలు, దక్షిణలతో తాంబూలాన్ని గణపతి వద్ద ఉంచాలి) పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం‘ కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీసిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః తాంబూలం సమర్పయామి‘‘ శ్రీ గణేష ప్రార్థన తుండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్ కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జౖయె యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్‘ తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటినందన నీకు మ్రొక్కెదన్ ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన చేసెద నేకదంత నా వలపటి చేతి గంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడెద దైవగణాధిప‘ లోకనాయకా! తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా దలచితినే హేరంబుని దలచితి నా విఘ్నముల దొలగుట కొఱకున్ అటుకులు కొబ్బరిపలుకులు చిటిబెల్లము నానుబ్రాలు చెరకు రసంబున్ నిటలాక్షు నగ్రసుతునకు పటుతరముగ విందుసేతు ప్రార్థింతు మదిన్ శ్రీ వినాయకుని దండకము శ్రీ పార్వతీపుత్ర లోకత్రయీస్తోత్ర, సత్పుణ్యచారిత్ర, భద్రేభవక్త్రా మహాకాయ, కాత్యాయనీనాథ సంజాత స్వామీ శివాసిద్ధి విఘ్నేశ, నీ పాదపద్మంబులన్, నీదు కంఠంబు నీ బొజ్జ నీ మోము నీ మౌళి బాలేందు ఖండంబు నీ నాల్గు హస్తంబులన్నీ కరాళంబు నీ పెద్ద వక్త్రంబు దంతంబు నీ పాద యుగ్మంబు లంబోదరంబున్ సదా మూషికాశ్వంబు నీ మందహాసంబు నీ చిన్ని తొండంబు నీ గుజ్జు రూపంబు నీ శూర్పకర్ణంబు నీ నాగ యజో›్ఞపవీతంబు నీ భవ్యరూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీ గంధమున్ గుంకుమం బక్షతలాజులున్ చంపకంబున్ తగన్ మల్లెలన్మొల్లలన్మంచి చేమంతులున్ తెల్లగన్నేరులన్ మంకెనల్ పొన్నలన్ పువ్వులు న్మంచి దుర్వంబు లందెచ్చి శాస్త్రోక్తరీతిన్ సమర్పించి పూజించి సాష్టాంగంబు జేసి విఘ్నేశ్వరా నీకు టెంకాయలుం పొన్నంటిపండున్ మరిన్మంచివౌ ఇక్షుఖండంబులున్, రేగుబండ్లప్పడాల్ వడల్ నేతిబూరెల్ మరీస్ గోధుమప్పంబులు న్వడల్ పున్గులున్ గారెలున్ చొక్కమౌ చల్మిడిన్ బెల్లమున్ తేనెయుం జున్ను బాలాజ్యమున్నాను బియ్యంబు చామ్రంబు బిల్వంబు మేల్ బంగరున్ బళ్లెమం దుంచి నైవేద్యముంబంచనీ రానంబున్ నమస్కారముల్జేసి విఘ్నేశ్వరా నిన్ను బూజింపకే యన్యదైవంబుల్ ప్రార్థనల్చే యుటల్ కాంచనం బొల్లకే యిన్ముదాగోరు చందంబుగారే మహాదేవ యో భక్తమందారయో సుందరాకార యో భాగ్యగంభీర యో దేవ చూడామణీ లోకరక్షామణీ బంధు చింతామణీ స్వామి నిన్నెంచ నేనెంత నీదాస దాసాదిదాసుండ శ్రీ దంత రాజన్వయుండ రామాభిదాసుండ నన్నిప్డు చేపట్టి సుశ్రేయునింజేసి శ్రీమంతుగన్జూచి హృత్పద్మసింహాస నారూఢతన్నిల్పి కాపాడుటే కాదు నిన్గొల్చి ప్రార్థించు భక్తాళికిన్ కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్విద్య యున్నాడియున్ బుత్ర పౌత్రాభివృద్ధిన్ దగన్గల్గగాజేసి పోషించుమంటిన్ గృపన్ గావుమంటిన్ మహాత్మా! ఇవే వందనంబుల్ శ్రీ గణేశా నమస్తే.. నమస్తే...నమః నీరాజనమ్: (హారతి కర్పూరాన్ని వెలిగించి ఆ దీపాన్ని తిప్పుతూ గణపతికి చూపించాలి) ఘృతవర్తిసహస్రైశ్చ కర్పూర శకలైస్తదా‘ నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ‘‘ సమ్రాజంచ విరాజంచ అభిశ్రీః యాచనోగృహే లక్ష్మీ రాష్ట్రయాముఖే తయామా సగ్ం సృజామసి‘‘ సంతత శ్రీరస్తు‘ సమస్త సన్మంగళానిభవంతు‘ నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః నీరాజనం దర్శయామి‘‘ నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి‘‘ (అని పుష్పంతో పళ్ళెంలో నీటిని విడవాలి) మంత్రపుష్పమ్: (ఇక్కడ మంత్రపుష్పాన్ని పెద్దదిగాని, చిన్నదిగాని చెప్పవలెను. రానివారు ఈ శ్లోకాలతో మంత్రపుష్పాన్ని సమర్పించాలి) గణాధిప నమస్తేస్తు ఉమాపుత్రా విఘ్ననాశక‘ వినాయకేశ తనయ సర్వసిద్ధి ప్రదాయక‘‘ ఏకదంతైక వదన తథా మూషికవాహన‘ కుమారగురవే తుభ్యమర్పయామి సుమాంజలిమ్‘‘ తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి‘ తన్నోదంతిః ప్రచోదయాత్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మప్రదక్షిణ నమస్కారమ్: (పువ్వులు, అక్షతలు తీసుకుని లేచి నిలబడి నమస్కారం చేయాలి. అంతేగాని తనచుట్టూ తాను తిరగకూడదు) ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ‘ నమస్తే విఘ్నరాజాయ‘ నమస్తే విఘ్ననాశన‘‘ యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ‘ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదేపదే‘ పాపోహం పాపకర్మానాం పాపాత్మా పాపసంభవః త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల‘ అన్యాధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ‘ తస్మాత్కారుణ్యభావేన రక్షరక్ష గణాధిప‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ప్రార్థన: (పుష్పాక్షతలతో ప్రార్థించి, తరువాత వాటిని గణపతి పాదాల వద్ద ఉంచాలి) నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశక‘ ఈప్సితంమే వరందేహి పరత్రచ పరాంగతిమ్‘‘ వినాయక నమస్తుభ్యం సతతం మోదకప్రియ‘ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా‘‘ అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా పుత్రోయమితి మామత్వా క్షమస్వ గణనాయక‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి‘‘ సాష్టాంగ నమస్కారమ్ ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా‘ పాదాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి‘‘ శ్లో‘‘ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపతి యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనేన పూజావిధానేన శ్రీ మహాగణాధిపతి సుప్రీత స్సుప్రసన్నో వరదోభవతు. (నేను చేసిన పూజలో మంత్రలోపము, క్రియాలోపము, భక్తి లోపము ఉన్నను అవన్నీ మన్నించి గణపతి దేవా పరిపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించుము.) అపరాధ ప్రార్థన: అపరాధ సహస్రాణి క్రియంతేహం అహర్నిశా‘ పుత్రోయమితి మామత్వా క్షమస్వ గణనాయక‘‘ ఆవాహనం నజానామి నజానామి విసర్జనం‘ పూజాంచైవ నజానామి క్షమ్యతాం గణనాయక‘‘ శ్రీ వరసిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయకస్వామినే నమః అపరాధ నమస్కారాన్ సమర్పయామి‘‘ (రెండు చేతులు జోడించి గణపతికి నమస్కరించి, చెంపలు వేసుకోవాలి). (ఈ కింది మంత్రాలను చెబుతూ కొన్ని అక్షతలు చేతిలో తీసుకొని నీటితో పళ్ళెంలో విడిచిపెట్టాలి) అనేక మయాకృతేన కల్పోక్త ప్రకారేణ గణపతి అష్టోత్తర శతనామ సహిత యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజానేన భగవాన్ సర్వాత్మకః శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామిన్ సుప్రీతః సుప్రసన్నః వరదో భవతు. -
'శ్రీరామ్' టాటూ వేయించుకున్న ముస్లిం యువతి
అయోధ్య : రామాలయ నిర్మాణ శంకుస్థాపనకు సంబంధించిన పూజా కార్యక్రమాలు అయోధ్యలో ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్మాణానికి భూమి పూజ ఈ బుధవారం జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందూ-ముస్లింల ఐక్యతకు అద్దం పడుతూ నిదర్శనంగా నిలిచింది బెనారస్కు చెందిన ఇక్రా ఖాన్ అనే ముస్లిం యువతి. తన చేతిమీద 'శ్రీరామ్' అనే అక్షరాలను పచ్చబొట్టు వేయించుకుంది. తనతో పాటే ఎంతోమంది ముస్లిం సోదరులు సైతం శ్రీరాముని ఆలయ నిర్మాణం పట్ల సంతోషంగా ఉన్నారని తెలిపింది. లక్షలాది హిందువులు కలలు కన్న శ్రీరాముని ఆలయం నిర్మించాలన్న కోరిక తనకు కూడా ఉందని, ఈ క్షణం కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నానని పేర్కొంది. అయోధ్యలో శ్రీరాముని ఆలయ నిర్మాణ పనులకు ముందే హిందూ- ముస్లిం ఐక్యతను చాటిచెప్పేందుకే తాను ఈ టాటూ వేయించుకున్నట్లు తెలిపింది. అంతేకాకుండా తాను ప్రధాని నరేంద్ర మోదీ అభిమాని అని ఇక్రా ఖాన్ వెల్లడించింది. (భూమి పూజకు శ్రీకారం) శ్రీరాముని టాటూ వేయమని అడిగినప్పడు ఆమె ముస్లిం యువతి తెలిసి చాలా షాక్ అయ్యనని టాటూ దుకాణపు ఓనర్ అశోక్ గోగియా తెలిపారు. వారణాసిలోని సిగ్రా నగరంలో ఉన్న టాటూ దుకాణాన్ని గత కొన్నేళ్లుగా నడుపుతున్నానని, ఓ ముస్లిం యువతి శ్రీరాముని టాటూ వేయించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆగస్టు 5 లోపు శ్రీరాముని టాటూలు వేయించుకున్న వారికి ఉచితంగా టాటూలు వేస్తానని ప్రకటించారు. ముస్లిం యువతి ప్రేరణతోనే తాను ఈ ఆఫర్ ప్రకటించానని అశోక్ వెల్లడించారు. ఇప్పటికే అయోధ్యతో పాటు కాశీలోని ప్రధాన దుకాణాలన్నీ శ్రీరాముని విగ్రహాలు, పటాలతో నిండిపోయాయి. రేపు (బుధవారం) జరగనున్న భూమి పూజకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. (మోదీ శపథం.. 28 ఏళ్ల తరువాత తొలిసారి) -
భూమి పూజకు శ్రీకారం
అయోధ్య: అయోధ్యలో రామాలయ నిర్మాణ శంకుస్థాపనకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్మాణానికి భూమి పూజ ఈ బుధవారం జరగనున్న విషయం తెలిసిందే. ఆలయ నిర్మాణం జరిగే రామ జన్మభూమి వద్ద సోమవారం 12 మంది పూజారులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. గణపతి పూజ జరిపారు. అయోధ్యలోని హనుమాన్ గఢి ఆలయంలో మంగళవారం పూజాకార్యక్రమం నిర్వహిస్తారు. భూమి పూజ కార్యక్రమ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్, ట్రస్ట్ చీఫ్ నృత్య గోపాలదాస్ మహారాజ్, యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రమే ఉంటారు. కరోనా ముప్పు పొంచి ఉన్న పరిస్థితుల్లో ఆహ్వానితులు మాత్రమే భూమి పూజ కార్యక్రమానికి రావాలని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విజ్ఞప్తి చేశారు. ఆహ్వానాలు పంపిన 175 మందిలో 135 మంది పలు సంప్రదాయ మఠ, ఆధ్యాత్మిక గురువులేనని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర వెల్లడించింది. రామ మందిర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ నాయకురాలు ఉమా భారతి.. భూమిపూజ కార్యక్రమానికి హాజరు కావడం లేదని ప్రకటించారు. ఉద్ధవ్ ఠాక్రే వెళ్లకపోవచ్చు అయోధ్యలో రామాలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి బుధవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హాజరు కాకపోవచ్చని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ‘అయోధ్యలో కరోనా పరిస్థితి సీరియస్గా ఉంది. కోవిడ్–19తో ఒక యూపీ మంత్రి కూడా చనిపోయారు. మరో ముగ్గురు మంత్రులకు సోకింది. ఈ పరిస్థితుల్లో భూమి పూజ కార్యక్రమానికి ఎంత తక్కువ మంది వెళ్తే అంత మంచిది’ అన్నారు. రత్నాలు పొదిగిన దుస్తులు భూమి పూజ రోజు ‘రామ్లల్లా’కు అలంకరించే వస్త్రాలను శంకర్లాల్, భగవత్ లాల్ సోదరులు రూపొందిస్తున్నారు. మూడున్నర దశాబ్దాలుగా వారు బాల రాముడికి వ స్త్రాలను రూపొందిస్తున్నారు. ‘1985లో మా నాన్న బాబూలాల్ బాల రాముడికి వ స్త్రాలు రూపొందించడం ప్రారంభించారు. కుట్టుమిషన్తో పాటు రామజన్మభూమికి వెళ్లి, అక్కడే రామ్లల్లా విగ్రహం ముందే దుస్తులు కుట్టేవారు. మా ఇద్దరిని కూడా వెంట తీసుకువెళ్లేవారు’ అని శంకర్లాల్ తెలిపారు. ‘5న రామ్లల్లాకు అలంకరించడం కోసం రెండు జతల దుస్తులను రూపొందిస్తున్నాం. మఖ్మల్ వస్త్రంతో బంగారు దారంతో నవ రత్నాలు పొదిగి ఒకటి ఆకుపచ్చ వర్ణంలో, మరొకటి నారింజ రంగులో సిద్ధం చేస్తున్నాం’ అని తలిపారు. కాగా, భూమి పూజ పనులను యూపీ సీఎం ఆదిత్య నాథ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అది శ్రీరాముడి కోరిక భూమి పూజ కార్యక్రమానికి తాను హాజరుకావడం శ్రీరామ చంద్రుడి కోరిక కావచ్చని అయోధ్య భూ వివాదంలో కక్షిదారు అయిన ఇఖ్బాల్ అన్సారీ వ్యాఖ్యానించారు. ఆలయ ట్రస్ట్ నుంచి తనకు ఆహ్వానం అందిందన్నారు. భూమిపూజ రోజు ప్రధాని మోదీకి రాముడి పేరు ఉన్న శాలువాను, రామచరిత మానస్ పుస్తకాన్ని బహూకరించాలనుకుంటున్నా అని అన్నారు. రామ్ లల్లా ఫొటోతో ముద్రితమైన ఆహ్వాన ప్రతి -
మహాకుంభాభిషేకంలో వైఎస్ జగన్
విశాఖ శారదాపీఠం వార్షికోత్సవ ముగింపు కార్యక్రమాలకు హాజరు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: లోకకల్యాణార్థం విశాఖ శ్రీశారదా పీఠం నిర్వహించిన మహాకుంభాభిషేకంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. సంప్రదాయ వస్త్రధారణతో జగన్ పీఠాధిపతి శ్రీ స్వరూపానదేంద్ర సరస్వతితో కలసి పీఠం వార్షికోత్సవ ముగింపు వేడుకల్లో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ నెల14న ప్రారంభమైన శ్రీశారదా పీఠం వార్షికోత్స ముగింపు వేడుకలు గురువారం నిర్వహించారు. గత ఏడాది కూడా శారదా పీఠం వార్షికోత్సవాలకు హాజరైన జగన్ ఈ ఏడాది పీఠం వార్షికోత్సవ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయం విశాఖ శివారు చినముషిడివాడలోని శారదాపీఠం చేరుకున్న జగన్కు వేదపండితులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. మంగళవాయిద్యాలతో ఆయన్ను పీఠం లోపలికి తోడ్కొని వెళ్లారు. సంప్రదాయ వస్త్రాలు ధరించిన అనంతరం జగన్ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిని కలుసుకుని ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతితో ఆయన పలు అంశాలపై ప్రత్యేకంగా దాదాపు గంటసేపు చర్చించారు. పీఠంలో ప్రత్యేక పూజలు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతితో కలసి పీఠంలోని సుబ్రహ్మణ్యస్వామి, శారదామాత, ఆదిశంకరాచార్యులు, దాసాంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాలను సందర్శించి, మహాకుంభాభిషేకంలో పాల్గొన్నారు. పవిత్ర పూజాసామాగ్రిని తాకి వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. పీఠంలోని శారదా మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
జనకల్యాణానికి వైఎస్ జగన్ పూజలు
శారదాపీఠంలో పలు పూజా కార్యక్రమాలు చెరకు రైతుల తరఫున పోరాటానికి హామీ అభిమానులు, పార్టీశ్రేణుల ఘనస్వాగం సంప్రదాయబద్ధంగా సాగిన పర్యటన విశాఖపట్నం: హైందవ సంప్రదాయానుసారం ఆధ్యాత్మిక కార్యక్రమాలు.. సంప్రదాయ వస్త్రధారణతో లోకకల్యాణం కాంక్షిస్తూ విశాఖ శారదా పీఠంలో పూజలు.. తుమ్మపాల చెరకు రైతుల వ్యథపై స్పందన.. వారికి అండగా ఉంటామని భరోసా.. పార్టీ నేతలు, అభిమానుల నివాసాలకు వెళ్లి ఆత్మీయ పలకరింపులు.. ఆశీర్వచనాలు.. ఇలా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటన ఆద్యంతం కోలాహలంగా సాగింది. విశాఖ శారదా పీఠం వార్షికోత్సవ ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన గురువారం నగరానికి వచ్చారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డితో కలసి వచ్చిన ఆయనకు విమానాశ్రయంలో పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, మాజీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, తైనాల విజయ్కుమార్, మళ్ల విజయ్ ప్రసాద్, కరణం ధర్మశ్రీ, కర్రి సీతారాం, సమన్వయకర్తలు తిప్పల నాగిరెడ్డి, కోలా గురువులు, వంశీకృష్ణ, అదీప్రాజ్, ప్రగడ నాగేశ్వరరావు, పెట్ల ఉమాశంకర్ గణేష్లతోపాటు పార్టీ నేతలు, కార్యకర్తలు సాదర స్వాగతం పలికారు. శారదా పీఠంలో ప్రత్యేక పూజలు విశాఖ శారదా పీఠం చేరుకున్న జగన్మోహన్రెడ్డికి వేదపండితులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో స్వాగతం పలికి మంగళవాయిద్యాలతో పీఠంలోకి తీసుకువెళ్లారు. సంప్రదాయ వస్త్రాలను ధరించిన అనంతరం వై.ఎస్.జగన్ పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతిని కలుసుకుని ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం స్వామీజీతో దాదాపు గంటపాటు ఏకాంతంగా సమావేశమై పలు ధార్మిక అంశాలపై చర్చించారు. పీఠంలో నిర్వహిస్తున్న మహాకుంభాభిషేకం, ఇతర పూజా కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. పీఠంలోని సుబ్రహ్మణ్యస్వామి, శారదామాత, ఆదిశంకరాచార్యులు, దాసాంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్న యాగశాలను సందర్శించారు. శారదా మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెక్కబల్లలతో నిర్మించిన మెట్లపై నడుచుకుంటూ శారదామాత ఆలయ శిఖరం వద్దకు చేరుకున్నారు. శిఖరానికి పవిత్ర పూలతో పూజలు చేశారు. పీఠంలో మహాపూర్ణాహుతిలో పాల్గొన్నారు. కపిల గోవుకు పూజలు చేశారు. చెరకు రైతులకు భరోసా రాష్ట్రంలో సహకార రంగంలో చక్కెర కర్మాగారాలను తమ సన్నిహితులకు కట్టబెట్టాలన్న చంద్రబాబు కుట్రను తిప్పికొడతామని వై.ఎస్.జగన్ భరోసా ఇచ్చారు. విమానాశ్రయం వద్ద తుమ్మపాల చెరకు రైతులు వై.ఎస్.జగన్ను కలుసుకున్నారు. తమ్ముపాల కార్మాగారంతోపాటు ఇతర చక్కెర కర్మాగారాలను కేంద్రమంత్రి సుజనా చౌదరికి కట్టబెట్టాలని సీఎం చంద్రబాబు కుట్రపన్నారని వారు వివరించారు. దీనిపై జగన్ స్పందిస్తూ ప్రభుత్వ కుట్రపై తాను, పార్టీ.. రైతులకు అండగా ఉంటామని, పోరాడతామని హామీ ఇచ్చారు. నూతన జంటలకు ఆశీర్వాదం - వంశీకృష్ణ నివాసంలో అల్పాహార విందు నగర పర్యటన సందర్భంగా వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పార్టీ నేతలు, అభిమానుల నివాసాలకు వెళ్లి వారిని ఆనందడోలికల్లో ముంచెత్తారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్లతో కలసి వై.ఎస్.జగన్ స్టీల్ప్లాంట్ గుర్తింపు యూనియన్ ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్ నివాసానికి వెళ్లారు. ఇటీవల వివాహమైన మంత్రి రాజశేఖర్ కుమార్తె, అల్లుడు మౌనిక, శివకల్యాణ్ దంపతులను ఆశీర్వదించారు. అనంతరం శివాజీపాలెంలోని తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్ నివాసంలో అల్పాహార విందుకు వై.ఎస్.జగన్ హాజరయ్యారు. వంశీకృష్ణ తూర్పు నియోజకవర్గ పార్టీ నేతలను ఆయనకు పరిచయం చేశారు. శారదా పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పెందుర్తిలోని జిల్లా పార్టీ కార్యదర్శి గొర్లె రామునాయుడు నివాసానికి వెళ్లారు. ఇటీవల వివాహమైన రామునాయుడు కుమార్తె, అల్లుడు మాధవి, నీరజ్ కుమార్ దంపతులను ఆశీర్వదించారు. పర్యటన ఆద్యంతం అభిమానుల కోలాహలం మధ్య సందడిగా సాగింది. వై.ఎస్.జగన్ను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. ఈ పర్యటనలో రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కంపా హనోక్, జాన్ వెస్లీ, రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి రవిరెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, ఉత్తరాంధ్ర మహిళా విభాగం ఇన్చార్జ్ వరుదు కల్యాణి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ఉషాకిరణ్, మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫారూకీ, మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడు షరీఫ్, నగర అధికార ప్రతినిధి అల్ఫా కృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి బుల్లిబాబు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.